India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వైసీపీ హయాంలో అమలు చేసిన ఈబీసీ నేస్తం లాంటి పథకాలు ఇప్పుడేమైనా ఇస్తారా? అని YCP ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి శాసనమండలిలలో ప్రశ్నించారు. దీనిపై మంత్రి సవిత మాట్లాడుతూ.. ‘మేము అగ్రవర్ణ పేదల అభివృద్ధికి కృషిచేస్తున్నాం. వైసీపీ వారిని పట్టించుకోలేదు. బటన్ నొక్కడమే తప్ప ఉపాధి కల్పించలేదు. దీంతో గంజాయికి అలవాటు పడ్డారు’ అని అనడంతో YCP నేతలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది.
అసెంబ్లీ ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ (పీయూసీ) సభ్యుల ఎన్నికకు ఎమ్మెల్సీ భూమి రెడ్డి రాం గోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈయన 2023లో టీడీపీ నుంచి పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో విజయం సాధించారు. అంతేకాకుండా కడప జిల్లాలో టీడీపీ విజయానికి ఆయన కృషి చేశారు. ఇటీవల పులివెందులలో జగనన్న లేఅవుట్లలో అవినీతి జరిగిందని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.
కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలో బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. బాలికను ఓ యువకుడు లోబర్చుకోవాలనుకున్నాడు. దానికి అతడి స్నేహితులు సహకరించారు. వారిలో ఇద్దరితో ఆ బాలిక మాట్లాడుతుండగా ఇంకొకడు వీడియో తీసి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే బాలిక తండ్రి నిన్న మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. విచారించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
కడప నగరం కేంద్రంగా ఉన్న ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అమరావతికి తరలిపోతుందని వార్త జిల్లావ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న తరుణంలో గురువారం సీఎం చంద్రబాబును కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ బ్యాంక్ను కడప కేంద్రంగానే కొనసాగించాలని ఉద్యోగులు, ప్రజల తరుపున విన్నవించారు. గ్రామీణ ప్రజలకు సేవలు అందిస్తున్న ఈ బ్యాంక్ను ఎట్టి పరిస్థితుల్లో తరలించవద్దన్నారు.
ప్రాధాన్యతా రంగాలను పటిష్ఠం చేస్తేనే కడప జిల్లా అన్ని విధాలా అభివృద్ధి పథంలో నడుస్తుందని ఆ దిశగా ఆయా శాఖలకు కేటాయించిన లక్ష్యాలను అధిగమించాలని జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరకూరి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలు, పనుల పురోగతి, సాధించిన ప్రగతి తదితర అంశాలపై కలెక్టర్ సంబందిత అధికారులతో సమీక్షించారు.
కడప జిల్లాలో గురువారం దారుణ ఘటన వెలుగుచూసింది. కాశినాయన మండలం చెన్నవరం – పాపిరెడ్డిపల్లి మధ్యలో 30 నుంచి 35 ఏళ్ల వయస్సు గల మహిళపై దుండగులు రాళ్ళతో దాడి చేసి చంపారని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు రాళ్లతో తలను ఛిద్రం చేశారు. మహిళపై వస్త్రాలు లేకపోవడంతో అత్యాచారం చేసి హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
YS వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ స్పీడ్ అందుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే వివేకా కుమార్తె YS సునీత CM చంద్రబాబుని కలిసి దీనిపై చర్చించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న MP అవినాశ్ రెడ్డికి ఇటీవల సుప్రీంకోర్టు నోటీసులు సైతం జారీ చేసింది. వివేకా PA కృష్ణారెడ్డి ఇంటికి విచారణ కోసం పోలీసులు వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసులో తదుపరి చర్యలు ఎలా ఉంటాయనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
చక్రాయపేట మండలం కే. రాజు పల్లె గ్రామంలో బుధవారం ఓ గొర్రెకు 8కాళ్ల వింత జంతువు జన్మించింది. రసూల్ కు చెందిన గొర్రె ఈ విధంగా జన్మనిచ్చింది. ఈ వింతను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వస్తున్నారు. బ్రహ్మంగారు చెప్పినట్లు ఈ వింతలు జరుగుతున్నాయని పలువురు అంటున్నారు.
ఉమ్మడి కడప జిల్లాలోని నీటి సమస్యపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో చర్చించారు. ఆయన మాట్లాడుతూ..’ నేను ఓ సారి అన్నమయ్య జిల్లాలో పర్యటించాను. అప్పుడు రోడ్డు పక్కన ఉన్న ఓ ప్రాంతం వద్ద మహిళలను మీకు ఏం కావాలని అడిగా. ఓ మహిళ తాగునీళ్లు కావాలని అడిగింది. ఆమె అలా అడగడంతో నా కళ్లు చెమ్మగిల్లాయి’ అని పవన్ అన్నారు. ఆ సమస్యను తొమ్మిది రోజులలో తీర్చినట్లు తెలిపారు.
Scలను YCP మోసం చేసిందని కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఆరోపించారు. మంగళవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘SCల అభివృద్ధి కోసం 2018 లో సబ్సిడీ కింద రూ.25 కోట్లను వెహికల్స్ కోసం మంజూరు చేస్తే.. వైసీపీ నాయకుల నిర్లక్ష్యంతో అవి దొంగలపాలయ్యాయన్నారు. వారిని కఠినంగా శిక్షించాలని అని మంత్రి స్వామిని కోరారు. వాహనాలను పంపిణీ చేసేందుకు కమిటీ నియమిస్తామని , నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
Sorry, no posts matched your criteria.