Y.S.R. Cuddapah

News March 28, 2025

క్రికెట్‌లో సత్తా చాటిన ఎర్రగుంట్ల క్రీడాకారిణి

image

వైయస్సార్ కడపజిల్లా, ఎర్రగుంట్ల మండలం యర్రంపల్లి గ్రామానికి చెందిన ఎన్.శ్రీచరణి బీసీసీఐ సీనియర్ ఉమెన్స్ ఛాలెంజర్ ట్రోఫీలో 6 వికెట్లు తీసి సత్తా చాటింది. గురువారం డెహ్రాడూన్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో నిర్వహించిన మల్టీ డేస్ క్రికెట్ మ్యాచ్‌లో టీమ్-బీకి ప్రాతినిధ్యం వహించిన శ్రీచరణి తొలిరోజు మ్యాచ్‌లో 32 ఓవర్లు వేసి 8 మెయిడిన్ ఓవర్లు, 6 వికెట్లు తీసి సత్తా చాటింది.

News March 27, 2025

కడప జిల్లా ZPTCలకు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ

image

కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నికకు సహకారం అందించిన ఉమ్మడి కడప జిల్లా ZPTCలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పేర్కొన్నారు. వైయస్సార్, జగన్ మీద అభిమానంతో రామ గోవింద్ రెడ్డికి ప్రతి ఒక్కరూ సహకారం అందించారని అన్నారు. భవిష్యత్తులో ప్రజా సమస్యల పట్ల జిల్లా పరిధిలోని ZPTCలు పోరాటం కొనసాగించాలని సూచించారు.

News March 27, 2025

ప్రొద్దుటూరు: 9వ తరగతి విద్యార్థిపై పోక్సో కేసు

image

ప్రొద్దుటూరులో 9వ తరగతి విద్యార్థిపై పోక్సో కేసు నమోదైంది. మండలంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌కు చెందిన విద్యార్థి 32 ఫేక్ ఇన్‌స్టాగ్రాం అకౌంట్లతో తన క్లాస్ అమ్మాయిలను వేధించాడు. విషయం తెలిసిన టీచర్ విద్యార్థిని హెచ్చరించారు. తమ బిడ్డనే మందలిస్తారంటూ సదరు విద్యార్థి తల్లిదండ్రులు టీచర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్ల విచారణలో అసలు విషయం బయటపడింది. దీంతో వారితో పాటు మరో వ్యక్తిపై పోక్సో కేసు నమోదైంది.

News March 27, 2025

ఏప్రిల్ 3న వైవీయూలో ఉద్యోగ రిక్రూట్మెంట్ డ్రైవ్

image

కడప: వైవీయూలో ఏప్రిల్ 3వ తేదీన క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ కళాశాల ప్రధానాచార్యులు ఎస్ రఘునాథరెడ్డి తెలిపారు. కులసచివులు పద్మ, ఉద్యోగ డ్రైవ్‌కి సంబంధించిన పోస్టర్‌ను వైవీయూలో విడుదల చేశారు. ప్రముఖ MNC కంపెనీ బయోకాన్ ప్రతినిధులు వైవీయూకు రానున్నారని తెలిపారు. బీఎస్సీ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, డిప్లొమా – కెమికల్, బీటెక్‌- కెమికల్ అర్హతలు ఉండాలన్నారు.

News March 27, 2025

మత సంప్రదాయాలను గౌరవిస్తూ పండగలు జరుపుకోవాలి: జేసీ

image

మత సంప్రదాయాలను గౌరవిస్తూ శాంతియుత, ఆహ్లాదకర వాతావరణంలో భక్తి భావంతో రంజాన్, ఉగాది, శ్రీరామనవమి పండుగలను నిర్వహించుకునేలా జిల్లా శాంతి కమిటీ సభ్యులు సమన్వయ సహకారాలు అందించాలని జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ తెలిపారు. జిల్లాలో రంజాన్, ఉగాది, శ్రీరామనవమి పండుగల నిర్వహణపై జేసీ అధ్యక్షతన బుధవారం కలెక్టరేట్‌లో శాంతి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశలో డీఆర్‌వో, ఆర్డీవో, కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.

News March 27, 2025

కడప: రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం: బ్రహ్మయ్య

image

‘ప్రధానమంత్రి ఉపాధి కల్పనా పథకం’ నందు రుణాలు పొందేందుకు మైనార్టీ వర్గాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకుడు డా. వల్లూరు బ్రహ్మయ్య తెలిపారు. ముస్లింలు, క్రైస్తవులు, జైనులు, సిక్కులు, బౌద్ధులు, పారిశీకులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. తయారీ రంగానికి రూ.50 లక్షలు, సేవా రంగానికి రూ.20 లక్షల ప్రాజెక్టు ఏర్పాటుకు సబ్సిడీ రుణాలు పొందవచ్చన్నారు.

News March 26, 2025

మాజీ సీఎం జగన్ దృష్టికి జ్యోతి క్షేత్రం సమస్య 

image

కాశినాయన జ్యోతి క్షేత్రానికి అటవీ అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి వినతిపత్రం ఇచ్చారు. విజయవాడ తాడేపల్లి పార్టీ కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్సీ డీసీ గోవింద రెడ్డి కలిసి ఇటీవల జరిగిన కాశినాయన ఆలయ నిర్మాణాలను కూల్చివేత ఘటన గురించి జగన్మోహన్ రెడ్డికి వివరించారు.

News March 26, 2025

ఉచిత డీఎస్సీ కోచింగ్ కోసం షార్ట్ లిస్ట్ అభ్యర్థుల జాబితా విడుదల

image

ఉచిత డీఎస్సీ కోచింగ్ కోసం షార్ట్ లిస్ట్ చేయబడిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల జాబితాను https://mdfc.apcfss.in వెబ్ పోర్టల్‌లో ఉంచినట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ, సాధికారత అధికారి కె. సరస్వతి తెలిపారు. షార్ట్ లిస్టు చేయబడిన అభ్యర్థులు ఈనెల 28వ తేదీ లేదా అంతకుముందు వెబ్ ఆప్షన్ సర్వీస్ ద్వారా ఎంప్యానల్ కోచింగ్ సంస్థలకు తమ ప్రాధాన్యతలను నమోదు చేసుకోవాలని కోరారు. ఫెజ్‌-1 ఎంపికలకు ఎడిట్ ఆప్షన్ లేదన్నారు.

News March 26, 2025

ఎర్రగుంట్ల: తల్లిదండ్రులు మృతి.. అనాథలైన పిల్లలు

image

ఎర్రగుంట్ల (M) కలమలలో భార్యాభర్తలైన రాజారెడ్డి(45) సుజాత(35)ను నిన్న వ్యాన్ ఢీకొట్టడంతో మృతి చెందిన విషయం తెలిసిందే. రాజారెడ్డికి ఇద్దరు అమ్మాయిలు. ఎర్రగుంట్లలో ఆర్టీపీపీలో కార్మికుడిగా పనిచేస్తూ వారిని చదివిస్తున్నాడు. పెద్దమ్మాయి బీటెక్ చదువుండగా, చిన్నకుమార్తె ఇంటర్ చదువుతోంది. దీంతో వారు అనాథలయ్యారని గ్రామస్థులు కన్నీరుమున్నీరు అయ్యారు. ప్రమాదానికి కారణమైన వ్యాన్ డ్రైవర్ రూ.4 లక్షలు ఇచ్చారు.

News March 26, 2025

కడప: అనుమానంతో భార్యను చంపిన భర్త

image

వల్లూరు(M) అంబవరంలో భార్యను చంపి, తాను ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల వివరాల మేరకు.. ఎర్రగుడిపాడుకు చెందిన చెన్నకేశవ, సుజాతకు పెళ్లై ముగ్గురు సంతానం. చెన్నకేశవ తాగుడుకు బానిసై భార్యపై అనుమానం పెంచుకొని వేధించేవాడు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. సుజాతను పెద్దకొడుకు పనినిమిత్తం అంబవరానికి పిలుచుకొచ్చాడు. మంగళవారం సుజాతపై చెన్నకేశవ కొడవలితో దాడి చేసి చంపాడు. ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు.

error: Content is protected !!