India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సంక్రాంతి వేడుక కార్యక్రమంలో పాల్గొన్నారు. కడప నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయము నందు బంగ్లాకు విచ్చేసిన గంగిరెద్దుకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కలెక్టర్ దంపతులు సాంప్రదాయ బద్దంగా నూతన వస్త్రాలు సమర్పించారు.

బద్వేలు మండలం గుండంరాజుపల్లె సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్పై నుంచి అదుపుతప్పి ఇద్దరు కింద పడ్డారు. దీంతో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయినట్లు స్థానికులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న ఎస్సై రవికుమార్ విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రొద్దుటూరు మండలం గోపవరానికి చెందిన గోపిరెడ్డి రాజశేఖర్రెడ్డి(53) బ్రెయిన్ డెడ్కు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. రాజశేఖర్ ఈనెల 1న బైక్ పైనుంచి పడి అపస్మారక స్థితికి వెళ్లారు. 11 రోజుల చికిత్స అనంతరం వైద్యులు బ్రెయిన్డెడ్గా నిర్ధారించారు. దీంతో అతని భార్య శ్రీదేవి అవయవదానానికి సహకరించారు. దీంతో అతని అవయవాలతో నలుగురికి పునర్జన్మను కల్పించారు.

సంక్రాంతి పండగను పురస్కరించుకుని పులివెందులలో తొలిసారి జోరుగా కోళ్ల పందేలు సాగుతున్నాయి. పులివెందుల మున్సిపాలిటీలోని ఉలిమెల్ల, మండలంలోని ఈ.కొత్తపల్లి, ఎర్రిపల్లె తదితర గ్రామాల్లో పందేలు నిర్వహిస్తున్నారు. ఈ పందేల్లో తొలిరోజే రూ.2 కోట్లకు పందేలు జరిగినట్లు తెలుస్తోంది. పులివెందులలో 8 చోట్ల బరులు ఏర్పాటు చేయగా.. లింగాల మండలంలోనే దాదాపు రూ. 50 లక్షలకు పందేలు జరిగినట్లు సమాచారం.

సంక్రాంతితో కడప జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది. పెద్దలు పిండివంటల తయారీలో బిజీగా ఉంటే, పిల్లలు గాలిపటాలు ఎగరేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కడపలోని శాంతి నగర్కు చెందిన ఓ బాలుడు సోమవారం గాలిపటం ఎగురేశాడు. విద్యుత్ వైర్లకు తగలడంతో తప్పించేందుకు గట్టిగా లాగగా విద్యుత్ వైరు బాలుడిపై పడి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. చికిత్స నిమిత్తం రిమ్స్కు అక్కడినుంచి మరో ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) 2025 జనవరి 15న జరగాల్సిన UGC-NET డిసెంబర్ 2024 పరీక్షను సంక్రాంతి, పొంగల్ పండుగ సందర్భంగా వాయిదా వేశారు. 16 నుంచి జరగాల్సిన మిగిలిన పరీక్షలు షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తారు. అభ్యర్థులు తాజా అప్డేట్ల కోసం వెబ్సైట్ www.nta.ac.in ను సందర్శించాలని ఎన్టీఏ (ఎగ్జామ్స్) డైరెక్టర్ రాజేశ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. కొత్త పరీక్ష తేదీని తర్వాత ప్రకటిస్తామని తెలిపారు.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) 2025 జనవరి 15న జరగాల్సిన UGC-NET డిసెంబర్ 2024 పరీక్షను సంక్రాంతి, పొంగల్ పండుగ సందర్భంగా వాయిదా వేశారు. 16 నుంచి జరగాల్సిన మిగిలిన పరీక్షలు షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తారు. అభ్యర్థులు తాజా అప్డేట్ల కోసం వెబ్సైట్ www.nta.ac.in ను సందర్శించాలని ఎన్టీఏ (ఎగ్జామ్స్) డైరెక్టర్ రాజేశ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. కొత్త పరీక్ష తేదీని తర్వాత ప్రకటిస్తామని తెలిపారు.

రాజంపేటలో ఏఎస్పీ కార్యాలయం ఏర్పాటు కానుంది. ఇంతవరకు రాజంపేటలో డీఎస్పీ స్థాయి అధికారి మాత్రమే ఉండగా అన్నమయ్య జిల్లా ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏఎస్పీని నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్ మనోజ్ రామనాథ్ హెగ్డేను రాజంపేట సబ్ డివిజన్ నూతన ఏఎస్పీగా నియమిస్తూ చీఫ్ సెక్రటరీ కె. విజయానంద్ ఉత్తర్వులు ఇచ్చారు.

సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ భోగి మంట వేస్తున్నారా? మీ సెలబ్రేషన్స్ను Way2Newsలో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 97036 22022కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.

సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ రేపు భోగి మంట వేస్తున్నారా? మీసెలబ్రేషన్స్ను వే2న్యూస్లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 97036 22022కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.
Sorry, no posts matched your criteria.