India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ధనుర్మాసం ప్రారంభమైంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో మహిళలు ఉదయాన్నే ఇంటి వాకిటను శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి వరకు రంగురంగుల రంగవళ్లులను తీర్చిదిద్దుతుంటారు. మరి మీ అందమైన ముగ్గులను మాకు పంపండి. మీ పేరుతో Way2Newsలో మేము పబ్లిష్ చేస్తాం.
● ఇలా పంపండి: ముగ్గు ఫొటో, మీ పేరు, ఊరి పేరు, పాస్పోర్టు సైజు ఫొటోను 97036 22022కు వాట్సాప్ చేయండి.
రాజంపేట పట్టణం ఈడిగపాలెంలో ఉంటున్న వీఆర్వో షేక్ ముజీబ్, షేక్ మసుధ బేగం దంపతుల కుమారుడు మహమ్మద్ 18 నెలల వయస్సులో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నాడు. నవంబర్ 30న అర్హత సాధించగా, డిసెంబర్ 19న ప్రశంసా పత్రం, మెడల్స్ అందుకున్నట్లు తల్లితండ్రులు తెలిపారు. 27 రకాల వెజిటబుల్స్, పండ్లు, జంతువులు, వాహనాలు, సమరయోధులు, శరీర అవయవాలు, నటులు.. ఇలా ఎన్నో గుర్తించినందుకు రికార్డ్స్లో ఎక్కాడు.
ఆర్టీసీ పరిధిలోని సమస్యలను పరిష్కరించుటకు అనుగుణంగా శుక్రవారం డయల్ యువర్ ఆర్ఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్ ఎం గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా పరిధిలోని ప్రజలు ప్రయాణికులు సమస్యలను తెలియజేయవచ్చునని వివరించారు. సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు తెలపవచ్చన్నారు.
కడప జిల్లా పరిధిలోని ముద్దనూరు నుంచి రేణిగుంట వరకు అస్తవ్యస్తంగా ఉన్న జాతీయ రోడ్డును వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, హైవే మంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతిపత్రం అందించారు. గతంలో పలుమార్లు వినతి పత్రాలు అందించినట్లు గుర్తుచేశారు. కడప- ముద్దునూరు రోడ్డు నాలుగు వరుసల రహదారిగా మార్చాలని కోరారు.
భిన్నంత్వంలో ఏకత్వం కల భారత దేశ గొప్పతనానికి జాతీయ సమైక్యతే కారణమని ఒంటిమిట్ట పోతన సాహిత్య పీఠం అధ్యక్షుడు, రాజంపేట స్పెషల్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ డాక్టర్. పసుపులేటి శంకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నంద్యాల జిల్లా పాణ్యంలోని శ్రీ రాజీవగాంధీ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కళాశాలలోని విద్యార్థులకు జాతీయ సమైక్యత, జీవితం, విలువలు, వృత్తి నైపుణ్యం గురించి ప్రసంగించారు.
కడప యోగి వేమన యూనివర్సిటీ పరిధిలో ఉన్న బీఈడీ కళాశాలల అఫ్లియేషన్పై ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీని నియమించి, విచారణ జరిపించాలని TNSF జిల్లా అధ్యక్షుడు బొజ్జ తిరుమలేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు వైవీయూ రిజిస్ట్రార్ పీ.పద్మకు బుధవారం వినతిపత్రం అందజేశారు. అఫ్లియేషన్కు అనర్హత కలిగిన కళాశాలకు గుర్తింపు రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు భరత్ సింహా, కిషోర్, రవి, ఆసిఫ్, తదితరులు పాల్గొన్నారు.
కడప జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న జిల్లా సర్వజన ఆసుపత్రిని మరింత అభివృద్ధి పథంలో నడిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సూచించారు. రిమ్స్ ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రిమ్స్ వైద్య విభాగాధిపతులతో బుధవారం సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రజలకు మాత్రమే కాకుండా రాయలసీమ స్థాయిలోనూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ అత్యుత్తమ టీచింగ్ హాస్పిటల్గా పేరు గడించిందన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న జమిలి ఎన్నికల నిర్ణయం సరైనది కాదని పీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ తులసిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. జమిలీ ఎన్నికలు అవసరం లేదని, ఆచరణ కూడా సాధ్యం కాదని అన్నారు. జమిలి ఎన్నికలు బీజేపీ ప్రభుత్వం తీసుకురావాలి అనుకోవడం మూర్ఖత్వం అని మండిపడ్డారు. ఇలాంటి నిర్ణయాలు మార్చుకోవాలని హితువు పలికారు.
కలికిరిలో జరగబోయే రెవెన్యూ సదస్సుకు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి బుధవారం హాజరు కానున్నారు. ఈనెల 6 నుంచి అన్నమయ్య జిల్లాలో రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. భవిష్యత్తులో భూ సమస్యలు లేకుండా చేసేందుకు, రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. కలికిరి మండలానికి సంబంధించిన ప్రజలు సమస్యలను తెలపాలన్నారు.
రైల్వే కోడూరు మండలం లక్ష్మిగారిపల్లి వద్ద అనంతపురానికి చెందిన అనస్థీషియా ట్రైనీ డాక్టర్ మహేంద్ర (21) సోమవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందారు. తిరుపతిలో డాక్టర్ కోర్సు చేస్తూ.. సోమవారం అనంతపురం నుంచి బుల్లెట్ బైక్పై తిరుపతి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.