India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో పలు అనుమానాలను సీబీఐ నివృత్తి చేయాలని నిందితుడు శంకర్ రెడ్డి కుమారుడు డా.చైతన్య రెడ్డి డిమాండ్ చేశారు. కడపలో ఆయన ఈ కేసులో ఉన్న అనుమానాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చాడు. హత్య చేశానన్న దస్తగిరిని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. అతను ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు చేయడం సరికాదన్నారు. అసలైన నిందితులని అరెస్టు చేయాలన్నారు.

పెండ్లిమర్రి మండలం, సంత కొవ్వూరు చెందిన మంటింటి లక్ష్మీదేవి (36) రైలులో ప్రయాణిస్తూ మృతి చెందినట్లు మంచిర్యాల జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వర్ తెలిపారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను తెలంగాణలోని బెల్లంపల్లి మండలం సోమగూడెం కల్వరి చర్చికి తీసుకొచ్చారు. ప్రార్థనల్లో పాల్గొన్న లక్ష్మీదేవి తిరిగి రైలులో వస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందినట్లు పేర్కొన్నారు.

ఉమ్మడి కడప జిల్లాలోని నలుగురు టీడీపీ నేతలకు పార్టీలో కీలక పదవులు దక్కాయి. రైల్వే కోడూరుకు చెందిన విశ్వనాధ నాయుడిని పార్టీ రాష్ర్ట కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించారు. కడపకు చెందిన సూదా దుర్గా ప్రసాద్, పొన్నూరు రాం ప్రసాద్ రెడ్డి, రాజంపేటకు చెందిన ఇడమడకల కుమార్లను రాష్ర్ట కార్యదర్శులుగా పార్టీ నియమించింది. చంద్రబాబు ఆదేశాల మేరకు.. ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు అచెన్నాయుడు ప్రకటన విడుదల చేశారు.

ఇడుపులపాయలోని IIITలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. మెకానికల్ ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని సురేఖ హాస్టల్ బిల్డింగ్పై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే స్పందించిన IIIT అధికారులు ఆమెను కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ సురేఖ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతి చెందిన విద్యార్థి ప్రకాశం జిల్లా జంగం గుంట్ల గ్రామానికి చెందిన అమ్మాయిగా గుర్తించారు. వివరాలు

అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని
కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ పేర్కొన్నారు. ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఆదివారం కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో అగ్నిమాపక వారోత్సవాల కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించాలన్నారు.

బి.కోడూరు మండలం తుమ్మలపల్లి గ్రామం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్సై జయరాములు తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. పోలీసు వాహనాన్ని పక్కకి ఆపి ఫోన్లో మాట్లాడుతున్న ఎస్సై వాహవాన్ని అటు వైపు నుంచి వస్తున్న ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్సైకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఎస్సైను చికిత్స నిమిత్తం కడప రిమ్స్కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఖాజీపేట మండలం ఆంజనేయపురం వద్ద ఆదివారం జరిగిన కారు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. కారు బ్రిడ్జిని ఢీకొన్నట్లుగా స్థానికులు తెలిపారు. ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీలు, దాడుల్లో 23.62 కోట్ల రూపాయల నగదు, బంగారు ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు కడప జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ పేర్కొన్నారు. కడప ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. 1.15 కోట్ల రూపాయల మద్యం, 5.50 లక్షల రూపాయల విలువ గల గంజాయి, 12 కోట్ల నగదు, 11.13 కోట్ల బంగారు, వెండి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు

కడప చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మృత్యుంజయకుంటలో నివాసం ఉంటున్న ఉదయగిరి కుల్లాయమ్మ అనే వివాహిత శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సిఐ నరసింహారెడ్డి తెలిపారు. ఈనెల 12వ తేదీన రాత్రి ఆమె భర్త కుల్లాయప్ప ఆమెతో గొడవ పడి 11 నెలల కుమారుడిని తీసుకుని ఇంటి నుండి వెళ్లిపోయాడు. దీంతో ఆమె మనస్తాపం చెంది చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

పెద్దముడియం మండలంలోని దిగువ కల్వటాల గ్రామంలో భార్యను ఆమె భర్త గొంతు కోసి హత్య చేశాడు. దిగువ కల్వటాలకు చెందిన ఆదిలక్ష్మికి మైలవరం మండలం కల్లుట్ల గ్రామానికి చెందిన మేనమామ సహదేవుడితో 15 ఏళ్ల కిందట వివాహమైంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆదిలక్ష్మి 2 నెలలుగా పుట్టింటి వద్ద ఉంటోంది. భార్య సంసారానికి రాలేదన్న కోపంతో శనివారం తెల్లవారుజామున నిద్రిస్తున్న ఆదిలక్ష్మిని భర్త కత్తితో గొంతు కోసి హత్య చేశాడు.
Sorry, no posts matched your criteria.