Y.S.R. Cuddapah

News July 26, 2024

భద్రతా చర్యల ఆంక్షలను కఠినతరం చేయాలి: కలెక్టర్

image

ప్రజల ప్రాణ భద్రత కోసం చేపడుతున్న రోడ్డు భద్రత చర్యల ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ సంబందిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రహదారుల భద్రతా సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్, ఎస్పీ హర్షవర్ధన్ పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్న రహదారులపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చర్యలను కఠినతరం చేయాలని సంబందిత అధికారులను ఆదేశించారు.

News July 26, 2024

కడప: షార్ట్ ఫిలిం పోటీల్లో గెలిస్తే రూ.2 లక్షల బహుమతి

image

నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆధ్వర్యంలో షార్ట్ ఫిలిం నిర్మాణ పోటీలను నిర్వహించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఫిల్మ్ మేకర్లు మానవ హక్కులపై చిత్రం తీసి ఆగస్టు 30 లోపు తమకు చేరేలా పంపాలన్నారు. ఈ పోటీ ద్వారా మేకర్స్‌లోని సృజనాత్మకతను గుర్తిస్తామని అన్నారు. గెలుపొందిన వారికి మొదటి బహుమతి రూ.2 లక్షలు, ద్వితీయ రూ.1.50 లక్షలు, తృతీయ లక్ష ఇవ్వనున్నారు. వివరాలకు htpp://nhrc.nic.in సంప్రదించాలన్నారు.

News July 26, 2024

YVU ప్రొఫెసర్ ఎంవీ శంకర్ కు ప్రతిష్టాత్మక బ్రెయిన్ పూల్ ఫెలోషిప్

image

కడప: నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆఫ్ కొరియా 2024లో అత్యుత్తమ విదేశీ పరిశోధకులకు అందించే బ్రెయిన్ పూల్ ఫెలోషిప్ వైవీయూ మెటీరియల్స్ సైన్స్ నానోటెక్నాలజీ ప్రొ.ఎం.వి.శంకర్ కు లభించింది. దక్షిణ కొరియాలోని ప్రపంచ ర్యాంకింగ్ సంస్థ కొంకుక్ యూనివర్శిటీలో పని చేయడానికి ఈయనను ఆహ్వానించింది. ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన 81 మంది సభ్యులలో ఆయన ఒకరు. వీసీ ప్రొ కె.కృష్ణారెడ్డి, రిజిస్ట్రార్ రఘునాథ రెడ్డి అభినందించారు.

News July 26, 2024

అన్ని రంగాల్లో కడప జిల్లాను టాప్-5లో నిలపాలి: కలెక్టర్

image

అన్ని రంగాల్లో ఏపీలో కడప జిల్లాను టాప్-5లో నిలపాలని కలెక్టర్ శివశంకర్ లోతేటి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్ సెల్ హాలులో జేసీ అదితి సింగ్‌తో కలిసి కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. RSKల ద్వారా వ్యవసాయ, ఉద్యాన రంగ సేవలను విస్తృతం చేయాలన్నారు. ఎపీఎంఐపీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సన్న చిన్నకారు రైతులకు అందేలా చర్యలు చేపట్టాలన్నారు.

News July 25, 2024

కడప: 108 వాహనాల్లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

108 వాహనాల్లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (EMT) ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు. జీఎన్ఎం, బీఎస్సీ లైఫ్ సైన్సెస్, బి. ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్ తదితర కోర్సులు చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులని చెప్పారు. రేపటి లోపు న్యూ రిమ్స్‌లోని 108 కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News July 25, 2024

ప్రొద్దుటూరు: 31న పాలిటెక్నిక్‌లో స్పాట్ అడ్మిషన్లు

image

ప్రొద్దుటూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 31న ఉదయం 10 గంటలకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఎంవీసీహెచ్ జగదీశ్వరుడు తెలిపారు. కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ కోర్సులలో మొదటి సంవత్సరానికి గాను స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామన్నారు. 10వ తరగతి పాసై ఆసక్తి గల విద్యార్థులు స్పాట్ అడ్మిషన్లకు హాజరుకావాలని కోరారు.

News July 25, 2024

కడప: బయోటెక్నాలజీలో షేక్ సమీనకు YVU డాక్టరేట్

image

YVU బయోటెక్నాలజీ శాఖ స్కాలర్ షేక్ సమీనకు డాక్టరేట్ ప్రదానం చేసింది. ప్రొఫెసర్ ఎ. చంద్రశేఖర్ పర్యవేక్షణలో “నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ పద్దతిని ఉపయోగించి, కొర్రలలో దిగుబడిని పెంచేందుకు రికాంభినెంట్ ఇనెబ్రీడ్ లైన్స్ని అభివృద్ధి చేశారు. ఈ రీసెర్చ్ భారతదేశంలో మొదట ఆధునిక జీనోమ్ ఆధారిత పరిశోధన కావడం విశేషం. ఈ పరిశోధనకు డాక్టరేట్ ప్రదానం చేసినట్లు వైవీయూ సీఈ ప్రొ. ఎన్. ఈశ్వర రెడ్డి తెలిపారు.

News July 25, 2024

గన్ మెన్లను తిరస్కరించిన కడప ఎమ్మెల్యే

image

తనకు కనీస సమాచారం ఇవ్వకుండా 2+2 గన్ మెన్లను 1+1కు కుదించడంపై కడప ఎమ్మెల్యే మాదవిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పైగా తన భర్త శ్రీనివాసులురెడ్డికి ఉన్న 1+1 సెక్యూరిటీని పూర్తిగా తొలగించారు. దీంతో తనకు అసలు సెక్యూరిటీనే అవసరం లేదంటూ వారిని పంపించేశారు. సెక్యూరిటీని కుదిస్తూ పోలీసు అధికారులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎమ్మెల్యే ఖండించారు. అనంతరం అసెంబ్లీ సమావేశాలకు సెక్యూరిటీ లేకుండానే వెళ్లారు.

News July 25, 2024

‘కడప RIMSకు చికిత్సకు వెళ్తే.. డబ్బులు తీసుకున్నారు’

image

పేషెంట్ నుంచి రిమ్స్ ఉద్యోగి డబ్బులు తీసుకున్నాడని బుధవారం ఓ మహిళ RMOకు ఫిర్యాదు చేసింది. CKదిన్నె మండలానికి చెందిన మహిళ HIV చికిత్స తీసుకుంటూ మందులు తీసుకోవడానికి తరచూ RIMSకి వచ్చేది. ఈ క్రమంలో అక్కడ పనిచేస్తున్న కౌన్సిలర్‌కు పరిచయం ఏర్పడి ఫోన్ పే ద్వారా రూ.20 వేలు చెల్లించారు. తన డబ్బులు అడగ్గా ఇవ్వనని, అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో ఆమె ఫిర్యాదు చేయగా, చర్యలు తీసుకుంటామని RMO తెలిపారు.

News July 25, 2024

అసెంబ్లీ ప్యానెల్ స్పీకర్ గా బద్వేలు MLA

image

బద్వేలు MLAగా రెండో సారి ఎన్నికైన డాక్టర్ దాసరి సుధను ప్యానెల్ స్పీకర్‌గా నియమించడం జరిగిందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఈమెతో పాటు వరద రాజులరెడ్డిని కూడా నియమించారు. 2024 ఎన్నికల్లో BJP అభ్యర్థిపై 20వేలకు పైగా మెజారిటీతో గెలిచారు. అంతకుముందు భర్త మరణించడంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన సుధ ఉపఎన్నికల్లో 90 వేలు పైచిలుకు మెజారిటీతో గెలిచారు. అటు BJP విప్‌గా ఆదినారాయణరెడ్డిని ఎంపిక చేశారు.