Y.S.R. Cuddapah

News October 21, 2024

కడప: 100,112 నంబర్ల సేవలను వినియోగించుకోవాలి

image

కడప జిల్లాలో పోలీస్ హెల్ప్ లైన్ 100,112 నంబర్ల సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా SP హర్షవర్ధన్ రాజు తెలిపారు. సోషల్ మీడియాలో పై నంబర్లు పనిచేయడం లేదంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని, 2 పోలీస్ హెల్ప్ లైన్ నంబర్లు యథావిధిగా పనిచేస్తున్నాయని SP తెలిపారు. అవాస్తవాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటామని హెచ్చరించారు.

News October 21, 2024

జవాన్ మృతదేహానికి నివాళులర్పించిన కడప MP

image

బ్రహ్మంగారి మఠం మండలం పాపిరెడ్డిపల్లెలో జవాన్ మృతదేహానికి సోమవారం ఎంపీ అవినాశ్ రెడ్డి, మైదుకూరు మాజీ MLA శెట్టిపల్లి రఘురామిరెడ్డి నివాళులర్పించారు. వీరమరణం పొందిన జవాన్ రాజేశ్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ వీర నారాయణరెడ్డి, తోట్లపల్లి సర్పంచ్ లక్ష్మీదేవి, సోమిరెడ్డిపల్లి సర్పంచ్ ఎత్తపు సుదర్శన్ రెడ్డి వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

News October 21, 2024

YVUలో నేటి నుంచి డిగ్రీ ఒకేషనల్ పరీక్షలు

image

యోగి వేమన విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ కళాశాలలో నాలుగేళ్ల యూజీ ఆనర్స్ ఒకేషనల్ 2వ సెమిస్టర్ పరీక్షలు, నేటినుంచి నిర్వహించనున్నట్లు YVU పరీక్షల నిర్వహణ అధికారి ఆచార్య ఎన్ ఈశ్వరరెడ్డి తెలిపారు. MLT, డైరీ సైన్స్ చదివే విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాలన్నారు. ఈనెల 28వ తేదీ వరకు ప్రతిరోజు (27వ తేదీ మినహ) ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు.

News October 21, 2024

21 నుంచి వైవీయూ డిగ్రీ ఒకేషనల్ పరీక్షలు

image

వైవీయూ పరిధిలోని డిగ్రీ కళాశాలలో నాలుగేళ్ల యూజీ ఆనర్స్ ఒకేషనల్ రెండవ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 21వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు వైవీయూ పరీక్షల నిర్వహణ అధికారి ఆచార్య ఎన్. ఈశ్వరరెడ్డి తెలిపారు. ఎం.ఎల్.టి, డైరీ సైన్స్ చదివే విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాలన్నారు. హాల్ టికెట్లను చదువుతున్న కళాశాల నుంచి పొందాలన్నారు. పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించనున్నామని తెలిపారు.

News October 20, 2024

కడప జిల్లా SP నేటి సాయంత్రం కీలక ప్రెస్‌మీట్

image

కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు నేటి<<14403526>> సాయంత్రం కీలక ప్రెస్మీట్ <<>>నిర్వహించనున్నారు. నిన్న బద్వేలులో ఉన్మాది చేతిలో దారుణంగా హతమైన విద్యార్థిని కేసుకు సంబంధించిన ఘటనను, రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడంతో ఇప్పటికే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం మీడియా ముందు ప్రవేశపెట్టడంతోపాటు, ఘటనకు సంబంధించిన వివరాలను ఎస్పీ వెల్లడించనున్నట్లుగా తెలుస్తుంది.

News October 20, 2024

కడప: గొర్రెల కాపరి ఆచూకీ లభ్యం.!

image

బద్వేలు పరిధిలోని అట్లూరు మండలానికి చెందిన <<14386467>>గొర్రెల కాపరి..<<>> గంగిరెడ్డి 6 రోజుల క్రితం అడవిలో మేకలకు వెళ్లి మిస్ అయ్యాడు. అతనికోసం ఓ పక్క డ్రోన్‌లతో మరో పక్క గ్రామస్థులు అడవిలో గాలించారు. కాగా శనివారం ఇతని ఆచూకీ లభ్యమైంది. అయితే లంకమల అభయారణ్యంలోని గుబ్బకోన వద్ద తిరుగుతుండగా వరికుంట గ్రామస్థులు గుర్తించారు. మేకల ఇంటికి రాలేదని వాటిని వెతుకుతూ అడవితో దారి మరచి తప్పిపోయినట్లు అతను తెలిపాడు.

News October 20, 2024

వీర మరణం పొందిన కడప జిల్లా జవాన్‌ ఇతనే.!

image

కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన కొడవటికంటి రాజేశ్ ఛత్తీస్‌గఢ్‌లోని మిజాపూర్‌ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP)లో జవాన్‌గా పనిచేస్తున్నాడు. కాగా శనివారం నక్సల్స్ అమర్చిన ల్యాండ్ మైన్ పేలి మృతి చెందాడు. ఈ విషయం తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా మృతి చెందిన జవాన్‌కు ముగ్గురు పిల్లలు, భార్య ఉన్నట్లు గ్రామస్థులు తెలిపారు.

News October 20, 2024

ఎంత ఘోరం..!

image

బద్వేల్ <<14397895>>ఘటన<<>> ఆ యువతి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇంటి నుంచి కాలేజీకి వెళ్లిన బిడ్డపై పెట్రోల్ పోసి నిప్పు అంటించారని తెలియడంతో ఆ తల్లిదండ్రులు విలవిలలాడిపోయారు. వెంటనే కడప ఆసుపత్రికి వెళ్లారు. నిన్నటి నుంచి చికిత్స అందిస్తుండగా తమ కుమార్తె బతుకుతుందని ఎన్నో ఆశలతో ఉన్నారు. కానీ అలా ఆసుపత్రిలో ఆ తల్లిదండ్రుల కళ్ల ఎదుటే చనిపోవడంతో బోరున విలపిస్తున్నారు.

News October 20, 2024

విఘ్నేశ్‌కి పెళ్లై భార్య గర్భిణి..?

image

బద్వేల్‌ ఘటన కడప జిల్లాను ఒక్క సారిగా<<14397895>> ఉలిక్కిపడేలా చేసింది.<<>> విఘ్నేశ్ అనే యువకుడు ఇంటర్ చదివే(17) యువతిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించడం అంతటా చర్చినీయాంశంగా మారింది. ఈ ఘటనలో కీలక ట్విస్ట్ వెలుగు చూసింది. యువతికి చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న విఘ్నేశ్‌కు ఇప్పటికే పెళ్లి జరిగినట్లు సమాచారం. అతడి భార్య ప్రస్తుతం గర్భిణి అంట. మాట్లాడదామంటూ కాలేజీలో ఉన్న యువతిని పిలిచి ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం.

News October 20, 2024

కడప దర్గా ఉరుసు ఉత్సవాలకు షర్మిలకు ఆహ్వానం

image

నవంబర్ నెలలో అత్యంత వైభవంగా జరిగే ప్రాచీనమైన కడప అమీన్ పీర్ పెద్ద దర్గా ఉరూసు ఉత్సవాలకు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలను దర్గా ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ మేరకు ఆమెను కలిసి దర్గా ఉరుసు ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు. కుల, మతాలకు అతీతంగా జరిగే ఉరుసు ఉత్సవాలలో పాల్గొనాలని షర్మిలను ఆత్మీయంగా ఆహ్వానించారు.