Y.S.R. Cuddapah

News November 27, 2024

కడప: భూ సేకరణ పనులు పూర్తిచేయాలి

image

జాతీయ రహదారుల అభివృద్ధి పనుల్లో భాగంగా జిల్లాలో చేపడుతున్న భూసేకరణ, అటవీ, పర్యావరణ అభ్యంతరాల క్లియరెన్స్ ప్రక్రియలను ఎలాంటి పెండింగ్ లేకుండా నిర్ణీత సమయం లోగా పూర్తి చేయాలని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారుల అభివృద్ధి, విస్తరణ పనులకు సంబంధించి భూ సేకరణ తదితర అంశాలపై కడప కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు.

News November 26, 2024

కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలి: గడికోట

image

కార్మిక రైతాంగంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి విడాలని మంగళవారం కార్మిక సంఘాల నేతృత్వంలో రాయచోటి కలెక్టరేట్ ఎదుట మహా ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘీభావంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మిక పోరాటాలకు ఎలాంటి ప్రభుత్వాలైన పడిపోవాల్సిందేనని, న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం తమ పార్టీ వామపక్ష పార్టీలతో పనిచేస్తుందని చెప్పారు.

News November 26, 2024

ప్రొద్దటూరు: బీరు సీసాతో వ్యక్తిపై దాడి

image

పని డబ్బులు అడిగినందుకు తోటి కూలి బీరు సీసాతో దాడి చేసిన ఘటన ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మహ్మద్, ఉపేంద్ర కలిసి పెయింట్ పనికి వెళ్లేవారు. ఒక రోజు ఇద్దరు పనికి వెళ్లగా.. వచ్చిన డబ్బు మొత్తాన్ని ఉపేంద్ర తీసుకున్నాడు. సోమవారం రాత్రి ఓ చోట ఉపేంద్ర కనిపించగా మహ్మద్ తన డబ్బు ఇవ్వాలని పదే పదే డిమాండ్ చేశాడు. కోపంతో ఆగ్రహించిన ఉపేంద్ర బీరు సీసాతో అతని కడుపులో పొడిచి పరారయ్యాడు.

News November 26, 2024

ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి: ఎంపీ అవినాశ్

image

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తెలిపారు. పులివెందులలోని ఆయన నివాసంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యలను త్వరితగతిన విచారించి ప్రజలకు న్యాయం చేయాలన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయరాదని కోరారు.

News November 25, 2024

కడప కలెక్టర్‌‌తో కమలాపురం ఎమ్మెల్యే భేటీ

image

కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్‌ను కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి కలిశారు. ఇటీవల నూతన జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్‌ను ఈరోజు సాయంత్రం కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే చైతన్య రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల పురోగతి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కలెక్టర్‌తో చర్చించారు.

News November 25, 2024

కడప: మరదలితో అసభ్యంగా ప్రవర్తించినందుకే హత్య.!

image

మైదుకూరు మండలంలో నిన్న హత్య జరిగిన విషయం తెలిసిందే. చెర్లోపల్లికి చెందిన వీర నారాయణ యాదవ్‌కు బాలకృష్ణ డబ్బులు ఇవ్వాల్సి ఉంది. ఇటీవల బాలకృష్ణ కువైట్ వెళ్లారు. డబ్బు కోసం వీర నారాయణ తరచూ బాలకృష్ణ ఇంటికి వెళ్లి ఆయన భార్యతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇదే విషయాన్ని ఆమె భర్తకు చెప్పింది. సమస్య ఏంటో చూడాలని బాలకృష్ణ తన అన్న సుబ్బరాజుకు చెప్పగా.. ఆయన కోపంతో వెళ్లి నారాయణను గొడ్డలితో నరికి హత్య చేశాడు.

News November 25, 2024

కడప: ఒక్కడే మిగిలాడు.. అనాథయ్యాడు

image

మైదుకూరు ఘాట్‌లో నిన్న రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కాశినాయన(M) చిన్నాయపల్లెకు చెందిన శ్రీనివాసులరెడ్డి(45), అరుణ(37) కుమారుడు జగదీశ్వర్ రెడ్డి ఖాజీపేటలో 8వ తరగతి చదువుతూ తిప్పాయపల్లెలోని అమ్మమ్మ దగ్గర ఉంటున్నాడు. అతడిని చూసేందుకు కుమార్తె పవిత్ర(12)తో కలిసి దంపతులు బైకుపై బయల్దేరారు. ఘాట్ రోడ్డులో లారీని ఓవర్ టేక్ చేస్తూ కిందపడిపోయారు. వీరిపై నుంచి మరో లారీ వెళ్లడంతో ముగ్గరూ చనిపోయారు.

News November 25, 2024

కడప: డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమ సమయంలో మార్పు

image

ప్రతి సోమవారం ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు జరుగుతున్న డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమ సమయంలో మార్పులు చేసినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఒక ప్రకటనలో తెలిపారు. ఇకపై ఈ కార్యక్రమాన్ని ప్రతి సోమవారం ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. జిల్లా ప్రజలు ఈ సమయ మార్పును గమనించి 08562-244437 ల్యాండ్ లైన్ నంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకుని పరిష్కరించుకోవాలని సూచించారు

News November 24, 2024

మైదుకూరు: మృతులంతా ఒకే కుటుంబీకులే

image

మైదుకూరు – పోరుమామిళ్ల ప్రధాన రహదారిలో టిప్పర్ ఢీకొని ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల ప్రకారం.. కాశినాయన మండలం చిన్నాయపల్లికి చెందిన గుర్రాల శ్రీనివాసరెడ్డి, ఆయన భార్య అరుణ, కుమార్తె పవిత్రలుగా గుర్తించారు. మైదుకూరు మండలం తిప్పాయపల్లె గ్రామంలో ఫంక్షన్‌కు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

News November 24, 2024

మైదుకూరు: బైకును ఢీకొన్న టిప్పర్.. ముగ్గురు మృతి

image

మైదుకూరు మండల పరిధిలోని ముదిరెడ్డిపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఎద్దడుగు కనుమ వద్ద ఆదివారం సాయంత్రం బైకును టిప్పర్ ఢీకొంది. ఈ ఘటనలో బైకులో వెళుతున్న ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు అక్కడికక్కడే మృతి చెందారు. మైదుకూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద ఘటనపై విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.