India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కడప జిల్లాలోని హిందూ, ముస్లిం సోదరులు కలిసిమెలిసి జీవిస్తూ మత సామరస్యానికి ప్రతీకగా జిల్లాను నిలిపారని జిల్లా SP అశోక్ కుమార్ పేర్కొన్నారు. కడప ఉమేష్ చంద్ర కల్యాణ మండపంలో ముస్లిం సోదరులకు, పోలీస్ శాఖలోని ముస్లిం పోలీస్ అధికారులు, సిబ్బందికి ఆదివారం సాయంత్రం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. కడపలో ప్రతి ఒక్కరు సంతోషంగా రంజాన్ పండుగ జరుపుకోవాలని ఎస్పీ ఆకాంక్షించారు.

నిత్యం విధి నిర్వహణలో బిజీబిజీగా గడిపే పోలీసులు ఒక్కసారిగా పంచకట్టులో ఆకట్టుకున్నారు. తెలుగు నూతన సంవత్సరం పండుగ ఉగాది పండుగ రోజు అదివారం కడప జిల్లా పోలీసు కార్యాలయంలో ఉగాది వేడుకలు అంబరాన్ని అంటాయి. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, అడిషనల్ ఎస్పీ ప్రకాష్ బాబు ఇతర అధికారులు సంప్రదాయ దుస్తులు ధరించి ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రజలకు ఎస్పీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

కడప కలెక్టరేట్లో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ సంబరాలు ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి ,మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పాల్గొన్నారు. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన ఏడాదిలో అందరికి శుభం కలగాలని ప్రార్థించారు. పండితులు పంచాంగ శ్రవణం వినిపించారు.

కర్నూలు రేంజ్ పరిధిలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆదివారం ఉదయం రేంజ్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందాయి. కర్నూలు, కడప జిల్లాలో దాదాపు 16 మంది సీఐలను బదిలీ చేశారు. ఇందులో కొంతమందికి పోస్టింగ్ ఇవ్వగా మరికొంతమంది సీఐలను విఆర్ కు అటాచ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లలో రిపోర్ట్ చేసుకోవాలని సూచించారు.

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 11న రాములోరి కళ్యాణం జరగనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు కల్యాణోత్సవానికి రావాలని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె.శ్యామలరావు సీఎం చంద్రబాబును ఆహ్వానించారు. ఆదివారం వారు తాడేపల్లిలోని CM క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబును కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందించారు.

కొండాపురంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగి రామ్మోహన్, సరోజ దంపతులు మృతి చెందిన విషయం తెలిసిందే. వీరికి నలుగురు సంతానం. ముగ్గురు కుమార్తెలు, కొడుకు ఉన్నారు. వారిలో ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు అయ్యాయి. మిగిలిన కుమార్తె బీటెక్ సెకండ్ ఇయర్, కొడుకు ఇప్పుడు పదవ తరగతి పరీక్షలు రాస్తున్నాడు. వీరు అద్దె ఇంట్లో ఉంటున్నారు. దీంతో పిల్లలు అనాధలుగా మిగిలారని స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు.

పోలీస్ శాఖ ప్రతిష్ట మరింత పెంపొందించేలా విధులు నిర్వర్తించాలని జిల్లా SP అశోక్ కుమార్ పోలీస్ అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో, నెలవారీ నేర సమీక్షా నిర్వహించారు. జిల్లాను గంజాయి, ఇతర నిషేదిత మత్తు పదార్థాల రహితంగా చేసేందుకు సమష్టిగా కృషి చేయాలని ఆదేశించారు. గంజాయి రవాణా, విక్రయాలపై దాడులు ముమ్మరం చేయాలని ఆదేశించారు.

కడప జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ “శ్రీ విశ్వావసు” నామ సంవత్సర ఉగాది, రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది పండుగతోనే ఆరంభం అవుతుందని, ఉగాది పేరులోనే ఏడాది ప్రారంభమని అర్థం ఉందని తెలిపారు. ఉగాది మంచి ఆరోగ్యం, సంపద, ఆనందం, ఉల్లాసాన్నీ తలపెట్టే కార్యాలు నిర్విఘ్నంగా పూర్తికావాలని ఆకాంక్షించారు. ప్రతి ముస్లిం సోదరుడు రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలన్నారు.

కడప జిల్లా కొండాపురం 4 వరుసల రహదారిలోని CMR కాంప్లెక్స్ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బైకును కారు ఢీకొనడంతో బైకులో ఉన్న సరోజ, రామమోహన్ అనే దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. సరోజను చికిత్స కోసం అనంతపురం హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది.<<15922594>> భర్త రామ్మోహన్<<>> అనంతపురంలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

కడప జిల్లా కొండాపురం 4 వరుసల రహదారిలోని CMR కాంప్లెక్స్ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బైకును కారు ఢీకొనడంతో బైకులో ఉన్న సరోజ, రామమోహన్ అనే దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. సరోజను చికిత్స కోసం అనంతపురం హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది.<<15922594>> భర్త రామ్మోహన్<<>> అనంతపురంలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Sorry, no posts matched your criteria.