Y.S.R. Cuddapah

News September 17, 2024

తొండూరు బ్రిడ్జిపై రెండు లారీలు ఢీ

image

తొండూరు బ్రిడ్జిపై అతివేగంగా వస్తున్న రెండు సిమెంట్ లారీలు వెనకనుంచి ఒకదానికొకటి ఢీ కొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కానీ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న తొండూరు ఎస్సై ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

News September 17, 2024

కడప: తెగిపడిన యువకుడి చెయ్యి

image

నందలూరు రైల్వే కేంద్రంలో రైలు కింద పడి యువకుడి చెయ్యి తెగిపడిపోయిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. గుంతకల్లుకు చెందిన కురుబ ధనుష్ పుత్తూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. రైలులో పుత్తూరుకు వెళుతూ నందలూరుకు రాగానే ప్రమాదవశాత్తు రైలు కింద పడి చెయ్యి విరిగింది. క్షతగాత్రుడిని రాజంపేట ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

News September 16, 2024

చాపాడు: ఢివైడర్ ఢీకొని యువకుడు దుర్మరణం

image

మైదుకూరు – పొద్దుటూరు ప్రధాన రహదారిలో డివైడర్ ఢీకొని యువకుడు దుర్మరణం చెందాడు. చాపాడు మండలం విశ్వనాథపురం వద్ద రోడ్డు నిర్మాణంలో భాగంగా ఆర్ అండ్ బీ అధికారులు ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్ల వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని స్థానికులు తెలిపారు. పొద్దుటూరు నుంచి మైదుకూరుకి వస్తున్న రహదారిపై వేసిన స్పీడ్ బ్రేకర్ గుర్తించలేక స్కూటీ బోల్తా పడి మరణించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 16, 2024

కడప: గంగమ్మ ఒడికి చేరుకున్న గణనాథులు

image

చిన్నమండెం మండల వ్యాప్తంగా భక్తుల నుంచి విశేష పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకున్నారు. గణేశ్ నిమజ్జనోత్సవం సందర్భంగా గ్రామాల్లో మధ్యాహ్నం నుంచి కోలాహలం మొదలైంది. వాడవాడలా కొలువుదీరిన వినాయక విగ్రహాలు డప్పులు, మేళతాళాలు, బాజా భజంత్రీలు, బాణసంచా పేలుళ్ల నడుమ బారులు తీరిన భక్తులు గణనాథునికి నీరాజనాలర్పించారు.

News September 16, 2024

పోరుమామిళ్ల మండలంలో వ్యక్తి సూసైడ్

image

పోరుమామిళ్ల మండలం ఈదులపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఈదుళ్ళపళ్లి గ్రామానికి చెందిన రమేశ్ అనే వ్యక్తి సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద ఉరివేసుకొని మృతి చెందాడు. మృతుడు స్థానికంగా ఉండే పెట్రోల్ బంకులో పంపు ఆపరేటర్‌గా పనిచేసే వ్యక్తిగా గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు పరిశీలించి, ఇది హత్యా ఆత్మహత్యా అన్న కోనంలో దర్యాప్తు చేస్తున్నారు.

News September 16, 2024

కడప: 17న ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

కడపలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే ప్రజాప్రయోజన పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా పోలీస్ అధికారులు వెల్లడించారు. మిలాన్ ఉన్ నబీ పండగ నేపథ్యంలో కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఈ కార్యక్రమాన్ని మంగళవారానికి వాయిదా వేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదివారం పేర్కొన్నారు.

News September 16, 2024

కడప: ‘ఇసుక పంపిణీ పారదర్శకంగా పంపిణీ చేయాలి’

image

ఇసుక పంపిణీ నియమ నిబంధనలో మేరకు ఆన్లైన్ పోర్టల్ ద్వారా పారదర్శకంగా పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 19వ తేదీ నుంచి ఆన్‌లైన్ విధానం ద్వారా ఇసుక పంపిణీకి చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, డీఆర్‌వో గంగాధర్ గౌడ్ పాల్గొన్నారు.

News September 15, 2024

4వ స్థానం పొందిన కడప జిల్లా బాల్ బ్యాడ్మింటన్ జట్టు

image

9వ అంతర్ జిల్లాల సబ్ జూనియర్స్ రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో కడప జిల్లా బాలుర జట్టు నాల్గవ స్థానం సాధించింది. తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలో ఈనెల 13వ తేది నుంచి 15వ తేది వరకు ఈ పోటీలు సాధించింది. ఇందులో ప్రతిభ కనబరిచిన బాలుర జట్టును వైఎస్ఆర్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి వెంకట రమణ, కోచ్ సురేంద్ర అభినందించారు.

News September 15, 2024

కడప: మీపై కేసులు ఉన్నాయా.. ఇలా చేయండి.!

image

చిన్న కారణాలతో కేసుల వరకు వెళ్లిన వారిని పిలిపించి సెటిల్మెంట్ చేసి పరిష్కరించే కార్యక్రమమే లోక్ అదాలత్. కడప జిల్లా వ్యాప్తంగా 3200 కేసులు శనివారం పరిష్కారం అయ్యాయని, కక్షిదారులకు రూ.6,24,18,818 చెల్లింపు జరిగిందని కడప జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు ప్రధాన న్యాయమూర్తి జి శ్రీదేవి అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News September 15, 2024

పర్యాటక దినోత్సవ వేడుకలు జయప్రదం చేయాలి: కలెక్టర్

image

ఈనెల 27న గండికోటలో నిర్వహించే ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలకు ఎలాంటి కొరత లేకుండా అన్ని రకాల ఏర్పాట్లను చేయాలని, కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి అధికారులను ఆదేశించారు. గండికోట అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ మీటింగ్ హాలులోని గండికోటలో శనివారం సమావేశం అయ్యారు. జిల్లాలో అత్యంత ప్రాచీన చారిత్రక పొందిన పర్యాటక ప్రాంతమైన “గండికోట పర్యాటక కేంద్రంలో వైభవంగా పర్యాటక దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు.