India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మండలంలోని పగడాలపల్లి గ్రామానికి చెందిన చంద్రయ్య గొర్రెల మందపై వీధి కుక్కలు ఆదివారం ఉదయం దాడి చేసి 15 గొర్రె పిల్లలను చంపేశాయి. దీంతో దాదాపు రూ.1 లక్ష నష్టం వాటిల్లిందని గొర్రెల కాపరి చంద్రయ్య వాపోయారు. ఎండా, వానను సైతం లెక్కచేయకుండా గొర్రెలను కాసి పెంచుకున్న పిల్లలను కుక్కలు పొట్టన పెట్టుకున్నాయని వాపోయారు. కష్టపడి పెంచుకుంటున్న గొర్రె పిల్లలు కుక్కల దాడిలో మృతి చెందడంతో విలపించారు.

ఓ RMP అందించిన వైద్యానికి సుబ్బరాయుడు అనే వ్యక్తి అపస్మారకస్థితిలోకి వెళ్లిన ఘటన కమలాపురంలో చోటుచేసుకుంది. బాధితుడి కుటుంబ సభ్యుల వివరాలు ప్రకారం.. ‘సుబ్బరాయుడు కాలికి గాయం కావడంతో కమలాపురం పట్టణం మార్కెట్లోని RMP వైద్యుని సంప్రదించారు. అతడు అందించిన చికిత్సలకు స్పృహ కోల్పోయాడు. రిమ్స్, ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్సలు అందించగా.. మెరుగైన చికిత్సలు అవసరమని వైద్యులు తెలిపారు’ అని వాపోయారు.

కడప జిల్లాలోని చారిత్రాత్మక గండికోట, సిద్దవటం కోటలలో సినీ చిత్ర పరిశ్రమ హీరోలు షూటింగ్ జరపాలని నిర్మాత దిల్ రాజును ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. రాజమండ్రి వేదికగా జరుగుతున్న రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమను ఏపీకి తీసుకురావాలని కోరుకుంటూ జిల్లాలోని సిద్దవటం, గండికోటలో సినిమాలు తీయాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇసుక పంపిణీ విధానాన్ని పక్కాగా అమలు చేయాలని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. నూతన ఇసుక పాలసీ, ఇసుక బుకింగ్ ఇతర అంశాలపై గనులు భూగర్భ శాఖ కార్యదర్శి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు సూచనల మేరకు ఉచిత ఇసుక పాలసీని మరింత మెరుగుపరచాలని కలెక్టర్లను శుక్రవారం ఆదేశించారు.

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పరిసరాలైన శేషాచలం అడవుల్లో బిటెక్ విద్యార్థులు దారి తప్పిపోయారు. శ్రీ కాళహస్తి నుంచి వచ్చిన ఆరుగురు బీటెక్ విద్యార్థులు, అడవిలోని అందమైన వాటర్ఫాల్స్ను చూసేందుకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో వారు దారితప్పి శుక్రవారం అడవిలో చిక్కుకుపోయారు. దారి తప్పిన ఆరుగురిలో ఒకరు అస్వస్థతకు గురయ్యారు. అయితే ఇలా మిస్ అయినట్లు పోలీసులకు తెలపగా వారు గాలిస్తున్నారు.

రూరల్ పరిధిలోని ఆటోనగర్లో అక్రమంగా నిలువ ఉంచిన 184 బస్తాల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. రూరల్ పోలీసులు అందించిన సమాచారం మేరకు ఒక రూమ్లో దాచి ఉంచిన రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు తాళాలు పగలగొట్టి స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మార్వో గంగయ్య, డీటీ మల్లికార్జున, ఇతర అధికారుల సమక్షంలో పంచనామా చేసి అక్రమ బియ్యాన్ని సీజ్ చేశారు.

కడప జిల్లా జోన్-4 పరిధిలో 150 స్టాఫ్ నర్సు పోస్టులకు కాంట్రాక్ట్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు రీజనల్ డైరెక్టర్ రామగిడ్డయ్య ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం నుంచి ఈనెల 17 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు ఫారం పూర్తి చేసి కడప పాత రిమ్స్లోని ప్రాంతీయ సంచాలకుల కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుందన్నారు. ఇతర వివరాలకు https://cfw.ap.nic.in/ వెబ్సైటును సంప్రదించాలన్నారు.

కడప పట్టణం పాత కడప సచివాలయం వార్డు -1 నుంచి 1.5 కి.మీ దూరంలోని శ్రీ కాలభైరవపురంలో (ప్రస్తుతవాటర్ గండి కొండ వద్ద) చోళ రాజులు నిర్మించిన కాలభైరవ స్వామి ఆలయం ఉంది. 8వ శతాబ్దానికి చెందిన తెలుగు శిలా శాసనంలో సమరాధిత్య, విమలాదిత్య అనే బిరుదులు అందులో తొలి తెలుగు శిలా శాసనాలు అయిన కల్లమల, ఎర్రగుడిపాడు శాసనాలు మన జిల్లాలో లభించినవి. కడపలో లభించిన తొలి ప్రాచీన తెలుగు శిలాశాసనం.

కడప జిల్లా వేంపల్లి మండలంలోని ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ IIIT విద్యార్థులకు ఈనెల 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించినట్లు, ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ గుప్తా తెలిపారు. గురువారం స్థానిక ట్రిపుల్ ఐటీలో ఆయన మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ సందర్భంగా విద్యార్థులకు వారం రోజులపాటు సెలవులను ప్రకటించామన్నారు.

దక్షిణ భారతదేశంలో అతి ప్రాచీనమైన పట్టణాలలో కడప పట్టణం ఒకటి. పెన్నా నది ఒడ్డున మొదటి కడప పట్టణాన్ని తమిళ రాజు కరికాల చోళుడు నిర్మించినట్లు తమిళ సంఘ సాహిత్యంలోని తల్కాపియం అనే గ్రంథం ఆధారంగా తెలుస్తుంది. కరికాల చోళుని పేరు మీదనే కడప అనే పేరు వచ్చింది. అప్పటి జిల్లా ప్రధాన పరిపాలనా కేంద్రం సిద్ధపటం కోట. ఈ కోట కూడా పెన్నా నది ఒడ్డునే ఉండడం విశేషం. కంచి ఏకాంబరేశ్వరబాబు ఆలయంలో వీరి విగ్రహం ఉంది.
Sorry, no posts matched your criteria.