Y.S.R. Cuddapah

News December 22, 2024

ఓబులవారిపల్లి: బైక్‌ను ఢీకొన్న ఆటో.. భార్యా భర్తలు మృతి

image

ఓబులవారిపల్లి మండలం రెడ్డిపల్లి చెరువు కట్ట వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రాజంపేట వెళ్తున్న బైకును, రాజంపేట నుంచి వస్తున్న ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో <<14954233>>నరసింహ(40), భార్య సుజాత (35) అక్కడికక్కడే మృతి చెందారు. <<>>కుమారుడు, కుమార్తెలు ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. రాజంపేట భువనగిరి పల్లెకు చెందిన నరసింహ వై.కోటలో అత్తగారింటికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

News December 22, 2024

శివాలయ అభివృద్ధికి కృషి చేస్తా: MLA మాధవి

image

కడప నగరంలోని మృత్యుంజయ కుంట శివాలయ అభివృద్ధికి కృషి చేస్తానని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టం చేశారు. శివాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, దేవాదాయశాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే మాధవిరెడ్డి పరిశీలించారు. తమ హయాంలో ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

News December 22, 2024

కొండాపురం : గండికోట ముంపు వాసులకు అండగా ఉంటాం

image

గండికోట జలాశయాన్ని ఆదివారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. త్యాగ సీనులైనా గండికోట ముంపు వాసులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం పరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ఉన్నారు. MLA ఆదినారాయణరెడ్డి, జమ్మలమడుగు టీడీపీ ఇన్‌ఛార్జ్ భూపేశ్ రెడ్డి, ఉన్నతాధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

News December 22, 2024

రాయచోటిలో కాల్పుల కలకలం

image

అన్నమయ్య జిల్లాలో కాల్పులు కలకలం సృష్టించాయి రాయచోటి మండలం మాధవరంలో ఈరోజు ఉదయం దుండగులు ఇద్దరు వ్యాపారులపై తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో స్థానికులు బాధితులను రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News December 22, 2024

జనవరి 29 నుంచి దేవుని కడప శ్రీవారి బ్రహ్మోత్సవాలు

image

తిరుమలకు తొలి గడప దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో జ‌న‌వరి 29 నుంచి ఫిబ్ర‌వ‌రి 6వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ మేరకు తిరుమలలో అధికారులతో సమావేశం నిర్వహించారు. జ‌న‌వరి 28వ తేదీ సాయంత్రం అంకురార్పణ జ‌రుగ‌నుంది. జనవరి 29వ‌ తేదీ ఉద‌యం 9.30 గంట‌ల‌కు ధ్వ‌జారోహ‌ణంతో బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం కానున్నాయి.

News December 21, 2024

కడప: 1991 నాటి YS జగన్ ఫొటో వైరల్

image

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ఇంటర్నెట్‌లో ఓ ఫొటో వైరల్ అవుతుంది. 1991లో జగన్ తీసుకున్న ఫొటో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఆయన స్థానికంగా ఉన్న వ్యక్తితో ఫొటో దిగగా తాజాగా ఆ ఫొటో బయటకు వచ్చింది. శనివారం జగన్ పుట్టిన రోజు సందర్భంగా.. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ అభిమాని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆ పోస్టును ఆయన అభిమానులు షేర్ చేస్తున్నారు.

News December 21, 2024

కడప జిల్లాకు క్యూ కట్టిన మంత్రులు

image

కడప జిల్లాకు రాష్ట్ర, కేంద్ర మంత్రులు క్యూ కట్టారు. ఆదివారం నీటి పారుదల శాఖా మంత్రి నిమ్మలరామానాయుడు గండికోట ప్రాజెక్టును సందర్శించనున్నారు. అలాగే పర్యాటకం, సాంస్కృతికం, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ జమ్మలమడుగు, పెండ్లిమర్రి, చింతకొమ్మదిన్నె మండలాల్లో పర్యటించనున్నట్లు కలెక్టర్ శ్రీధర్ తెలిపారు.

News December 21, 2024

ఆకాంక్ష జిల్లాల లక్ష్య సాధనకు కృషి చేయాలి: కడప కలెక్టర్

image

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను కడప జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసే ఆకాంక్షతో జిల్లాల లక్ష్య సాధనకు కృషి చేయాలని, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ది పురోగతిపై సంబంధిత జిల్లా కలెక్టర్లతో నీతి ఆయోగ్ సీఈవో వీసీ ద్వారా శుక్రవారం సమీక్షించారు. సంబందిత శాఖలు అన్ని పారామీటర్లు 100% లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలన్నారు.

News December 21, 2024

22న కడపకు మంత్రి కందుల రాక

image

రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ఈనెల 22న కడపకు వస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. రాజమండ్రి నుంచి ఆయన రైలు మార్గాన ఆదివారం ఉదయం కడపకు చేరుకుంటారు. మేడా ఫంక్షన్ హాల్లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తిరిగి సాయంత్రం తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరి రాజమండ్రికి వెళ్తారు.

News December 20, 2024

రాయచోటి వద్ద RTC బస్‌లో మహిళ ప్రసవం

image

ఆర్టీసీ బస్‌లోనే మహిళ ప్రసవించిన ఘటన శుక్రవారం జరిగింది. పీసీపల్లి మండలం ఇర్లపాడుకు చెందిన ప్రయాణికురాలు ‘బెంగళూరు’ నుంచి కనిగిరి బస్‌లో బయల్దేరారు. రాయచోటి సమీపంలోని రామాపురం వద్ద పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో డ్రైవర్ బస్ ఆపారు. వెంటనే ఆమె ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డను 108లో ఆసుపత్రికి తరలించినట్లు డ్రైవర్లు బాబు, రసూల్ తెలిపారు.