Y.S.R. Cuddapah

News August 30, 2025

మాజీ సీఎం జగన్ పులివెందుల పర్యటన

image

వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో సెప్టెంబర్ 1, 2 వ తేదీలలో పర్యటించనున్నారు. లింగాలలోని అంబకబల్లె గ్రామంలో స్థానికులతో సమావేశమై సమస్యలు తెలుసుకోనున్నారు. కార్యకర్తలతోనూ సమావేశమయ్యే అవకాశం ఉందని సమాచారం.

News August 30, 2025

బ్రహ్మంగారిమఠంలో పుష్ప నటుడు

image

బ్రహ్మంగారిమఠంలోని జగద్గురు శ్రీ మద్వివిరాట్ పోతులూరి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని శుక్రవారం పుష్ప సినిమా నటుడు కేశవ దర్శించుకున్నారు. ఆయనకు మఠం యాజమాన్యం ప్రత్యేక స్వాగతం పలికి పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆయన దర్శనానికి రావడంతో అభిమానులు సెల్ఫీలు దిగారు.

News August 30, 2025

ఓటు వేయాలి.. బెయిల్ ఇవ్వండి: రాజంపేట MP

image

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి తనకు అవకాశం కల్పించాలని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన ఏసీబీ కోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారు. అలాగే మద్యం కేసులో రెగ్యులర్ బెయిల్ కావాలని కోరారు. ఈ రెండు పిటిషన్లపై విచారణను సెప్టెంబర్ 2వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. సెప్టెంబర్ 9వ తేదీన ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. మరి మిథున్ రెడ్డికి బెయిల్ వస్తుందో? లేదో? చూడాలి మరి.

News August 30, 2025

ప్రొద్దుటూరులో తల్లీ కుమారుడు మిస్సింగ్

image

ప్రొద్దుటూరులోని రామేశ్వరానికి చెందిన తల్లీకుమారుడి అదృశ్యంపై 1వ టౌన్ PS లో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సంజీవరెడ్డి తెలిపారు. తన భార్య సుమిత్ర (24), కుమారుడు తేజేంద్ర(3) ఈ నెల 25 కనిపించడం లేదని చండ్రాయుడు శుక్రవారం ఫిర్యాదు చేశాడు. అత్తాకోడళ్లు గొడవపడి కుమారుడిని తీసుకొని వెళ్లిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News August 30, 2025

రుణాల మంజూరు బ్యాంకర్లు చొరవ చూపండి: కలెక్టర్

image

వ్యవసాయ అనుబంధ రంగాలకు విరివిగా రుణాలు బ్యాంకర్లు మంజూరు చేయాలని కలెక్టర్ డా.శ్రీధర్ పేర్కొన్నారు. జిల్లా సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ హాలులో డీసీసీ/డీఎల్‌ఆర్‌సీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సకాలంలో క్రాప్‌లోన్‌లు మంజూరు చేయాలన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రాధాన్యతా రంగానికి సంబంధించి కోట్లు ఋణాలు మంజూరు లక్ష్యం అన్నారు.

News August 29, 2025

కడప: వినాయక నిమజ్జనంలో అపశృతి

image

కడప జిల్లాలో వినాయక నిమజ్జన కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. బాణాసంచా పేలి నలువురికి గాయాలయ్యాయి. బ్రహ్మంగారిమఠం మండలం రేకలగుంట పంచాయతీ బాగాది పల్లెలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాణసంచా పేలి గ్రామానికి చెందిన పాల కొండయ్య, జగదీశ్, లోకేశ్, దుక్కేశ్ గాయపడ్డారు. గాయపడిన వారిని 108లో బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News August 29, 2025

హరికృష్ణకు కడపతో ప్రచార అనుబంధం

image

దివంగత మాజీ ఎమ్మెల్యే నందమూరి హరికృష్ణ మన మధ్య లేకపోయినా కడప వాసులు మరిచిపోలేరు. దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు 1982 ఎన్నికల ప్రచారంలో భాగంగా కొండాపురం మండలం తాళ్ల ప్రొద్దుటూరు, చౌటపల్లి వచ్చిన సమయంలో చైతన్య రథాన్ని హరికృష్ణ నడిపారు. మళ్లీ 1992లో రెండోసారి కొండాపురం, పులివెందుల, కడప తదితర ప్రాంతాలలో రోడ్ షోలో పాల్గొన్నారు. నేడు ఆయన వర్థంతి సందర్భంగా ఆనాటి రోజులు నెమరివేసుకుంటున్నారు.

News August 29, 2025

కడప స్టీల్ ప్లాంట్ పనులకు రూ.25 కోట్లు విడుదల

image

కడప స్టీల్ ప్లాంట్ పనులకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రూ.25 కోట్లు విడుదల చేసింది. గతంలో YSR స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ చేపట్టిన పనులకు బిల్లుల చెల్లింపులకు రూ.25 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ GO.Rt.No.138 విడుదల చేశారు. YSR స్టీల్ కార్పొరేషన్ భూములను, మౌళిక సదుపాయాలను ఇటీవల జిందాల్ స్టీల్ ప్లాంటుకు ప్రభుత్వం బదిలీ చేసింది. ఆ పనులకు ఇప్పుడు రూ.25 కోట్లు ఇచ్చారు.

News August 29, 2025

కానిస్టేబుల్ అభ్యర్థులకు 30నుంచి వైద్య పరీక్షలు: ఎస్పీ

image

కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఈనెల 30నుంచి వైద్య పరీక్షలకు జిల్లా పోలీస్ కార్యాలయంలో హాజరు కావాలని ఎస్పీ అశోక్ కుమార్ గురువారం తెలిపారు. ఈనెల 30న రిజిస్టర్ నంబర్ 4001160 నుంచి 4155879 వరకు, సెప్టెంబర్ 1న నంబర్ 4156636 నుంచి 4299199 వరకు, సెప్టెంబర్ 2న నం: 4299250 నుంచి 4504602 వరకు సివిల్, అదేరోజు నం: 4002777 నుంచి 4468576 అభ్యర్థులు హాజరవ్వాలని సూచించారు.

News August 29, 2025

గణేశుడి నిమజ్జనానికి బందోబస్తు ఏర్పాటు: ఎస్పీ

image

జిల్లాలో శుక్రవారం నిర్వహించనున్న గణేశ్ నిమజ్జనానికి గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కడప ఎస్పీ అశోక్ కుమార్ గురువారం రాత్రి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు రూపొందించిన యాప్ ద్వారా నిర్వాహకులు 4,500 విగ్రహాలకు అనుమతులు తీసుకున్నారన్నారు. ఈనెల 29న 1600 గణేశ్ విగ్రహాలు నిమజ్జనం చేయనున్నారన్నారు. అన్ని శాఖల అధికారులతో కలిసికట్టుగా నిమజ్జన ఏర్పాట్లు చేశామని, నిర్వాహకులు తమకు సహకరించాలని కోరారు.