India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కడప జిల్లాలో యూరియా కొరత లేదని రీజినల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ASP శ్రీనివాసరావు స్పష్టం చేశారు. దువ్వూరులో ఎరువుల షాపులను తనిఖీ చేశారు. జిల్లాలో 3,350 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందన్నారు. RSKల్లో, ప్రైవేట్ డీలర్ల వద్ద యూరియా పొందవచ్చని సూచించారు. MRP ధరకే విక్రయించాలని డీలర్లకు సూచించారు. జిల్లాలో చాలాచోట్ల యూరియా పక్కదారి పడుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. మీ ఏరియాలో MRPకే ఇస్తున్నారా?
శక్తి యాప్ ఉపయోగంపై సోమవారం ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ బాలస్వామి రెడ్డి అవగాహన కల్పించారు. ప్రస్తుత చట్టాలు, రోడ్డు భద్రత, మహిళల పట్ల జరిగే నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం వల్ల జరిగే నష్టాల గురించి ఆయన విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనేలా మహిళలు సిద్ధంగా ఉండాలని ప్రిన్సిపల్ సుదర్శన్ రెడ్డి సూచించారు.
కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం 190 మంది కానిస్టేబుల్ అభ్యర్థుల ధ్రువపత్రాలను అధికారులు పరిశీలించారు. ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో వెరిఫికేషన్ జరిగింది. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సరియైన సర్టిఫికెట్లు ఉన్నవారికి ఉద్యోగం వస్తుందని స్పష్టం చేశారు. తప్పుడు సర్టిఫికెట్ల ఎవరైనా తీసుకొస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
జిల్లాలో యూరియా కొరత లేదని రీజినల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ SP శ్రీనివాసరావు స్పష్టం చేశారు. దువ్వూరులో ఎరువుల షాపులను తనికి చేసిన అనంతరం మాట్లాడారు. జిల్లాలో 3350 మెట్రిక్ టన్నుల నిల్వ ఉందన్నారు. దువ్వూరు మండలంలోని RSKల్లో 20 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్ల వద్ద 72 మెట్రిక్ టన్నులు నిల్వలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. కచ్చితంగా MRP ధరకే విక్రయించాలని డీలర్లకు సూచించారు.
కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారిపై అత్యాచారాలు, హత్యలు ఎక్కువయ్యాయన్నారు. కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులే వీటిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. వీరిపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వానికి పాలించే అర్హత లేదని విమర్శించారు.
కడపలో గంజాయి నిర్మూలనకు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. గంజాయి అమ్మకాలకు సంబంధించి దుకాణాలను పరిశీలించారు. నిర్మానుష్య ప్రాంతాల్లో అనుమానాస్పదంగా ఉంటున్న వ్యక్తులను విచారించారు. గంజాయి అమ్మకాలు చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
రాజంపేటలో ఆదివారం జరిగిన బాల్ బ్యాట్మెంటన్ పోటీలలో కాశినాయన మండలం నరసాపురం ZPHS విద్యార్థులు సత్తా చాటారు. ఉమ్మడి కడప జిల్లా బాల్ బ్యాట్మెంటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. సబ్ జూనియర్స్ విభాగంలో ఇర్ఫాన్, సంపత్, సీనియర్ విభాగంలో సోహెల్ ఈ నెల 29, 30, 31వ తేదీలలో ప్రకాశం జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడంతో వారిని పలువురు అభినందించారు.
కడప జిల్లాలోని డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో సోమవారం నుంచి కౌన్సెలింగ్ జరుగుతుందని వీసీ డాక్టర్ విశ్వనాథ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. బీఎఫ్ఏ(ఫోర్ ఇయర్స్ డిగ్రీ) ఫైన్ ఆర్ట్స్ (యానిమేషన్, అప్లైడ్ ఆర్ట్, పెయింటింగ్, ఫోటోగ్రఫీ, శిల్పం, బి. డెస్ ఇంటీరియర్ డిజైన్) కోర్సులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే సైక్లింగ్ అలవాటు చేసుకోవాలని కడప ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఊటుకూరు సర్కిల్ నుంచి మౌంట్ ఫోర్ట్ స్కూల్ వరకు ఆదివారం సైక్లింగ్ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. సైక్లింగ్ సహజ సిద్ధమైన వ్యాయామని చెప్పారు. అందరూ వ్యాయామంతో పాటు సైక్లింగ్ కూడా అలవాటు చేసుకోవాలని కోరారు.
ఇటీవల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి త్వరలో శిక్షణ ప్రారంభించనున్నారు. కడప జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో ట్రైనింగ్ ఇస్తారు. ఎస్పీ అశోక్ కుమార్ ఈ సెంటర్ను ఆదివారం తనిఖీ చేశారు. వసతి, తరగతి గదులు, మైదానం, అంతర్గత దారులు, పరికరాలను పరిశీలించారు. డీఎస్పీ అబ్దుల్ కరీంకు పలు సూచనలు చేశారు. శిక్షణకు హాజరయ్యే అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు SP తెలిపారు.
Sorry, no posts matched your criteria.