Y.S.R. Cuddapah

News July 17, 2024

పెద్దిరెడ్డి ఫ్యామిలీ 3 వేల ఎకరాలను కబ్జా చేసింది: మంత్రి

image

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై రవాణ శాఖా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి 3 వేల ఎకరాలను కబ్జా చేశారు. పులిచెర్ల, అంగళ్లు, పుంగనూరు, తిరుపతిలో భూములు కాజేశారు. పోలీసులను అడ్డంపెట్టుకుని రూ.కోట్ల విలువైన ఎర్రచందనాన్ని చైనాకు తరలించారు. తమిళనాడు, కర్ణాటకకు ఇసుక తరలించి సొమ్ము చేసుకున్నారు’ అని మంత్రి ఆరోపించారు.

News July 17, 2024

జమ్మలమడుగు: రూ.4 కోట్లు ఐపీ పెట్టిన వ్యాపారి

image

జమ్మలమడుగులో జనరల్ స్టోర్ నిర్వహిస్తున్న ఓ వ్యాపారి రూ.4 కోట్లకు ఐపీ పెట్టి కనిపించకుండా పోయినట్లు స్థానికులు తెలిపారు. పదేళ్లుగా జమ్మలమడుగు, ప్రొద్దుటూరు ప్రాంతాల వ్యాపారులతో నిందితుడు సన్నిహితంగా ఉండడంతో అతనికి వస్తువులను సరఫరా చేశారు. నెల రోజుల నుంచి స్టోర్ మూత వేసి ఉండటం, ఫోనుకు స్పందించకపోవడంతో సరకు ఇచ్చిన వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే కొంత మందికి నిందితుడు ఐపీ తాఖీదులు పంపాడు.

News July 17, 2024

నేడు జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు

image

ముస్లింలకు పవిత్రమైన మొహర్రం పండుగతో పాటు తొలి ఏకాదశిని పురస్కరించుకొని నేడు కడప జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అనురాధ తెలిపారు. ఇప్పటికే వీటికి సంబంధించిన సర్కులర్ జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు పంపించామని ఆమె స్పష్టం చేశారు.

News July 17, 2024

మట్టి వినాయకుడినే వాడాలి: అన్నమయ్య కలెక్టర్

image

అన్నమయ్య జిల్లాలో వినాయకచవితి, దసరాకు మట్టి విగ్రహాలను మాత్రమే వినియోగించాలని కలెక్టర్ శ్రీధర్ చామకూరి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో విగ్రహాలను తయారు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. జిల్లాలో నీటి వనరులు తక్కువగా ఉన్నాయని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు.

News July 16, 2024

సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన సౌమ్యనాథుడు

image

నందలూరులో వెలసిన సౌమ్యనాథుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ సౌమ్యనాథ స్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారు మాడవీధులలో విహరిస్తూ ఉంటే భక్తులు గోవింద నామాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. కోలాటాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

News July 16, 2024

పులివెందుల: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్పాట్ డెడ్

image

పులివెందులలోని మెడికల్ కళాశాల ముందు మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఓ బైక్‌ను నేషనల్ హైవే పనులు చేస్తున్న క్యాంపర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో లింగాల మండలం పుట్టినంతల గ్రామానికి చెందిన కృష్ణయ్య, సింహాద్రిపురం మండలానికి చెందిన కిట్టయ్య అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 16, 2024

కడప: బెస్ట్ టీచర్ అవార్డుల దరఖాస్తు గడువు పొడిగింపు

image

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్స్-2024 కోసం అర్హత గల జిల్లా ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవడానికి గడువును 18వ తేదీ వరకు పొడిగించినట్లు డీఈవో అనురాధ తెలిపారు. అర్హత/ఆసక్తి గల ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దరఖాస్తులను 21వ తేదీలోగా DEO ఆఫీసులో సమర్పించాలని సూచించారు. మరింత సమాచారానికి https://nationalawardstoteachers.education.gov.in సంప్రదించాలని అన్నారు.

News July 16, 2024

కడప, అన్నమయ్య జిల్లాలో రూ.1000 కోట్ల భూ ఆక్రమణలు: సీఎం

image

కడప, అన్నమయ్య జిల్లాలో సుమారు రూ.1000 కోట్లు విలువగల భూములు వైసీపీ నాయకులు, కార్యకర్తల చేతిలో ఉన్నాయని సీఎం చంద్రబాబు ఆరోపించారు. తాజాగా సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేశారు. అందులో కడప జిల్లాలో 5,796.54 ఎకరాల భూములను 3,357 మందికి, అన్నమయ్య జిల్లాలో 103.15 ఎకరాలను 84 మందికి అక్రమంగా కట్టబెట్టినట్లు సీఎం ప్రకటించారు. ఇటువంటి వారిని విచారించి కఠిన శిక్షలు పడేలా చేస్తానని పేర్కొన్నారు.

News July 16, 2024

కడప: జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో వర్షం

image

ఉపరితల ఆవర్తనం కారణంగా జిల్లా వ్యాప్తంగా 35 మండలాల్లో సోమవారం వర్షం కురిసింది. వల్లూరులో 14.8 మి.మీ, చెన్నూరులో 11.2, వేంపల్లిలో 9.2, విఎన్ పల్లెలో 9, పోరుమామిళ్లలో 8.2, చక్రాయపేటలో 8, సిద్ధవటంలో 7.4, వేములలో 7, దువ్వూరులో 6.8, కాశినాయనలో 6.4, సింహాద్రిపురం, కాజీపేట, కడపలో 6.2, కమలాపురంలో 5.4, కలసపాడు, బద్వేల్, పెద్దముడియంలలో 5.2, మైదుకూరులో 5, రాజుపాలెంలో 4.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.

News July 16, 2024

బి.కోడూరు: పాఠశాల స్థలాన్ని తనఖా పెట్టారు: టీడీపీ

image

మండల పరిధిలోని గోవిందాయపల్లె జిల్లా ఉన్నత పాఠశాలను వైసీపీ నాయకులు ఆన్‌లైన్లో నమోదు చేసుకుని రుణాలు పొందారని మండల టీడీపీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, రాష్ట్ర రైతు కార్యదర్శి రమణారెడ్డి ఆరోపించారు. వారు మాట్లాడుతూ.. గోవిందాయ పల్లె జిల్లా ఉన్నత పాఠశాల 40 ఏళ్ల నుంచి అక్కడ ఉందన్నారు. 4.27 సెంట్లు భూమిని కొండ వెంకటసుబ్బమ్మ పేరిట ఆన్‌లైన్లో నమోదు చేసుకున్నారని విమర్శించారు.