Y.S.R. Cuddapah

News February 19, 2026

ఎవరెస్ట్.. కడప జిల్లా నుంచి ఈ విద్యార్థి మాత్రమే.!

image

ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేందుకు లద్దాక్‌‌లో నిర్వహించనున్న 12 రోజుల ప్రత్యేక శిక్షణా కార్యక్రమానికి బద్వేలు govt భవిత ట్రైనింగ్ సెంటర్‌ విద్యార్థి వెంకీ ఎంపికైనట్లు MPDO మల్లేశ్వరి తెలిపారు. జిల్లా నుంచి ఏకైక విద్యార్థిగా వెంకీ ఎంపిక కావడం గర్వకారణమని పేర్కొన్నారు. ఎవరెస్టు అధిరోహణపై ఆసక్తి గల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ ద్వారా ఎంపిక చేస్తోందని ఆమె తెలిపారు.

News February 19, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో గురువారం బంగారు, వెండి ధరల వివరాలు.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,450
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,214
* 10 గ్రాములు వెండి ధర రూ.2,540.

News February 19, 2026

మహా శివరాత్రి.. కడప జిల్లా ఆర్టీసీకి ఆదాయం ఎంతంటే..!

image

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కడప రీజియన్ ఏడు డిపోల నుంచి వివిధ శైవ క్షేత్రాలకు 1317 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు కడప జిల్లా ఆర్టీసీ అధికారి గోపాల్ రెడ్డి తెలిపారు. దాదాపు 1,46,077 KM నడిపినట్లు చెప్పారు. దీంతో రూ.1.11 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. శివరాత్రి సందర్భంగా ఆర్టీసీ బస్సులను ఆదరించి ఆదాయం రావడానికి తోడ్పడిన భక్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు

News February 19, 2026

YVUలో కాన్వకేషన్.. డేట్ ఫిక్స్.!

image

YVU కాన్వకేషన్ మార్చి 11వ తేదీన నిర్వహించనున్నట్లు యోగివేమన విశ్వవిద్యాలయ వీసీ ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్ వెల్లడించారు. కాన్వకేషన్ నిర్వహణకు సంబంధించి తేదీని ఖరారు చేస్తూ రాష్ట్ర గవర్నర్ కార్యాలయం నుంచి తమకు ఉత్తర్వులు చేరాయన్నారు. వైవీయూ 11, 12, 13, 14వ కాన్వకేషన్ల ద్వారా 13,399 విద్యార్థులు పట్టాలు అందుకుంటారని చెప్పారు. కాన్వకేషన్ కోర్ కమిటీతో తన ఛాంబర్లో సమావేశమై నిర్వహణపై చర్చించారు.

News February 19, 2026

కడప: నేటి నుంచి రంజాన్.. ఉపవాస వేళలు

image

ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం నేటి నుంచి ప్రారంభంకానుంది. కడప జిల్లాలో నేటి ఉపవాస వేళలు ఇలా ఉన్నాయి.

☞ కడపలో ….

★ సహర్: ఉ.5-5.21

★ ఇఫ్తార్: సా.6.29

★ ఉపవాస కాలం: మొదటి రోజు సుమారు 13 గంటల పాటు ఉపవాసం ఉండాల్సి ఉంటుంది.

☞ నోట్: ప్రాంతాలను బట్టి వేళలు కొన్నినిమిషాలు మారొచ్చు.

News February 18, 2026

వైవీయూ మ్యాజిక్ బస్ ఇండియా సంస్థతో MOU

image

యోగి వేమన యూనివర్సిటీ ప్లేస్మెంట్ సెల్ బెంగళూరు మ్యాజిక్ బస్ ఇండియా సంస్థతో మధ్య మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ (MOU) కుదుర్చుకున్నారు. విశ్వవిద్యాలయ విద్యార్థుల భవిష్యత్ ప్లేస్మెంట్ దృష్టిలో పెట్టుకొని శిక్షణ ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుంది. మ్యాజిక్ బస్ ఇండియా సంస్థ తరఫున శేఖర్ బాబు వైవీయూ ప్రిన్సిపల్ ప్రొ. శ్రీనివాస్, ప్రొ. విజయ భారతి సంతకాలు చేశారు.

News February 18, 2026

మార్చి 11న వైవీయూ కాన్వకేషన్ నిర్వహణ: వీసీ

image

YVU కాన్వకేషన్ మార్చి 11వ తేదీన నిర్వహించనున్నట్లు యోగివేమన విశ్వవిద్యాలయ వీసీ ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్ వెల్లడించారు. కాన్వకేషన్ నిర్వహణకు సంబంధించి తేదీని ఖరారు చేస్తూ రాష్ట్ర గవర్నర్ కార్యాలయం నుంచి తమకు ఉత్తర్వులు చేరాయన్నారు. వైవీయూ 11, 12, 13, 14వ కాన్వకేషన్ల ద్వారా 13,399 విద్యార్థులు పట్టాలు అందుకుంటారని చెప్పారు. కాన్వకేషన్ కోర్ కమిటీతో తన ఛాంబర్లో సమావేశమై నిర్వహణపై చర్చించారు.

News February 18, 2026

ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా శనగల కొనుగోలు: కలెక్టర్

image

ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా శనగ కొనుగోలు ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించిందని, రబీ సీజన్‌‌కు కనీస మద్దతు ధర క్వింటాకు రూ.5,875గా ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. కడప జిల్లాలో సుమారు 80,103 హెక్టార్లలో శనగ సాగు జరిగిందని పేర్కొన్నారు. రైతులు దళారుల మోసాలకు గురికాకుండా MSP ధరకు విక్రయించాలన్నారు. పులివెందుల, తొండూరు, JMD, ముద్దనూరు, కమలాపురం మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ఉన్నాయన్నారు.

News February 18, 2026

ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా శనగల కొనుగోలు: కలెక్టర్

image

ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా శనగ కొనుగోలు ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించిందని, రబీ సీజన్‌‌కు కనీస మద్దతు ధర క్వింటాకు రూ.5,875గా ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. కడప జిల్లాలో సుమారు 80,103 హెక్టార్లలో శనగ సాగు జరిగిందని పేర్కొన్నారు. రైతులు దళారుల మోసాలకు గురికాకుండా MSP ధరకు విక్రయించాలన్నారు. పులివెందుల, తొండూరు, JMD, ముద్దనూరు, కమలాపురం మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ఉన్నాయన్నారు.

News February 18, 2026

పులివెందులకు రానున్న వైఎస్ జగన్?

image

మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 24, 25వ తేదీలలో పులివెందులలో పర్యటించనున్నట్లు సమాచారం. 24వ తేదీ పులివెందులకు చేరుకుని, 25వ తేదీ వేంపల్లి మండలం నందిపల్లెలోని నూతన నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠ వేడుకలలో పాల్గొంటారని తెలుస్తోంది. అయితే ఈ పర్యటనపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.