India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కడప నగరానికి చెందిన ఓ యువకుడు తన ప్రతిభను చాటాడు. చాక్ పీస్పై జాతీయ జెండాను రూపొందించి తనలో ఉన్న ప్రతిభను చాటి చెప్పాడు. కడప నగరం చిన్నచౌక్ ప్రాంతానికి చెందిన సాయి చరణ్ క్యూబిక్లో ప్రతిభతో పాటు పెన్సిల్, చాక్ పీస్పై వివిధ రకాల ఆర్ట్ వేస్తూ అబ్బుర పరుస్తూ ఉంటాడు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా చాక్ పీస్పై ఆర్ట్ వేయడంతో పలువురు అభినందిస్తున్నారు.
కడపలో ఫ్లెక్సీ వార్ పెద్ద హాట్ టాపిక్గా మారింది. స్థానిక ఆర్ట్స్ కాలేజీ వద్ద వైసీపీ, జనసేన మధ్య ఫ్లెక్సీల పోరు ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా, ‘21తో గేమ్ ఛేంజర్ అవ్వలేము.. 50 తీసుకోవాలి’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దేశించి వచ్చిన ఫ్లెక్సీలు వైసీపీ కార్యకర్తల్లో ఆగ్రహానికి దారితీసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ‘జై జగన్, జోహార్ వైఎస్సార్’ అంటూ కింద నినాదాలు వేశారు.
కడప రవాణా శాఖ కార్యాలయంలో మహిళా అధికారి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన జిల్లా రవాణా శాఖ అధికారి చంద్రశేఖర్ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. శాఖపరమైన విచారణకు ప్రభుత్వం ఆదేశించడంతో విచారించిన అధికారులు అతని తప్పు ఉందని తెలియడంతో అతడిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మహిళా అధికారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఇప్పటికే మంత్రి మండిపల్లి స్పష్టం చేశారు.
తిరుపతి నుంచి ఆదోని వెళ్తున్న RTC సూపర్ లగ్జరీ బస్సు తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో వల్లూరు సమీపంలో ఆగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్సు వెనుక వైపున పొగ రావడం గమనించిన ప్రయాణికులు డ్రైవర్కు తెలిపారు. టెక్నికల్ సమస్యతో బస్సు ముందుకు కదలకపోవడంతో ప్రత్యామ్నాయంగా వేరే బస్సులో ఎక్కించి పంపించారు. దూర ప్రయాణాలు చేసే బస్సుల కండిషన్ సరిగా లేకపోవడం పట్ల ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు.
కడప జిల్లాలోని అన్ని చెక్ పోస్టుల వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అశోక్ కుమార్ అధికారులను ఆదేశించారు. గంజాయి, అక్రమ మద్యం, నిషేదిత పదార్థాలు, ఇతర వస్తువుల అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాలని పేర్కొన్నారు. శుక్రవారం అర్ధరాత్రి దువ్వూరు పీఎస్ పరిధిలోని ఇడమడక అంతర్ జిల్లా చెక్ పోస్ట్ను జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మాజీ మంత్రి వైఎస్ వివేక హత్యపై విజయసాయిరెడ్డి స్పందించారు. వివేకానందరెడ్డి చనిపోయినట్టు తెలిసి షాకయ్యానని, వెంటనే అవినాశ్ రెడ్డికి ఫోన్ చేయగా పక్కన ఉన్న వ్యక్తికి ఫోన్ ఇచ్చారన్నారు. గుండెపోటుతో వివేకా చనిపోయినట్టు నాకు చెప్పారని, ఫోన్లో వచ్చిన సమాచారమే మీడియాకు చెప్పినట్లు తెలుస్తోంది.
పులివెందులలో వైఎస్ జయమ్మ 18వ వర్ధంతి వేడుకలలో శనివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. పులివెందులలోని డిగ్రీ కళాశాలలోని జయమ్మ సమాధి వద్ద మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైయస్ జార్జిరెడ్డి, సతీమణి వైయస్ భారతమ్మ, వైయస్ సుధీకర్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్, వైఎస్ సౌభాగ్యమ్మలు నివాళులు అర్పించారు.
కడప జిల్లా నూతన ఎస్పీ అశోక్ కుమార్ జిల్లా కలెక్టర్ శ్రీధర్ను శుక్రవారం కలిశారు. నూతన ఎస్పీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం కడప కలెక్టర్ శ్రీధర్ను మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను కలెక్టర్ను అడిగి ఆరా తీశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.
రాష్ట్రంలో విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలుకు వైసీపీ విద్యార్థి విభాగం నాయకులు కృషి చేయాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సూచించారు. వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పసుపులేటి సాయిదత్త ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ను ఆయన కడప కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఎన్నికల సమయంలో విద్యార్థులకు సీఎం ఇచ్చిన హామీలు అమలు కోసం పోరాటం చేయాలని సూచించారు.
వైసీపీ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడం చూస్తుంటే, పులివెందులకు ఉప ఎన్నికలు రావడం ఖాయంగా కనపడుతోందని పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. రాజకీయాలకు విజయ్ సాయిరెడ్డి రాజీనామా చేశారంటే అప్రూవర్గా మారడం ఖాయమన్నారు. ఇక జగన్ డిస్ క్వాలిఫై అవుతారని, పులివెందుల నియోజకవర్గానికి ఉప ఎన్నికలు ఖాయమంటూ ట్వీట్ చేశారు.
Sorry, no posts matched your criteria.