India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో తొలి ఖరీఫ్ సీజన్కు సంబంధించి వరి ధాన్యం సేకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. కడప కలెక్టరేట్లో వ్యవసాయ, సివిల్ సప్లై అధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం కలెక్టర్ మాట్లాడారు. రైతులు దళారుల మాటలు నమ్మి నష్టపోవద్దన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ప్రకారం RSK కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని సూచించారు.
స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్నయని, సిబ్బంది సన్నద్దం కావాలని ఎస్పీ విశ్వనాథ్ అన్నారు. గురువారం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో క్రైమ్పై సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సిబ్బంది కృషి చేయాలని, పాత నేరస్తులపై నిఘా ఏర్పాటు చేయాలన్నారు. రోడ్ల భద్రత, ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు.
యూజీసీ నెట్ అర్హత సాధించిన వారికి యోగి వేమన విశ్వవిద్యాలయంలో పీహెచ్డీలో నేరుగా ప్రవేశాలు కల్పిస్తున్నట్లు విశ్వవిద్యాలయ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. యూజీసీ నెట్ ఫెలోషిప్, లెక్చరర్స్షిప్, పీహెచ్డీ క్వాలిఫై అయిన అభ్యర్థులు yvu.edu.inను సందర్శించి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. పూర్తిచేసిన దరఖాస్తును ఈ నెల 15వ తేదీ లోపు వైవీయులో అందజేయాలన్నారు.
యూజీసీ నెట్ అర్హత సాధించిన వారికి యోగి వేమన విశ్వవిద్యాలయంలో పీహెచ్డీలో నేరుగా ప్రవేశాలు కల్పిస్తున్నట్లు విశ్వవిద్యాలయ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. యూజీసీ నెట్ ఫెలోషిప్, లెక్చరర్స్షిప్, పీహెచ్డీ క్వాలిఫై అయిన అభ్యర్థులు yvu.edu.inను సందర్శించి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. పూర్తిచేసిన దరఖాస్తును ఈ నెల 15వ తేదీ లోపు వైవీయులో అందజేయాలన్నారు.
కడప జిల్లా యోగివేమన యూనివర్సిటీ నూతన ఉపకులపతిగా బెల్లంకొండ రాజశేఖర్ను అధికారులు నియమించారు. కొన్ని నెలలుగా ఇన్ఛార్జ్ ఉపకులపతిగా అల్లం శ్రీనివాసరావు పనిచేస్తున్నారు. ఇక్కడ చాలాకాలంగా ఇన్ఛార్జే ఉండటంతో నూతన వీసీగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో సీనియర్ ప్రొఫెసర్గా ఉన్న బెల్లంకొండ రాజశేఖర్ను నియమించారు.
కడప జిల్లాలో బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముద్దనూరు దాబా సమీపంలో గుర్తు తెలియని వాహనం బైకును ఢీకొనడంతో చిలమకూరుకి చెందిన హాజీవలి(32) అక్కడికక్కడే మృతి చెందాడు. అతనితోపాటు ఉన్న మరొక వ్యక్తి గాయపడి ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.
కడప శివారులోని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఈనెల 23 నుంచి గ్రామీణ నిరుద్యోగ మహిళలకు టైలరింగ్ (31 రోజులు), బ్యూటీ పార్లర్ (35 రోజులు), ఎంబ్రాయిడరీ (31 రోజులు) ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ ఆరీఫ్ తెలిపారు.18–45ఏళ్ల మహిళలు అర్హులని అన్నారు. దూర ప్రాంతాల వారికి ఉచిత వసతి, భోజనం సదుపాయం కల్పిస్తామని చెప్పారు. వివరాలకు 9985606866 నంబర్ను సంప్రదించాలన్నారు.
బాణసంచా గోడౌన్ల నిర్వాహకులు ఫైర్, భద్రతా నిబంధనలు (సేఫ్టీ మెజర్స్) ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. మంగళవారం కడప కలెక్టరేట్లో దీపావళి పండుగ నేపథ్యంలో బాణసంచా స్టాళ్ల అనుమతులు, భద్రతా చర్యలు, నిబంధనల పాటింపు, తదితర అంశాలపై జిల్లా ఎస్పీ నచికేత్, డిఆర్వో గంగాధర్ గౌడ్లతో కలసి ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్స్, మండల అధికారులతో సమావేశం నిర్వహించారు.
కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. వాల్మీకి చిత్రపటానికి ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. రామాయణం ద్వారా ప్రతి ఒక్కరూ మానవతా విలువలు, ఉన్నతమైన ఆదర్శాలు ఆచరించాలన్నారు. ప్రతి ఒక్కరూ మానవత విలువలతో పనిచేయాలని సూచించారు.
కొండాపురం మండలంలో సోమవారం కురిసిన భారీ వర్షానికి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లాలో అత్యధికంగా ఇక్కడే 93.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా బ్రహ్మంగారి మఠం, కోడూరులో 4.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇటీవల కురిసిన వర్షాలు కొన్ని పంటలకు మేలు చేకూర్చగా.. మరికొన్ని పంటలకు తీవ్ర నష్టం జరిగింది. మొక్కజొన్న, పత్తి సాగు చేసిన రైతులు నష్టపోయారు.
Sorry, no posts matched your criteria.