India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సార్వత్రిక ఎన్నికలకు ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ విజయరామరాజు ప్రకటించారు. కడప కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. నేటి నుంచి నామినేషన్ దాఖలుకు ఏర్పాట్లు పూర్తి చేశామని, అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయాలని, ఎంపీ అభ్యర్థి కడప కలెక్టర్ లో ఎన్నికల అధికారికి నామినేషన్ వేయవచ్చన్నారు. ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు.

కేంద్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనలను తూచా తప్పక పాటిస్తూ.. నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందని కడప జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.విజయ్ రామరాజు రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. సాధారణ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు గానీ, ప్రతిపాదకులు గానీ నామినేషన్లు దాఖలు చేసే సమయంలో నిబంధనలు పాటించాలన్నారు.

రాజంపేట నియోజకవర్గంలో వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. రాజంపేట మైనార్టీ నేత గండికోట గుల్జార్ భాష రాష్ట్ర రోడ్డు కార్పొరేషన్ డైరెక్టర్ పదవికి, వైసీపీకి బుధవారం రాజీనామా చేశారు. నందలూరుకు చెందిన భువనబోయిన లక్ష్మీనరసయ్య రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. మైనార్టీ నాయకుడు సయ్యద్ అమీర్ వక్ఫ్ బోర్డ్ సెక్రటరీ పదవికి, పార్టీకి రాజీనామా చేశారని తెలిపారు.

ఒంటిమిట్టలో 22న పున్నమి వెన్నెలలో రాములోరి కళ్యాణం నిర్వహిస్తారు. రాత్రే కళ్యాణం జరగడానికి పురాణాల్లో ఓ కథ ఉంది.. విష్ణుమూర్తి, లక్ష్మిదేవి వివాహం పగలు జరుగుతుంది. తాను అక్క లక్ష్మిదేవి పెళ్లిని చూడలేకపోతున్నానని చంద్రుడు విష్ణుమూర్తికి చెప్పడంతో.. నీ కోరిక రామావతారంలో తీరుతుందని చంద్రుడికి విష్ణుమూర్తి వరమిస్తాడు. అందుకే ఈ ఆలయంలో నవమి రోజు కాకుండా చైత్రశుద్ధ పౌర్ణమిన సీతారాముల వివాహం జరుగుతుంది.

కడప YVUలో ఆదివారం విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. రంజాన్కు ఇంటికి వెళ్లి తిరిగి వచ్చిన సుల్తానా(23) మరుసటి రోజు కాలేజ్కు వెళ్లి అరగంట ముందే హాస్టల్కు వచ్చి ఉరివేసుకున్నట్లు తోటి విద్యార్థినిలు తెలిపారు. అయితే ఆత్మహత్యకు పాల్పడే ముందు ఎవరితోనో ఫోన్లో మాట్లాడిందని చెప్పారు. దీంతో ఫోన్కాల్పై అనుమానం వ్యక్తం చేసి సెల్ఫోన్ను సీజ్ చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

కడప జిల్లా ఎన్నికల బరిలో రెండు నియోజకవర్గాల అభ్యర్థులు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నారు. ప్రొద్దుటూరు నుంచి నంద్యాల వరదరాజులరెడ్డి TDP తరఫున పోటీ చేస్తున్నారు. ఈయన గతంలో 5 సార్లు MLAగా గెలిచారు. అటు మైదుకూరు నుంచి రఘురామిరెడ్డి 4 సార్లు MLAగా గెలిచారు. మరోసారి YCP నుంచి ఎన్నికల బరిలో ఉన్నారు. వీరిద్దరూ స్వాతంత్ర్యం రాకముందు జన్మించారు. రాష్ట్రంలో ఎక్కువ వయస్సు ఉన్న అభ్యర్థులు వీరే కావడం విశేషం.

పులివెందుల వ్యవసాయ చీనీ మార్కెట్లో చీనీ కాయల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలోనే టన్ను ధర రూ.35 వేల నుంచి రూ.40 వేలు పలకడంతో చీనీ సాగు చేసిన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లింగాల, సింహాద్రిపురం, తొండూరు, వేముల, పులివెందుల మండలాల్లోని పలు గ్రామాల నుంచి మంగళవారం ఒక్కరోజే 650 టన్నుల చీనీ కాయలు పులివెందుల చీనీ మార్కెట్కు వచ్చినట్లు నిర్వహకులు తెలిపారు.

బద్వేల్కు చెందిన మర్రిపాటి నాగ భరత్ యూపీఎస్సీ ప్రకటించిన సివిల్స్ ఫలితాలలో 580 ర్యాంక్ సాధించారు. ఐఐటీ ఖరగ్పూర్లో ఎంటెక్ పూర్తి చేశారు. సివిల్స్ పరీక్షలకు ఢిల్లీ, హైదరాబాద్లో కోచింగ్ తీసుకున్నారు. గతేడాది కూడా ఇంటర్వ్యూ స్థాయికి వెళ్లారు. 580వ ర్యాంకు సాధించడం పట్ల నాగ భరత్ తండ్రి ఎం.నాగరాజ సంతోషం వ్యక్తం చేశారు. నాగరాజు బద్వేల్ ఏడీఏగా పనిచేస్తున్నారు.

రాయచోటిలో వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ అధికారులకు సూచించారు. ఆయన మాట్లాడుతూ…. మంగళవారం విజయవాడ, ఏపీ సెక్రటేరియట్ లోని సీఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి తాగునీటి సమస్యపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ సేవలను పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, కడప జిల్లా ఎన్నికల అధికారి వి.విజయ్ రామరాజు సిబ్బందికి సూచించారు. కలెక్టరేట్ లోని జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి వెళ్లే ప్రతి రిపోర్టును భద్రపరచాలని ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.