Y.S.R. Cuddapah

News July 30, 2024

కడప: ‘గంజాయి నిర్మూలనపై దృష్టి సారించాలి’

image

కడప జిల్లాలో గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర హోం మంత్రి అనిత సూచించారు. వైజాగ్ నుంచి హోంమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కడప ఎస్పీ కార్యాలయం నుంచి ఎస్పీ హర్షవర్ధన్ రాజు హాజరయ్యారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు విస్తృతంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గంజాయి నిర్మూలనే లక్ష్యంగా రూపొందించిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుకు, గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు.

News July 30, 2024

కడప: ‘గంజాయి నిర్మూలనపై దృష్టి సారించాలి’

image

కడప జిల్లాలో గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర హోం మంత్రి అనిత సూచించారు. వైజాగ్ నుంచి హోంమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కడప ఎస్పీ కార్యాలయం నుంచి ఎస్పీ హర్షవర్ధన్ రాజు హాజరయ్యారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు విస్తృతంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గంజాయి నిర్మూలనే లక్ష్యంగా రూపొందించిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుకు, గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు.

News July 30, 2024

కడప: ‘గంజాయి నిర్మూలనపై దృష్టి సారించాలి’

image

కడప జిల్లాలో గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర హోం మంత్రి అనిత సూచించారు. వైజాగ్ నుంచి హోంమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కడప ఎస్పీ కార్యాలయం నుంచి ఎస్పీ హర్షవర్ధన్ రాజు హాజరయ్యారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు విస్తృతంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గంజాయి నిర్మూలనే లక్ష్యంగా రూపొందించిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుకు, గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు.

News July 30, 2024

AR సిబ్బంది సంక్షేమానికి చర్యలు: ఎస్పీ

image

ఏ.ఆర్ పోలీస్ సిబ్బంది సంక్షేమానికి తగిన చర్యలు చేపట్టాలని జిల్లా SP హర్షవర్ధన్ రాజు AR పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏ.ఆర్ పోలీస్ అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. గార్డు విధులు, ఎస్కార్ట్ విధులు, వ్యక్తిగత భద్రతా అధికారుల (పి.ఎస్.ఓ) నిర్వహించే సిబ్బంది వివరాలు ఏ.ఆర్ అదనపు SP కృష్ణారావును అడిగి తెలుసుకున్నారు.

News July 30, 2024

రాయచోటి మహిళా VROపై వేధింపులు?

image

రాయచోటి మండలం గ్రామ సచివాలయం మహిళా VRO వేధింపులకు గురవుతోంది. వివరాల్లోకి వెళితే.. చెన్నముక్కపల్లికి చెందిన చవాకుల రాజేశ్ వేధిస్తున్నాడని మహిళా వీఆర్వో ఆరోపిస్తోంది. సచివాలయానికి రావడంలేదంటూ తాను చెప్పినట్లు వినాలని వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనను అనుసరిస్తూ అమె ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని మహిళా వీఆర్వో ఆరోపిస్తోంది.

News July 30, 2024

రాయచోటి మహిళా VROపై వేధింపులు?

image

రాయచోటి మండలం గ్రామ సచివాలయం మహిళా VRO వేధింపులకు గురవుతోంది. వివరాల్లోకి వెళితే.. చెన్నముక్కపల్లికి చెందిన చవాకుల రాజేశ్ వేధిస్తున్నాడని మహిళా వీఆర్వో ఆరోపిస్తోంది. సచివాలయానికి రావడంలేదంటూ తాను చెప్పినట్లు వినాలని వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనను అనుసరిస్తూ అమె ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని మహిళా వీఆర్వో ఆరోపిస్తోంది.

News July 30, 2024

కడప: వాళ్లకు ఇదే చివరి ఫొటో

image

తెలుగు గంగ జలాశయంలోకి ఈత కొట్టడానికి వెళ్లిన ముదస్సీర్, రహ్మతుల్లా, షాహిద్‌ మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈత కొట్టడానికి ముందు సెల్ఫీ ఫొటో తీసుకున్నారు. అనంతరం నీటిలో దిగగా ప్రమాదవశాత్తు ముగ్గురూ చనిపోయారు. కాగా వారు కలిసి తీసుకున్న ఆఖరి సెల్ఫీ ఫొటో అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది. ఆ ఫొటో చూసిన విధి వారి స్నేహాన్ని చూసి ఓర్వలేక ఇలా చేసిందని అంటున్నారు.

News July 30, 2024

రాజంపేటలో ఘరానా మోసం

image

పట్టణంలోని ఉస్మాన్ నగర్‌కు చెందిన ఓ వ్యక్తి తన అకౌంట్‌లో రూ.1500 డిపాజిట్ చేస్తే రూ.1లక్ష ఇస్తామని చెప్పడంతో నమ్మి పలువురు మోసపోయిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. మాయమాటలు నమ్మిన పలువురు రూ.7500 డిపాజిట్ చేశారు. అనంతరం మొబైల్ నంబర్‌కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వస్తోందని తెలిపారు. తాము మోసపోయామని బాధిత మహిళలు విలేకర్ల ఎదుట వాపోయారు. అయితే ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు అంటున్నారు.

News July 30, 2024

రాజంపేట: విద్యార్థినులను చితకబాదిన టీచర్

image

రాజంపేటలో టీచర్ విద్యార్థులను చితకబాదింది. పట్నంలోని రాంనగర్ ఎంపీపీ పాఠశాలలో టీచర్ కవిత సోమవారం విద్యార్థులను చితకబాదిందని తల్లిదండ్రులు ఆరోపించారు. పాఠశాలలోని ముగ్గురు విద్యార్థినులను రెండు చేతుల వేలపై స్కేల్‌తో కొట్టడంతో రక్త గాయాలయ్యాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. చదవడం రాలేదనే కోపంతో కొట్టానని టీచర్ చెప్పింది. విచారించి తగిన నిర్ణయం తీసుకుంటానని MEO-1 రఘునాథరాజు తెలిపారు

News July 30, 2024

కడపలో సమస్యల పరిష్కార వేదిక నిర్వహించిన జిల్లా ఎస్పీ

image

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో ఎస్పీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి జిల్లా ఎస్పీ నేరుగా ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.