India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వైసిపి నాయకుల, కార్యకర్తల అక్రమ అరెస్టులను ఆపాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన కడపలో మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను అరెస్టు చేయటం దారుణం అన్నారు. చిన్న వివాదానికి సంబంధించి ఆయనని అరెస్టు చేయడం కక్ష సాధింపేనని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

కడప జిల్లాలో TDPని బలోపేతం చేయాలనే ఆ పార్టీ పెద్దల ఆకాంక్ష.. స్థానిక నేతల వర్గపోరుతో తీరేలా కనిపించడం లేదు. ఈ మధ్య కాలంలో మాజీ MLC బీటెక్ రవి, MLC రాంగోపాల్ రెడ్డి వర్గీయుల మధ్య ఆధిపత్యం తారాస్థాయికి చేరుకుంది. ఇటీవల వీరి వర్గీయులు ఘర్షణలకు దిగారు. మంగళవారం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత ఎదుటే ఒకరిపై ఒకరు బాహాబాహికి దిగారు. దీంతో జిల్లా TDP సీనియర్ నేతలు తలలు పట్టుకుంటున్నారు.

ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయంలో నిర్వహించబోయే కళ్యాణోత్సవం ఏర్పాట్లపై మంగళవారం మధ్యాహ్నం కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సమీక్ష సమావేశం నిర్వహించారు. కళ్యాణోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో ఎక్కడా ఇబ్బందులు జరగకుండా పటిష్టంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం, ఎస్పీ అశోక్ కుమార్ పాల్గొన్నారు.

ఇటీవల కురిసిన వర్షానికి అరటిపంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి సవిత పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో జేసీ అతిధి సింగ్తో కలిసి అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం అందించే విధంగా నివేదికలు తయారు చేయాలని సూచించారు.

ఒంటిమిట్ట కోదండరాముని కళ్యాణోత్సవానికి కట్టుదిట్టమైన ఏర్పాటు చేసినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ అశోక్ కుమార్తో కలిసి టీటీడీ ఈవో 11న జరగబోయే కళ్యాణ వేడుక ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కళ్యాణ వేడుకకు ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు రానున్న నేపథ్యంలో ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలన్నారు.

తొండూరులో నిర్మితమవుతున్న జ్యోతిరావు పూలే బాలికల జూనియర్ కళాశాల, పాఠశాల పనులను మంత్రి సవిత, కలెక్టర్ శ్రీధర్, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి పరిశీలించారు. మంగళవారం పాఠశాల ప్రాంగణంలో పలు గదులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణ పనుల్లో నాణ్యత స్పష్టంగా కనిపించాలన్నారు. అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.

పీలేరు హంద్రీనీవా సుజల స్రవంతి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పని చేస్తున్న రమ (56) మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె సోమవారం ఉదయం రాయచోటిలో జరిగే ప్రజాసమస్యల పరిష్కార వేదికకు కారులో వెళ్తుండగా సంబేపల్లిలోని ఎర్రగుంట్ల బస్టాండ్ సమీపంలో, గల్ఫ్కు వెళ్లేందుకు చెన్నై వెళ్తున్న కారు ఢీ కొట్టింది. రమ అక్కడికక్కడే చనిపోగా.. ఆమె డ్రైవర్ ముబారక్, అటెండర్ జీరూనాయక్, ఢీ కొట్టిన కారు డ్రైవర్ గాయపడ్డారు.

కడప జిల్లాలోని పేద ప్రజలకు మరో షాక్ తగిలింది. గ్యాస్ సిలిండర్పై రూ.50 పెంచడంతో సామాన్యులపై మరింత భారం పడనుంది. జిల్లాలో 7.50 లక్షలకు పైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. గతంలో రూ.853గా ఉన్న సిలిండర్ రూ.903కు చేరడంతో జిల్లాలోని వినియోగదారులపై అదనంగా రూ.3కోట్లకుపైగా భారం పడనుంది. దీనిపై మీ కామెంట్.

గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో సబర్మతి నది ఒడ్డున ఉన్న సబర్మతి ఆశ్రమాన్ని సోమవారం రాత్రి పలువురు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఏఐసీసీ సభ్యులు తులసిరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సబర్మతి ఆశ్రమంలో మహాత్మా గాంధీ నివసించిన ఇల్లు చూడటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అక్కడ ఆయన 12 సంవత్సరాలు నివసించారని తెలిపారు. ఇది మర్చిపోలేని ఘటన అని ఆయన అన్నారు.

మహానాడును విజయవంతం చేసేందుకు సమన్వయంతో పని చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. సోమవారం కడప నగరంలో వివిధ చోట్ల మహానాడు ఏర్పాటుకు స్థలాలను పరిశీలించారు. జిల్లాలోని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు సమన్వయంతో పనిచేసి, కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యలని సూచించారు.
Sorry, no posts matched your criteria.