Y.S.R. Cuddapah

News December 16, 2024

పుష్పగిరిలో ఘనంగా పౌర్ణమి గ్రామోత్సవాలు

image

పుణ్యక్షేత్రమైన పుష్పగిరిలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి, శ్రీ కామాక్షి వైద్యనాథేశ్వర స్వాముల పున్నమి గ్రామోత్సవాలు ఆదివారం రాత్రి ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా స్వామివార్లను వేరువేరు పల్లకిలపై ఆసీనులను చేసి పూజలు నిర్వహించారు. అనంతరం దివిటీ వెలుగులు, మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవాన్ని ఘనంగా చేపట్టారు.

News December 15, 2024

YS రాజశేఖర్ రెడ్డి స్వగ్రామంలో టీడీపీ హవా.!

image

కడప జిల్లా సింహాద్రిపురం మండలం మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ YS రాజశేఖర్ రెడ్డి స్వగ్రామం బలపనూరులో శనివారం జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికలో TDP అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం గమనార్హం. బలపనూరు సాగునీటి సంఘం ఛైర్మన్‌గా వై వీరప్రతాప్ రెడ్డి, వైస్ ఛైర్మన్‌గా రాజేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దశాబ్దాల తర్వాత ఇక్కడ టీడీపీ అధికారం చేపట్టడంతో సంబరాలు చేసుకున్నారు.

News December 15, 2024

కడపలో ప్రతిపక్ష వైసీపీకి బిగ్ షాక్.?

image

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు తన సొంత జిల్లా కడపలో బిగ్ షాక్ తగలనుందా.? కడప కార్పొరేషన్‌లో ఏడుగురు వైసీపీ కార్పొరేటర్లు YCPని వీడి TDPలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఒక కార్పొరేటర్ టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. కాగా మిగిలిన ఏడుగురు కార్పొరేటర్లు ఎల్లుండి CM చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందన్నది వేచి చూడాలి.

News December 15, 2024

రాజంపేట: పుట్టినరోజు నాడు తీవ్ర విషాదం

image

రాజంపేటలో శనివారం రోడ్ ప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. కర్నూలు జిల్లా కోవెలకుంట్లకు చెందిన కిరణ్ రాజంపేట ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. శనివారం కిరణ్‌ పుట్టినరోజు కావడంతో పులివెందులకు చెందిన బన్నీ చెన్నైలో చదువుతూ రాజంపేటకు వచ్చారు. కాగా ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు మృతి చెందగా.. కిరణ్ పుట్టిన రోజు నాడే చివరి రోజైందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

News December 15, 2024

ఇంధన భద్రత, పొదుపు ప్రతి ఒక్కరి భాద్యత: కడప కలెక్టర్

image

ఈనెల 14వ తేదీ నుంచి 20వ తేది వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి గోడపత్రాలు, కరపత్రాలను శనివారం తన క్యాంప్ ఆఫీసులో కడప జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి విడుదల చేశారు. ఇంధనాన్ని పొదుపు చేయడంపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ వారోత్సవ ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. ఈ వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.

News December 14, 2024

సావిశెట్టిపల్లె నీటి సంఘం అధ్యక్షుడిగా విజయ రెడ్డి

image

శ్రీ అవధూత కాశినాయన మండలంలోని సావిశెట్టి పల్లె ఆయకట్టు చెరువుకు సంబంధించి శనివారం నీటి సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు ఎన్నికల అధికారి బాలి రెడ్డి తెలిపారు. నీటి సంఘం అధ్యక్షుడిగా విజయరెడ్డి, ఉపాధ్యక్షురాలిగా బండి సుబ్బ లక్ష్మమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, బండి రామచంద్రారెడ్డి, రఘురాంరెడ్డి వారిని అభినందించారు. తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

News December 14, 2024

ఓబులవారిపల్లి: హత్య కేసు నిందితులు అరెస్ట్

image

ఓబులవారిపల్లి మండలం మంగంపేట 10వ వీధికి చెందిన గట్టు ఆంజనేయులు(57) హత్య కేసులో నిందితుడు అయ్యలరాజుపల్లికి చెందిన అంజనేయ ప్రసాద్‌కు సహకరించిన చంద్రకళ, సింహాద్రిని కూడా అరెస్టు చేశామని రాజంపేట డీఎస్పీ సుధాకర్ తెలిపారు. శుక్రవారం కోడూరు స్టేషన్‌లో మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టి, వివరాలు వెల్లడించారు. యూట్యూబర్ అయిన నిందితుడు సానుభూతి పొందడానికి వీడియో రిలీజ్ చేశారని తెలిపారు.

News December 14, 2024

రాష్ట్రంలో రాజంపేట టాప్

image

కోటి సభ్యత్వాలే లక్ష్యంగా టీడీపీ ముందుకెళ్తోంది. రూ.100 కడితే రూ.5 లక్షల బీమా ఉండటంతో పలువురు టీడీపీ సభ్యత్వాలు తీసుకుంటున్నారు. ఈక్రమంలో నిన్నటి వరకు మొత్తం సభ్యత్వాల సంఖ్య 71 లక్షలు దాటింది. ఇందులో రాజంపేట టాప్‌లో ఉంది. ఆ తర్వాతే సీఎం సొంత నియోజకవర్గం కుప్పం ఉండటం గమనార్హం.

News December 13, 2024

జర్నలిస్టులపై దాడి హేయమైన చర్య: YS జగన్‌

image

కడప జిల్లా వేముల మండల కేంద్రంలో నీటి సంఘాల ఎన్నికల్లో అధికార టీడీపీ నేతల దారుణాలను ప్రపంచానికి చూపిస్తున్న జర్నలిస్ట్‌లపై దాడి హేయమైన చర్యని YS జగన్‌ అభిప్రాయపడ్డారు. X వేదికగా ఈ దాడిని ఆయన శుక్రవారం తీవ్రంగా ఖండించారు. మీడియాపై జరిగిన దాడిని ప్రజాస్వామ్యంపై దాడిగా ఆయన అభివర్ణించారు. నిజాలు నిర్భయంగా వెలికితీస్తున్న మీడియా గొంతు నొక్కేయాలనుకోవడం కూటమి ప్రభుత్వం దుర్మార్గపు చర్య అన్నారు.

News December 13, 2024

కీలక విషయాలు బయటపెట్టిన కడప కలెక్టర్

image

సీఎం చంద్రబాబుతో జరిగిన సమావేశంలో కడప కలెక్టర్ శ్రీధర్ కీలక విషయాలు బయటపెట్టారు. ‘వేరే జిల్లాలో ఇచ్చిన సదరం సర్టిఫికెట్‌తో మా జిల్లాలో 3,600 మంది పింఛన్ తీసుకుంటున్నారు. వీరిపై అనుమానంతో తనిఖీలు చేయగా కేవలం 127 మందే అర్హులని తేలింది. మిగిలిన వాళ్లు ఫేక్ సర్టిఫికెట్లతో పింఛన్ తీసుకున్నారు’ అని CMకు చెప్పారు. వెంటనే వారి నుంచి పెన్షన్ డబ్బులు రికవరీ చేసి.. అవసరమైతే కేసు పెట్టాలని CM ఆదేశించారు.