India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ రేపు భోగి మంట వేస్తున్నారా? మీసెలబ్రేషన్స్ను వే2న్యూస్లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 97036 22022కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.

పులివెందుల పట్టణంలోని భాకరాపురం సమీపంలో ఉన్న జయమ్మ కాలనీకి చెందిన పాలెం విజయ్ అనే యువకుడు శనివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకుని పరిశీలించారు. విజయ్ని ఎవరైనా చంపి పడేశారా? లేక విజయ్కి ఏదైనా ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.

కడప పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఇన్ఛార్జ్ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. భోగి పండుగ నేపథ్యంలో ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించి దయచేసి ఎవరూ కడపకు రావద్దని ఆయన ప్రజలకు సూచించారు.

గాలివీడు MPDOపై డిసెంబర్ 27న దాడి జరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘MPDOపై దాడి జరిగినప్పుడు.. కన్నతండ్రిపై దాడి జరిగితే కన్న కొడకు ఎలా స్పందిస్తాడో అలానే నేను కూడా స్పందించా‘ అని తెలిపారు’. అందుకే విషయం తెలియగానే కడపకు వెళ్లి పరామర్శించినట్లు తెలిపారు.

వైసీపీ నేత వైఎస్ అభిషేక్ రెడ్డి మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. రేపు ఉదయం 9 గంటలకు పులివెందులలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. అభిషేక్ రెడ్డి వైఎస్ ప్రకాశ్ రెడ్డికి మనమడు.

అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఇవాళ్టి నుంచి కడప జిల్లాలో సంక్రాంతి సెలవులు ఇస్తున్నామని డీఈవో మీనాక్షి వెల్లడించారు. జనవరి 19 వరకు సెలవులు ఉంటాయని చెప్పారు. 20న పాఠశాలలు పునః ప్రారంభమవుతాయన్నారు. మైనారిటీ విద్యాసంస్థలకు జనవరి 11 నుంచి 15 వరకు ఉంటాయని స్పష్టం చేశారు. సెలవుల్లో తరగతులు నిర్వహించరాదని.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని DEO హెచ్చరించారు.

తొర్రివేములకు చెందిన కుమ్మరి గురు ప్రసాద్ 2019లో హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఐదుగురు నిందితులకు గురువారం కోర్టు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే.. హతుడి భార్య ప్రమీలకు తీట్ల సురేశ్ అనే వ్యక్తితో వివాహేతర బంధం ఉంది. వారి బంధానికి భర్త అడ్డంకిగా మారడంతో మరో ముగ్గురితో కలిసి ప్రసాద్ను హత్య చేశారు. కేసును విచారించిన 2nd ADJ కోర్ట్ జడ్జి G. S రమేశ్ కుమార్ వారికి జీవిత ఖైదు విధించారు.

పుల్లంపేట మండలం తిప్పాయపల్లె గ్రామంలో ఉన్న శ్రీ సంజీవరాయ స్వామి పొంగళ్లు ఈ నెల 12వ తేదీ , సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం వైభవంగా జరుగుతాయని గ్రామ పెద్దలు తెలిపారు అయితే ఎక్కడైనా మహిళలు పొంగళ్లు పెట్టండం చూసుంటారు. కానీ ఇక్కడ మాత్రం కేవలం పురుషులే పొంగళ్లు పెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం. ముందు రోజు రాత్రి నుంచే కోలాటం, చెక్క భజన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.

ప్రధాని మోదీ నేడు వర్చువల్గా కడప జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. రూ. 135 కోట్లతో మైదుకూరు – ముదిరెడ్డిపల్లె 2 లైన్ల రోడ్డు విస్తరణ, రూ. 1.321 కోట్లతో వేంపల్లి – చాగలమర్రి 2/4 వరుసల విస్తరణ పనులు చేపట్టనున్నారు. తమ ప్రాంతాలు అభివృద్ధి బాట పట్టనున్నాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించిన కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహారుడ్య పరీక్షలను కడప జిల్లా కేంద్రంలో పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. కడప జిల్లా పోలీసు శిక్షణ కేంద్ర మైదానంలో జిల్లా ఇన్ఛార్జి విద్యాసాగర్ నాయుడు పర్యవేక్షణలో కట్టుదిట్టంగా నిర్వహించారు. 7వ రోజు దేహదారుడ్య పరీక్షలలో భాగంగా 1600 మీటర్లు, 100 మీటర్లు, లాంగ్ జంప్ పరీక్షలు నిర్వహించారు.
Sorry, no posts matched your criteria.