India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పులివెందులలో ఎన్నికల ప్రచారం వాడీవేడిగా జరుగుతుంది. వైఎస్ సునీత బుధవారం వేంపల్లెలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిందని నిమిషాల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. మరి మాజీ మంత్రి వివేకాను క్రూరంగా హత్య చేసి ఐదేళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదని’ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు తమకు మద్దతుగా నిలిచి షర్మిలను ఎంపీగా గెలిపించాలన్నారు.

ప్రసిద్ధిగాంచిన ఒంటిమిట్ట కోదండ రాముని బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామివారికి చక్రస్నానం నిర్వహించడం జరుగుతుందని ఆలయ డిప్యూటీ ఈవో నటేష్ బాబు అన్నారు. రాత్రి ధ్వజారోహణం ఉంటుందన్నారు. శుక్రవారం పుష్పయాగం నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. భక్తులు చక్రస్నానంలో పాల్గొనాలని వారు కోరారు.

అనంతపురానికి చెందిన శ్రీనివాసులు కుటుంబంతో కలిసి బుధవారం కారులో కడపకు బయలుదేరారు. వేముల మండలంలోని గొందిపల్లె సమీపంలో టీవీఎస్ వాహనాన్ని తప్పించబోయి కారు అదుపుతప్పి పక్కనున్న పొలాల్లో పల్టీలు కొడుతూ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రద్ధ (14) అనే బాలిక మృతిచెందింది.

CM జగన్ గురువారం పులివెందులకు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు DSP వినోద్ కుమార్ తెలిపారు. టౌన్లోకి వచ్చిపోయే RTC బస్సులు ఉ.6 గంటల నుంచి మ.3 గంటల వరకు విజయ్ హోమ్స్ రింగ్ రోడ్, కదిరి రింగ్ రోడ్, అంబకపల్లి రింగ్ రోడ్, పార్నపల్లి రింగ్ రోడ్, ముద్దనూరు రింగ్ రోడ్ మీదుగా RTC బస్టాండ్కు వెళ్తాయన్నారు.

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి అశ్వవాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తజన బృందాల మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామి అశ్వవాహనంపై భక్తులకు కల్కి స్వరూపాన్ని ప్రకటించారు.

ప్రముఖ నటుడు సుమన్ బుధవారం వీరబ్రహ్మేంద్రస్వామిని దర్శించుకున్నారు. ఉదయం మఠంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రతినిధులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అర్చనలు, అభిషేకాలు చేయించారు. వీరబ్రహ్మంగారి ఆలయ విశిష్ఠతను గురించి సుమన్కు వివరించారు. అనంతరం పట్టణంలోని శీలం నరసింహులు గౌడ్ నివాసంలో ఆయన తేనీటి విందులో పాల్గొన్నాడు. సుమన్ను చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో వచ్చారు.

కడప పార్లమెంట్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూటమి అభ్యర్థి భూపేశ్ రెడ్డి తండ్రి నారాయణరెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల అధికారి విజయరామరాజుకు నామినేషన్ పత్రాలను అందించారు. ఇప్పటికే కడప ఎంపీ బరిలో వైసీపీ నుంచి అవినాశ్, కాంగ్రెస్ నుంచి షర్మిల, కూటమి నుంచి భూపేశ్ రెడ్డి బరిలో నిలిచిన విషయం తెలిసిందే.

జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై మొత్తం 69 ఫిర్యాదులు అందగా, అన్నింటిని పరిష్కరించినట్లు జిల్లా ఎన్నికల అధికారి విజయరామరాజు తెలిపారు. మంగళవారం విడుదలైన జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ ఫిర్యాదుల పరిష్కార నివేదిక మేరకు సివిజిల్ ద్వారా మొత్తం 367 కేసులు నమోదు కాగా 224 నిజనిర్ధారణ అయ్యాయని, 143 నిరాధారమైనవిగా గుర్తించామన్నారు. ఇప్పటివరకు 1078 కేసులు నమోదు చేశామన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు పులివెందులకు రానున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా రేపు ఆయన తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపు ఉదయం గన్నవరం నుంచి విమానంలో కడప చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లో పులివెందులకు చేరుకుంటారు. ముందుగా సీఎస్ఐ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని, సభ అనంతరం తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందించనున్నారు. తరువాత కడప చేరుకుని గన్నవరం బయల్దేరి వెళ్తారు.

కార్మిక శాఖ దుకాణాలు సంస్థల చట్టం -1988 ప్రకారం మే 13న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా దుకాణాలు, సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు కార్మిక శాఖ సెలవు ప్రకటించిందని జిల్లా కార్మిక శాఖ కమిషనర్ శ్రీకాంత్ నాయక్ తెలిపారు. కావున వాణిజ్య సంస్థలు, పారిశ్రామిక సంస్థలు, ఇతర సంస్థల్లో పని చేస్తున్న ప్రతి వ్యక్తికి ఓటు వేసేందుకు వేతనంతో కూడిన సెలవును మంజూరు చేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.