India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ రాజంపేట పర్యటన 5కు వాయిదా పడినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ముందుగా నిర్ణయించిన మేరకు 2న ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. అదే రోజు చంద్రబాబు రాయచోటి, కడపలో ప్రచారం చేయనున్నారు. దీంతో పార్టీ నేతలంతా అధినేత పర్యటనకు హాజరు కావల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు జగన్ అగ్రనేతల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పర్యటన వాయిదా పడింది.

కొండాపురం మండలం బురుజుపల్లెకు చెందిన రాచుమల్లు మల్లారెడ్డి (30) వడ దెబ్బతో మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకొంది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన శివమల్లారెడ్డి మంగళవారం ఉదయం తోటకు వెళ్లే దారిలో ఎండ తీవ్రతకు స్పృహ కోల్పోయాడు. తాడిపత్రి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

మే 13 జరిగే ఓటింగ్ విషయంలో ఏ చిన్న పొరపాటు చేయవద్దని వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ అవినాశ్రెడ్డి కార్యకర్తలకు సూచించారు. మంగళవారం స్థానిక భావసార క్షత్రియులు (రంగరాజులు), ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాశ్రెడ్డి మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి అజెండా ప్రజా సంక్షేమమే అన్నారు. పేద బడుగు బలహీన వర్గాల కోసం నేడు పెత్తందారులతో పోరాడుతున్నాడని తెలిపారు.

YVU డిగ్రీ పరీక్షలను వీసీ ప్రొ చింతా సుధాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొ. ఎన్.ఈశ్వర్ రెడ్డితో కలిసి బ్రహ్మంగారిమఠం, పుల్లంపేట డిగ్రీ కళాశాలను సందర్శించారు. దీనిలో భాగంగా కాపీలు రాస్తున్న నలుగురు విద్యార్థులను డిబార్ చేశారు. ప్రతి కేంద్రంలో తాగునీరు, ఫ్యాన్లు, టాయిలెట్ వసతి ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా మరో నలుగురు విద్యార్థులు డిబారయ్యారు.

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోమవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. అయితే జిల్లాలో అత్యధికంగా కడప నియోజకవర్గంలో 32 నామినేషన్లను తిరస్కరించినట్లు ఎన్నికల అధికారి మధుసూదన్ పేర్కొన్నారు. అత్యల్పంగా మైదుకూరు నియోజకవర్గంలో 7 నామినేషన్లు తిరస్కరించారు. వాటితో పాటు కమలాపురంలో 24, ప్రొద్దుటూరులో 15, బద్వేల్ లో 14, జమ్మలమడుగులో 12 పులివెందులలో 10 నామినేషన్లను తిరస్కరించినట్లు తెలిపారు.

కమలాపురంలో ఓ యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేసిన ఘటన మంగళవారం వేకువజామున జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కమలాపురం పక్కీరి వీధిలో నివాసం ఉంటున్న మహమ్మద్ ఘని (26)ని గుర్తు తెలియని దుండగలు ఇంట్లోకి చొరబడి విచక్షణా రహితంగా కత్తులతో హత్యచేసినట్లు తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు సీఐ రామకృష్ణారెడ్డి, SI హృషికేషవరెడ్డి కేసు నమోదు చేసి, దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు మైదుకూరుకు రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఆయన పర్యటన వివరాలను వెల్లడించారు. ఉ. 9.40 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.45కు ప్రకాశం జిల్లా టంగుటూరు చేరుకొని బహిరంగ సభలో పాల్గొననున్నారు. అక్కడి నుంచి 12.45కి మైదుకూరుకు హెలికాప్టర్లో రానున్నారు. 12.55గం.కు సభాస్థలికి చేరుకుని 1.10-1.55 గంటల వరకు కొనసాగించనున్నారు. 2.10గం.కు అన్నమయ్య జిల్లాకు బయలుదేరుతారు.

కేంద్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనలను తూచా తప్పక పాటిస్తూ నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందని కడప జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు రాజకీయ పార్టీల ప్రతినిధులు, బరిలో నిలిచిన అభ్యర్థులకు సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఉపసంహరణ అనంతరం.. బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను, వారికి కేటాయించిన పార్టీ గుర్తుల జాబితాను కూడా తెలియజేయడం జరిగిందన్నారు.

జిల్లాలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రంగా జాతీయ ఉర్దూ యూనివర్సిటీని ఎంపిక చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ విజయరామరాజు తెలిపారు. కడప శివారులోని రిమ్స్ ప్రభుత్వాసుపత్రి వద్ద ఉన్న మౌలానా అబుల్ కలాం జాతీయ ఉర్దూ యూనివర్సిటీ(MAANU)ను ఎన్నికల సంఘం సిఫార్సు మేరకు ఎంపిక చేసామన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు.

కడప జిల్లాలో ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడుతున్న నియోజకవర్గాల్లో పులివెందుల టాప్లో నిలిచింది. ఇక్కడ మొత్తం 27 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 53 నామినేషన్లు దాఖలు కాగా, 10 నామినేషన్లు తిరస్కరించామని, 10 నామినేషన్లు ఉపసంహరించుకున్నారని చెప్పారు. దీంతో 27 మంది అభ్యర్థులు ఎన్నికల పోటీలో ఉన్నారు. దీంతో సీఎం జగన్ పై ఇక్కడ 26 మంది పోటీ పడుతున్నారు.
Sorry, no posts matched your criteria.