Y.S.R. Cuddapah

News August 1, 2024

స్వాతంత్ర వేడుకలను జయప్రదం చేయండి: కడప కలెక్టర్

image

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జయప్రదం చేయాలని కడప జిల్లా కలెక్టర్ శివ శంకర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ ఇతర అధికారులతో వేడుకల నిర్వహణకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. కడప పోలీస్ మైదానంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో లోపాలు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.

News July 31, 2024

కడప జిల్లాలో పలువురు సీఐల బదిలీ 

image

కడప జిల్లాలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ కర్నూలు డీఐజీ ప్రవీణ్ ఆదేశాలు జారీ చేశారు. కడప చిన్న చౌక్ సీఐగా తేజోమూర్తి, 1 టౌన్ సీఐగా రామకృష్ణ, మైదుకూరు రూరల్ సీఐగా శివశంకర్, ఎర్రగుంట్ల సీఐగా నరేశ్ బాబును నియమించారు. ఖాజీపేట సీఐ రామంజిని మంత్రాలయం సీఐగా బదిలీ చేశారు. కడప చిన్న చౌక్, వన్ టౌన్,  మైదుకూరు రూరల్, ఎర్రగుంట్ల సీఐలను వీఆర్‌లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారి చేశారు.

News July 31, 2024

కడప జిల్లాలో పలువురు DSPలు బదిలీ 

image

కడప జిల్లా వ్యాప్తంగా పలువురు DSPలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పులివెందుల DSP వినోద్ కుమార్, ప్రొద్దుటూరు DSP మురళీధర్ ఇరువురిని పోలీస్ హెడ్ క్వాటర్స్‌లో రిపోర్ట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రొద్దుటూరు DSPగా భక్తవత్సలం, కడప డీపీటీసీ DSPగా ఉన్న రవికుమార్‌ను ఆళ్లగడ్డ DSPగా బదిలీ చేశారు.  

News July 31, 2024

సింహాద్రిపురం: ‘కుమార్తె చేతులపై వాతలు పెట్టిన తల్లి’

image

రావులకోలనులో దంపతుల మధ్య విభేదాలు నెలకొనడంతో వేర్వేరుగా ఉంటున్నారు. వీరి కుమార్తె (14) తల్లి సంరక్షణలో ఉంటోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 28న ఫోనులో తండ్రికి కాల్ చేసి యోగక్షేమాలు తెలుసుకుంది. విషయం తల్లికి తెలియడంతో కుమార్తె చేతులపై వాతలు పెట్టింది. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం పులివెందులకు తరలించారు. విషయం తెలుసుకున్న తండ్రి కూతురితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కేసు నమోదు చేశారు.

News July 31, 2024

కొండాపురం ఘర్షణలో 29 మందిపై కేసు

image

మండలంలోని టీ కోడూరు గ్రామంలో ఆధిపత్యం కోసం ఆదివారం జరిగిన ఘర్షణకు సంబంధించి 29 మందిపై కేసు నమోదు చేసి, గన్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. కోడూరుకు చెందిన పవన్ కుమార్ రెడ్డి, ఎంపీటీసీ రామమునిరెడ్డి మధ్య వాగ్వాదం జరిగి ఒకరిపై ఒకరు రాళ్లు వేసుకోగా ఇరువర్గాల వారికి గాయాలయ్యాయి. ఈ క్రమంలో ఎంపీటీసీ మునిరెడ్డి గాలిలో గన్‌తో ఒక రౌండ్ కాల్పులు జరిపారు.

News July 31, 2024

కడప: గెస్ట్ ఫ్యాకల్టీకి నేడు ఇంటర్వ్యూలు

image

కడపలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేసేందుకు ఆసక్తి, అర్హత కలిగిన మహిళా అభ్యర్థులకు నేడు వాక్‌ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ సలీంబాషా తెలిపారు. MSC కంప్యూటర్సైన్స్, ఎంటెక్ కంప్యూటర్ సైన్స్, ఎంటెక్ డేటా సైన్స్లోలో కనీసం 55 శాతం మార్కులు ఉండాలన్నారు. నెట్/సెట్/స్లెట్, PHD అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు.

News July 31, 2024

‘జగనన్న హౌసింగ్ లేఅవుట్లో భారీ అక్రమాలు’

image

YSR జిల్లా పులివెందులలోని జగనన్న మెగా హౌసింగ్ లేఅవుట్లలో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. లబ్ధిదారుల కోసం గత వైసీపీ ప్రభుత్వం 8468 ఇళ్ల నిర్మాణం చేపట్టగా, 2,489 ఇళ్లు అనర్హులకు కేటాయించినట్లు తాజాగా గుర్తించారు. జగనన్న లేఅవుట్లలో విచారణ జరపాలని ఇటీవల ప్రభుత్వానికి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి లేఖ రాసిన నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ శివ శంకర్ విచారణ జరిపి, 2,489 మంది అనర్హులు ఉన్నట్లు తేల్చారు.

News July 31, 2024

పత్తి పంటను సందర్శించిన జిల్లా వ్యవసాయ అధికారి

image

కడప జిల్లా వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు తాళ్ళపల్లి రైతు సేవా కేంద్ర పరిధిలోని పత్తి పంట పొలాలను సందర్శించారని, వేంపల్లె మండల వ్యవసాయ అధికారి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఇందులో భాగంగా మంగళవారం ప్రతి రైతుకు, రైతు సేవా కేంద్రంలో సిబ్బంది అందరికీ అందుబాటులో ఉండాలని, అలాగే ప్రతి రోజు పొలం పరిసరాలను సందర్శించాలని తెలిపారు. పొలాల్లో రైతు సందేహాలను నివృత్తి చేస్తూ, నూతన పంట పద్ధతులపై అవగాహన కల్పించారు.

News July 30, 2024

రాజంపేట DSP చైతన్య బదిలీ

image

అన్నమయ్య జిల్లా రాజంపేట డీఎస్పీ చైతన్యను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో తాడిపత్రి డిఎస్పీగా ఉన్న సమయంలో ఆయనపై అనేక విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత రాజంపేట DSPగా రావడం, ఎన్నికల సమయంలో తిరిగి తాడిపత్రి ఇన్‌ఛార్జ్ డీఎస్పీగా వెళ్లిన సమయంలో గొడవలు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఆయనను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.

News July 30, 2024

లబ్ధిదారుల ఇళ్ల వద్దనే పెన్షన్ అందజేత: కలెక్టర్

image

ఆగస్టు 1వ తేదీన “ఎన్టీఆర్ భరోసా పెన్షన్” లబ్ధిదారులందరికీ ఇంటి వద్దనే 100% పెన్షన్ పంపిణీ చేసేలా.. అన్ని విధాలా సన్నద్ధంగా ఉన్నామని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. విజయవాడ నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ వీసీ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఒకటో తేదీ 100% పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.