India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కడప కలెక్టరేట్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10:30 నుంచి కలెక్టర్ సభా భవనంలో కార్యక్రమం మొదలవుతుందన్నారు. అర్జీ దారులు తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావచ్చన్నారు. కడపతో పాటు అన్ని మున్సిపల్, మండల తహశీల్దార్ కార్యాలయాల్లో కూడా అర్జీలు స్వీకరిస్తారని ఆయన స్పష్టం చేశారు.

కడప కలెక్టరేట్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10:30 నుంచి కలెక్టర్ సభా భవనంలో కార్యక్రమం మొదలవుతుందన్నారు. అర్జీ దారులు తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావచ్చన్నారు. కడపతో పాటు అన్ని మున్సిపల్, మండల తహశీల్దార్ కార్యాలయాల్లో కూడా అర్జీలు స్వీకరిస్తారని ఆయన స్పష్టం చేశారు.

కడప కలెక్టరేట్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10:30 నుంచి కలెక్టర్ సభా భవనంలో కార్యక్రమం మొదలవుతుందన్నారు. అర్జీ దారులు తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావచ్చన్నారు. కడపతో పాటు అన్ని మున్సిపల్, మండల తహశీల్దార్ కార్యాలయాల్లో కూడా అర్జీలు స్వీకరిస్తారని ఆయన స్పష్టం చేశారు.

ప్రొద్దుటూరు నెహ్రూ రోడ్డులోని నాగులకట్ట వీధిలో 3 రోజుల క్రితం జరిగిన సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడు వినయ్ను త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సీఐ కొండారెడ్డి ఆదివారం తెలిపారు. మద్యం తాగే సమయంలో కుటుంబ సభ్యులను దూషించాడనే కోపంతో వినయ్ కత్తితో గొంతులో పొడిచి హత్య చేసినట్లు తెలిపారు. బొల్లవరం బస్స్టాప్ వద్ద నిందితుడిని అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

కొండాపురం మండలం వెంకయ్యకాలువ గ్రామానికి చెందిన గర్భిణి 108 వాహనంలోనే ఆదివారం సాయంత్రం బిడ్డను ప్రసవించింది. గ్రామానికి చెందిన ప్రత్యూష పురుటి నొప్పులు రావడంతో 108 వాహనంలో కొండాపురం ఆసుపత్రికి తరలించేందుకు చర్యలు చేపట్టారు. మార్గమధ్యలో నొప్పులు అధికం కావడంతో 108 వాహన EMT సునీత పురుడు పోశారు. దీంతో ప్రత్యూష ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డ క్షేమంగానే ఉన్నట్లు సునీత తెలిపారు.

కడప జిల్లా శైవ క్షేత్రాలకు ప్రసిద్ధి. అందులో ప్రధానంగా పొలతల, నిత్యపూజకోన, సంగమేశ్వర ఆలయం, ముక్కొండ, పుష్కగిరి, అల్లాడుపల్లెలో వీరభద్ర స్వామి దేవాలయం, గవిమల్లేశ్వరుని కొండ, లంకమల మొదలైన వాటిలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఒక్కో క్షేత్రానికి ఒక్కో చరిత్ర ఉండగా వేలల్లో భక్తులు దర్శించుకుంటారు. ఇప్పటికే ఆయా దేవాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శివరాత్రి పర్వదినాన మీరు ఏ గుడికి వెళ్తున్నారు.

కడప చిన్నచౌక్ పోలీసులు ఆన్లైన్లో POLO, WALLA యాప్లతో ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. అనంతపురానికి చెందిన చదువుల కుమార్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులుగా నటిస్తూ కేసులు పెట్టిస్తామని బెదిరించి, కేసుల నుంచి బయటపడేయాలంటే డబ్బులు ఇవ్వాలని నమ్మబలికి పలువురి నుంచి నగదు, బంగారం వసూలు చేసినట్లు విచారణలో బయటపడింది. వారి వద్ద రూ.4.5 లక్షల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

కడప నగర శివారులోని ఆలంఖాన్పల్లె సర్కిల్ వద్ద శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తిరుపతి నుంచి గండికోటకు బైక్పై వెళ్తున్న ప్రేమజంటను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో కేరళకు చెందిన సిరినా అనే యువతి అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె ప్రియుడు గాయపడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రిమ్స్కు తరలించారు. కడప 2-టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారు, వెండి ధరల వివరాలు.
* బంగారు 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.15,800
* బంగారు 22 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.14,536
* వెండి 10 గ్రాములు ధర రూ.2,550.

ప్రొద్దుటూరు మున్సిపల్ పెట్రోల్ బంక్ స్కాంలో చెక్కులన్నీ బౌన్స్ అయ్యాయి. వీటిపై చెక్ బౌన్స్ కేసు పెట్టనున్నారు. పెట్రోల్ బంక్ పూర్వపు మేనేజర్ ప్రవీణ్ బకాయిలకు సంబంధించి సుమారు రూ.50 లక్షల విలువైన 10 చెక్కులను మున్సిపాలిటీకి జమ చేశాడు. ఈ చెక్కులన్నీ బౌన్స్ అయ్యాయని అసిస్టెంట్ కమిషనర్ మంజునాథ్ గౌడ్ తెలిపారు. పెట్రోల్ బంక్ బకాయిలపై ఉన్నతాధికారులకు రిపోర్ట్ పంపామని కమిషనర్ రవిచంద్రారెడ్డి తెలిపారు.
Sorry, no posts matched your criteria.