India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కమలాపురంలో TDP అభ్యర్థిని మార్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. పుత్తా నరసింహారెడ్డికి కాకుండా కుమారుడు చైతన్యరెడ్డికి అధిష్ఠానం టికెట్ ఇచ్చింది. దీంతో పార్టీ శ్రేణుల్లో ఒకింత అసహనం ఏర్పడింది. ఆదివారం చంద్రబాబు జిల్లా నేతలకు బీఫారాలు ఇవ్వగా ఇందులో చైతన్య చంద్రబాబు వద్ద కమలాపురం సీటు తన తండ్రికి ఇస్తే బాగుంటుందని, దాని వలన చేకూరే లబ్ధిని వివరించారు. పరిశీలిస్తామని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం.
నేడు ఒంటిమిట్ట రాములోరి కల్యాణోత్సవం సందర్భంగా రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు, కొరత లేకుండా 100 ప్రత్యేక బస్సులను పలు ముఖ్యప్రాంతాల నుంచి రూట్ల వారీగా కేటాయించామని ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి గోపాల్ రెడ్డి తెలిపారు. కడప డిపో నుంచి 35 బస్సులు, పులివెందుల 10, బద్వేలు 20, జమ్మలమడుగు 10, మైదుకూరు 5, ప్రొద్దుటూరు 20 బస్సులు నడుపుతున్నామన్నారు. ఇక రాజంపేట 30, రాయచోటి 10 ఏర్పాటు చేశారు.
కడప జిల్లాలో ప్రమాదవశాత్తు షేక్షావలి (38) అనే డ్రైవర్ మృతి చెందాడు. సీఐ దస్తగిరి సమాచారం మేరకు.. ముద్దనూరుకు చెందిన షేక్షావలి లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. లారీ మరమ్మతులు చేసుకుంటుండగా ఆదివారం లారీపై నుంచి జారి పడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేశారు.
కడప నగర పరిధిలోని శిల్పారామంలో ఏర్పాటు చేసిన ఆటవిడుపు కార్యక్రమంలో భాగంగా వైభవంగా నృత్య ప్రదర్శనను నిర్వహించినట్లు పరిపాలనా అధికారి శివప్రసాద్ రెడ్డి తెలిపారు. నగర పరిధిలోని ప్రజలు కార్యక్రమానికి హాజరై ఆసక్తిగా తిలకించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో భాగంగా జానపద, కూచిపూడి, నాటక ప్రదర్శనలు యువత ప్రదర్శించినట్లు చెప్పారు.
శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఆదివారం రాత్రి గరుడ వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణులు భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 నుంచి వాహనసేవ వైభవంగా జరిగింది. కేరళ డ్రమ్స్, భక్తజన బృంధాలు, చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
జిల్లాలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఆదివారం సెలవుదినం కావడంతో నామినేషన్లు నమోదుకాలేదు. సోమవారం ప్రధాన పార్టీల నుంచి నామినేషన్లు వేస్తున్నవారు. వారిలో
➤ కడప TDP MP అభ్యర్థిగా భూపేశ్ రెడ్డి
➤ JMD-సుధీర్ రెడ్డి
➤ PDTR-రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి
➤ బద్వేల్-దాసరి సుధ, విజయ జ్యోతి
➤ కమలాపురం-పి.రవీంద్ర నాథ్ రెడ్డి
➤ మైదుకూరు-పుట్టా సుధాకర్ యాదవ్
➤ 25న పులివెందులలో వైఎస్ జగన్ నామినేషన్ వేయనున్నారు.
జిల్లాలోనే జమ్మలమడుగు నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం ఇక్కడ కూటమి నుంచి ఆదినారాయణ రెడ్డి, వైసీపీ నుంచి మూలె సుధీర్ ఢీ అంటే ఢీ అంటున్నారు. అయితే నియోజకవర్గంలో 2,41,642 ఓట్లు ఉన్నాయి. అందులో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 79,462 మంది ఉంటే బీసీ – 42,370, రెడ్డి – 40,590, ముస్లిం ఓటర్లు 38,223 మంది ఉన్నారు. జమ్మలమడుగులో కీలకంగా ఉన్న ఎస్సీ ఓట్లు గెలుపును నిర్దేశిస్తాయి.
ఒంటిమిట్ట క్షేత్రంలోని కోదండరాముల వారి ఆలయంలో విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించాడు. దేశంలో మరెక్కడా లేని విధంగా ఒకే శిలలో రాముడు, సీతాదేవి, లక్ష్మణులను ఇక్కడ చూడొచ్చు. అందుకే ఏకశిలా నగరం అని పేరొచ్చింది. దేశంలో ఆంజనేయ స్వామి లేకుండా రాముల వారు ఉన్న ఆలయం ఇదొక్కటే.
➤ నియోజకవర్గం: రాయచోటి
➤ అభ్యర్థి: మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి (టీడీపీ)
➤విద్యార్హత: ఇంటర్
➤ చరాస్తి విలువ: రూ.24,62,176
భార్య పేరిట: రూ.42,761
➤ స్తిరాస్తి విలువ: రూ.3,17,85,000
భార్య పేరిట: 1,70,000
➤ ఇతర ఆస్తుల విలువ:
➤ అప్పులు: లేవు
భార్య పేరిట: రూ.14,67,000
➤ బంగారం: 238.56 గ్రాములు
ఒంటిమిట్ట కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఆదివారం ఉదయం మోహినీ అలంకారంలో రాముల వారు జగన్ మోహన కారుడిగా దర్శనమిచ్చారు. స్వామివారి ఊరేగింపు వైభవంగా ప్రారంభమైంది. కేరళ డ్రమ్స్, భక్తజన బృందాలు, చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారి ఊరేగింపు జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
Sorry, no posts matched your criteria.