India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కమలాపురం నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం రాష్ట్ర మాజీ కార్యదర్శి కాశీభట్ల సాయినాథ్ శర్మ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కమలాపురం మండలంలోని పెద్దచెప్పలిలో మంగళవారం సాయంత్రం ఆయన తన అభిమానులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దశాబ్దాలుగా టీడీపీలో ఉన్న ఆయన రాజీనామా చేయడంతో ఆ పార్టీకి భారీ షాక్ తగిలింది.
ఎన్నికల ప్రచార కార్యకలాపాలు చేపట్టాలనుకున్న రాజకీయ పార్టీల ప్రతినిధులు కేంద్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనల మేరకు ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.విజయ్ రామరాజు రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. కడప కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీ ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అనుమతి లేకుండా ప్రచార కార్యకలాపాలు నిర్వహిస్తే చర్యలు తప్పవన్నారు.
రాజుపాలెంలో మంగళవారం సాయంత్రం గడ్డివామి దగ్ధమైంది. రైతు కాచన జయచంద్ర రెడ్డి పశువుల మేత కోసం గడ్డివామి ఏర్పాటు చేసుకున్నారు. అకస్మాత్తుగా గడ్డివామిలో నుంచి మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల వారు గమనించి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈ సమాచారాన్ని ప్రొద్దుటూరు అగ్నిమాపక శాఖ అధికారులకు తెలపగా వారు హుటాహుటిన వచ్చి మంటలను అదుపు చేశారు. సుమారు లక్ష రూపాయలు నష్టం జరిగిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
నెల్లూరు నుంచి మైదుకూరు వైపు వెళుతున్న లోడు లారీ మంగళవారం బద్వేల్ పట్టణంలోని శేఖర్ థియేటర్ వద్దకు వచ్చేసరికి ఒక్కసారిగా ముందువైపు టైర్ పగలడంతో భారీ శబ్దం వచ్చింది. దీంతో అక్కడ ఉన్న వాహనదారులు, ప్రజలు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. లారీ నెమ్మదిగా రావడంతో ఎలాంటి ప్రమాదం సంభవించలేదు.
విజయవాడ సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో జనసేన నాయకుడు గంటా నరహరి వైసీపీలో చేరారు. వైసీపీ గెలుపులో తాను కూడా భాగస్వామిని అవుతానని గంటా నరహరి పేర్కొన్నారు. ఇటీవలే ఈయన టీడీపీ నుంచి జనసేనలోకి చేరారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.
రైల్వే కోడూరు మండలం మారావారిపల్లి వద్ద ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొనడంతో ఇద్దరు విద్యార్తులు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ సాహిల్, జస్వంత్ను తిరుపతి హాస్పిటల్కి తరలించామని తెలిపారు. సెట్టిగుంట పంచాయతీ లక్ష్మీ గారి పల్లె ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న వీరు కోడూరులో పదో తరగతి పరీక్ష రాసి తమ గ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని వారు పేర్కొన్నారు.
రాయచోటిలోని 22వ వార్డులో ఇంటింటి ప్రచారంలో టీడీపీ శాసనసభ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా ఓ షాప్ వద్ద ఇస్త్రీ చేస్తూ కనిపించాడు. అనంతరం వారు మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమం, టీడీపీతోనే సాధ్యమన్నారు. ప్రతి ఒక్కరూ టీడీపీ విజయానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ఓ వ్యక్తిపై కోడి కత్తులతో దాడి చేసిన ఘటన మంగళవారం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో వెలుగుచూసింది. పోలీసుల కథనం.. పులివెందులకు చెందిన శ్రీనివాసులు తన చెల్లెలును మదనపల్లి(మం) సీటీఎంలోని శేఖర్కి ఇచ్చి పెళ్లి చేశాడు. భర్త చనిపోవడంతో ఆ ఆస్తిపై బంధువులు కన్నేసి ఆమెను బెదిరిస్తుండడంతో అన్నకు ఫోన్ చేసింది. సీటీఎం వచ్చి నిలదీసిన శ్రీనివాసులును ఇద్దరు వ్యక్తులు కోడికత్తులతో దాడిచేసి హత్యయత్నానికి పాల్పడ్డారు.
ముందస్తు చర్యలు చేపట్టి తాగునీటి కొరత, వడదెబ్బ వంటి వేసవి సమస్యలను అధిగమించాలని కడప జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు అధికారులను ఆదేశించారు. తాగునీటి కొరత, వేసవి వడగాల్పులు, వడదెబ్బ, ముందస్తు జాగ్రత్త చర్యలు” పై తన ఛాంబర్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందస్తుగానే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో దీనిపై ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
రాయచోటిలో 1952 నుంచి 17సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే గడికోట శ్రీంకాత్ రెడ్డి 2009 నుంచి వరుసగా 4సార్లు గెలుపొందారు. 2012 ఎన్నికల్లో TDP అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యంపై 56,891 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ అధిష్ఠానం మరోమారు అవకాశం ఇచ్చింది. కాగా TDP నుంచి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈసారి ఇరువురిలో ఎవరు విజయం సాధించనున్నారు. కామెంట్ చేయండి.
Sorry, no posts matched your criteria.