Y.S.R. Cuddapah

News November 24, 2024

మైదుకూరు: బైకును ఢీకొన్న టిప్పర్.. ముగ్గురు మృతి

image

మైదుకూరు మండల పరిధిలోని ముదిరెడ్డిపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఎద్దడుగు కనుమ వద్ద ఆదివారం సాయంత్రం బైకును టిప్పర్ ఢీకొంది. ఈ ఘటనలో బైకులో వెళుతున్న ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు అక్కడికక్కడే మృతి చెందారు. మైదుకూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద ఘటనపై విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 24, 2024

కడప స్టీల్ ప్లాంట్‌పై పార్లమెంట్లో చర్చిస్తాం: ఎంపీ

image

కడప స్టీల్ ప్లాంట్‌ ప్రస్తుత స్థితిపై పార్లమెంట్లో చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని అఖిలపక్ష సమావేశంలో కోరినట్లు నరసరావు ఎంపీ లావు కృష్ణదేవరాయులు తెలిపారు. పార్లమెంట్లో చర్చించాలనుకునే అంశాలపై ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ కడప ఉక్కు అంశం శిలాఫలకాలకే పరిమితమయ్యాయి. ఈ కూటమి హయాంలో అయినా అది పూర్తవుతుందని జిల్లా వాసులు ఆశిస్తున్నారు.

News November 24, 2024

సిద్దవటం కోట చరిత్ర మీకు తెలుసా.!

image

ఎన్నో చారిత్రక ప్రదేశాలకు కడప జిల్లా ప్రసిద్ధి. అందులో ప్రముఖంగా చెప్పుకోదగ్గది సిద్ధవటం కోట. 1303 CEలో విజయనగర సామ్రాజ్యంలోని తుళువ రాజవంశ సామంతరాజులు దీనిని నిర్మించారు. కృష్ణదేవరాయులు అల్లుడు వరదరాజు పాలనలో కోటను బాగా విస్తరించారు. పెన్నానది ఒడ్డున 30 ఎకరాల్లో ఈ కోట విస్తరించి ఉంది. కోటగోపురం, ఈ ప్రాంతాన్ని రక్షించడానికి నిర్మించిన 17 బురుజులు ఇప్పటికీ కోటలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

News November 24, 2024

కడప జిల్లాలో దారుణ హత్య

image

అప్పు తీర్చలేదని ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు.. కడప జిల్లా మైదుకూరు మండలం భూమనపల్లికి చెందిన వీర నారాయణ బాలరాజుకు అప్పు ఉన్నాడు. ఈ విషయంలో పొలంలో గొడవ జరిగింది. దీంతో ఆగ్రహించిన బాలరాజు నారాయణను పొలాల్లో దారుణంగా హత్య చేశాడు.

News November 24, 2024

కడప: గోడౌన్‌లో చోరీ.. 8 మంది అరెస్ట్

image

కడపలోని రామాంజనేయపురం ఎరువుల గోడౌన్‌లో చోరీ చేసిన 8 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు రిమ్స్ SI తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ఈనెల 20 రాత్రి ఎరువుల గోడౌన్ తాలాలు పగులగొట్టి ఎరువులు, రసాయనాలను చోరీ చేసినట్లు సమాచారం. గౌడోన్ యాజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీఐ సీతారామిరెడ్డి ఆదేశాలతో 8 మందిని అరెస్ట్ చేశారు. అనంతరం వారినుంచి లక్ష విలువైన రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు.

News November 24, 2024

వైసీపీ నేత సజ్జల భార్గవ్‌కు నోటీసులు

image

కడప జిల్లా పులివెందులలో నమోదైన కేసుల నేపథ్యంలో వైసీపీ నేత సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డిలకు పులివెందుల పోలీసులు 41-A కింద నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను విజయవాడలో భార్గవ్ తల్లికి అందజేయగా, అర్జున్ రెడ్డి ఇంటికి నోటీసులు అంటించారు. ఈ నెల 8న ఐటీ, అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎ-1గా వర్రా , ఎ-2 సజ్జల భార్గవ్, ఎ-3గా అర్జున్ రెడ్డిలను చేర్చారు.

News November 23, 2024

పోరుమామిళ్ల వాసికి 20 ఏళ్ల జైలు శిక్ష

image

నెల్లూరు కోర్టులో పోరుమామిళ్ల వాసి పప్పర్తి సుబ్బరాయుడుకి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. సుబ్బరాయుడు 2020 మేలో బాలిక (14), ఆమె చిన్నాన్నను లారీలో ఎక్కించుకున్నాడు. అతడిని ఓ హోటల్ దగ్గర దింపి, కృష్ణపట్నం హైవేపై లారీని ఆపి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక చిన్నాన్న ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.22వేల జరిమానా కోర్టు విధించింది.

News November 23, 2024

నిమ్మ పంటను పరిశీలించిన కడప జిల్లా కలెక్టర్

image

పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి కలసపాడు తహశీల్దారు కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం మండలంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పనులపై అరా తీశారు. అనంతరం తెల్లపాడు గ్రామపంచాయతీ దూలంవారిపల్లిలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకం కింద లబ్ధి పొందిన రైతు పొలంలో పర్యటించారు. కొమ్ముల హరి అనే రైతు సాగు చేసిన నిమ్మ పంటను సూసి సంతోషించారు.

News November 22, 2024

కడప: అధికారులు ప్రాథమిక విధులు విస్మరించరాదు.!

image

రెవెన్యూ రికార్డుల నిర్వహణ, ప్రభుత్వ భూముల కేటాయింపు విషయంలో ప్రాథమిక విధులను విస్మరించకుండా SOP ప్రకారం బాధ్యతలను నిర్వహించాలని, కడప జిల్లా కలెక్టర్‌ శ్రీధర్ చెరుకూరి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ విషయాలపై శుక్రవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. భూముల రీ సర్వే, భూ రికార్డుల స్వచ్చీకరణ, ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్, భూసేకరణ రెవెన్యూ శాఖలో పెండింగ్ అంశాలు తదితర అంశాలపై చర్చించారు.

News November 22, 2024

జగన్‌ను ఒక్క సారైనా అసెంబ్లీకి రప్పించండి: ఎమ్మెల్యే ఆది

image

జగన్‌ అవినీతిలో ఎస్కోబార్‌ను కూడా దాటేశారని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. ఇవాళ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘జగన్‌ను నేను దగ్గర నుంచి చూశా. అతను రాజశేఖర్ రెడ్డి హయాంలోనే రూ.లక్ష కోట్లు సంపాదించారు. ఇప్పుడు ఇంకా పెరిగిపోయి ఉంటుంది‘ అని తీవ్ర ఆరోపణలు చేశారు. అనంతరం ఆ జగన్‌ను ఒక్కసారైనా అసెంబ్లీకి రప్పించండి అని ఆదినారయణ రెడ్డి అనగానే సభ్యులతో పాటు సీఎం చంద్రబాబు సైతం నవ్వుకున్నారు.