India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వేసవిలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించామని, తాగునీటి కొరత లేకుండా ముందస్తు ప్రణాళికలు చేపట్టామని కలెక్టర్ వి.విజయ్ రామరాజు పేర్కొన్నారు. విజయవాడ నుంచి చీఫ్ సెక్రటరీ నిర్వహించిన వీసీలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ఉపాధి హామీ పనుల లేబర్ కాంపోనెంట్ పెంపుతో పాటు, కూలీలకు కొరత లేకుండా తాగునీటి సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఈనెల 25న సాయంత్రం కడప జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కడపలోని ఆమీన్ ఫంక్షన్ ప్యాలెస్లో ఇఫ్తార్ విందు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా ఛైర్మన్ డాక్టర్ ఎన్.తులసి రెడ్డి అన్నారు. ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్.షర్మిలారెడ్డి హాజరవుతున్నట్లు తెలిపారు. షర్మిల పర్యటన సందర్భంగా ఆయన ఇఫ్తార్ విందు ఏర్పాట్లను పరిశీలించారు.
కడపలో ఎలాగైనా పట్టు సాధించాలని టీడీపీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే అభ్యర్థుల ఎంపిక సాగుతోంది. కమలాపురంలో వరుసగా 4 సార్లు ఓడిపోయిన నరసింహారెడ్డిని కాదని తనయుడు చైతన్యరెడ్డికి టికెట్ ఇచ్చింది. అటు వైసీపీలో రెండు సార్లు గెలిచిన రవీంద్రనాథ్ రెడ్డే మరోసారి బరిలో నిలుస్తూ హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు. మరి తండ్రి గెలవలేకపోయిన చోట తనయుడు గెలిచి చరిత్ర సృస్టిస్తారని అనుకుంటున్నారా.?
ప్రశాంత ఎన్నికల కోసం.. పటిష్టమైన నియంత్రణ చేస్తున్నామని, కడప కలెక్టరేట్ లోని జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ నుంచి పకడ్బందీగా పర్యవేక్షణ చేస్తున్నట్లు కంట్రోల్ రూమ్ అధికారి సూర్యసాయి ప్రవీణ్ చంద్ పేర్కొన్నారు. కోడ్ ఉల్లంఘన సహితమైన 17,517 (పబ్లిక్), 12,532 (ప్రైవేటు) అంశాలపై చర్యలు తీసుకున్నామన్నారు. రూ.80వేలు నగదు, రూ.14,76,830 విలువైన లిక్కర్, ఇతర సామగ్రి సీజ్ చేసినట్లు తెలిపారు.
గన్నవరం YCP కార్యాలయం వద్ద శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. TDP నిర్వహించనున్న వర్క్షాపులో పాల్గొనేందుకు కడప TDP ఎమ్మెల్యే అభ్యర్థి మాధవి విజయవాడ వచ్చారు. గన్నవరం మీదుగా వెళ్తూ అక్కడి వైసీపీ కార్యాలయం వద్ద బ్యానర్లను ఫొటోలు తీస్తుండగా ఆ పార్టీ కార్యకర్తలు గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న TDP కార్యకర్తలు అక్కడకు చేరుకోగా ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
కడప జిల్లాలో ఈ నెల 31 తేదీన చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. మైదుకూరు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో పర్యటించినట్లు టీడీపీ అధిష్ఠానం వెల్లడించింది. రానున్న ఎన్నికల నేపథ్యంలో 30వ తేదీన మైదుకూరులో ప్రజాగళం సమావేశంతో పాటు ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. జిల్లాలోని టీడీపీ శ్రేణులు పాల్గొని జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులు తెలిపారు.
ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయంలో మార్చి 25వ తేదీన స్వామివారికి పౌర్ణమి కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు. శుక్రవారం ఒంటిమిట్టలో వారు మాట్లాడుతూ.. ప్రతి నెల రెండు, నాలుగో శనివారాలలో తిరుమల లడ్డూలు స్వామివారి ఆలయంలో భక్తులకు అందుబాటులో ఉంటాయని అన్నారు. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
టీడీపీ మూడో జాబితాలోనూ.. జిల్లాలో పెండింగ్లో ఉన్న కడప, రాజంపేట ఎంపీ స్థానాలు, జమ్మలమడుగు, బద్వేల్, కోడూరు, రాజంపేట ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో ఆ స్థానాల్లో ఆశావాహుల్లో ఉత్కంఠ మరింత పెరిగుతోంది. ఇక జమ్మలమడుగు, బద్వేల్ స్థానాలు బీజేపీకి.. కోడూరు, రాజంపేట ఎమ్మెల్యే స్థానాలు జనసేన ఇచ్చే అవకాశం ఉందని చర్చలు ఊపందుకున్నాయి.
కడప జిల్లా వ్యక్తికి టీడీపీ ఏలూరు ఎంపీ టికెట్ను కేటాయించింది. మైదుకూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు పుట్టా మహేశ్ యాదవ్ను టీడీపీ అధిష్ఠానం ఏలూరు ఎంపీ స్థానానికి బరిలో నిలిపింది. 13 మంది ఎంపీ అభ్యర్థులతో ప్రకటించిన జాబితాలో ఆయన పేరును ప్రకటించింది. యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఏలూరు పార్లమెంటు స్థానానికి ఆయనను బరిలో నిలిపినట్లు తెలుస్తోంది.
అబ్బాయి కోసం బాబాయ్ తగ్గినట్లు కనిపిస్తోంది. జమ్మలమడుగు టికెట్ కోసం BJP నుంచి ఆదినారాయణ రెడ్డి, TDP నుంచి భూపేశ్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇద్దరిదీ ఒకే కుటుంబం కావడంతో జమ్మలమడుగు టికెట్ కాకుండా కడప ఎంపీ టికెట్ అడిగినట్లు టాక్. ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. ఇక్కడి నుంచి శ్రీనివాసుల రెడ్డి, వీరశివారెడ్డి పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరిని టికెట్ వరిస్తుందో చూడాలి.
Sorry, no posts matched your criteria.