India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కడప జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ను తెలంగాణ క్యాడర్కు కేటాయించడంతో ఇన్ఛార్జ్ కలెక్టర్గాజాయింట్ కలెక్టర్ అదితి సింగ్కు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. క్యాడర్ ఆదేశాల మేరకు బుధవారం తెలంగాణ సెక్రటేరియట్ లోతేటి శివశంకర్ రిపోర్ట్ చేయడంతో జిల్లాలో కలెక్టర్ పోస్టు ఖాళీ ఏర్పడింది. కొత్త కలెక్టర్ను నియమించేంత వరకూ జేసీనే బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
యోగి వేమన విశ్వ విద్యాలయంలో ఎంఏ, ఎంఎస్సీ, ఎంకాం, ఎంపీఈడీ కోర్సులలో ఈనెల 17 నుంచి 21వ తేదీ వరకు నేరుగా అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు వైవీయూ ప్రవేశాల డైరెక్టర్(డీవోఏ) డా. లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్, 2 సెట్ల జిరాక్స్ కాపీలు, నిర్ణీత ఫీజుతో వైవీయూలోని డీవోఏ కార్యాలయంలో హాజరు కావాలన్నారు. వివరాలకు yvu.edu.in అనే వెబ్సైట్ ను సంప్రదించాలని సూచించారు.
తుఫాను నేపథ్యంలో కడప జిల్లాలో గురువారం కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్, కాలేజీలు, ఎయిడెడ్, అంగన్వాడీ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ ఉత్తర్వులను అన్ని రకాల పాఠశాలల యాజమాన్యాలు విధిగా అమలు పరచాలని ఆదేశించారు. ఇప్పటికే అన్నమయ్య జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.
అన్నమయ్య జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు గురువారం సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికల మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా సెలవు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యవసరం అయితేనే బయటికి రావాలని ప్రజలకు సూచించారు.
NOTE: రేపటి సెలవుపై కడప జిల్లా నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు.
భారీ వర్షాల నేపథ్యంలో కడప జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టర్ శివశంకర్ ఆదేశాల మేరకు జిల్లా పరిధిలోని అన్ని పాఠశాలలకు డీఈవో మర్రెడ్డి అనురాధ సెలవు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలు తప్పనిసరిగా విద్యార్థులకు సెలవు ఇవ్వాలని ఆదేశించారు.
బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగండం తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈనేపథ్యంలో ఇవాళ కడప, అన్నమయ్య జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈక్రమంలో ఈ రెండు జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే అన్నమయ్య జిల్లా పరిధిలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండేలా అధికారులను సిద్ధం చేశారు.
ప్రజలకు సజావుగా ఇసుక పంపిణీ చేసి ప్రభుత్వానికి మంచి పేరు ప్రతిష్ఠలు తేవాలని కడప జిల్లా కలెక్టర్ శంకర్ లోతేటి అన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లాలో ఇసుక పంపిణీపై సంబంధిత అధికారులతో, ఇసుక ఏజెన్సీ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు అందరికీ అందుబాటులో ఇసుకను అందించాలని ప్రభుత్వానికి, జిల్లాకు ప్రతిష్ఠలు తీసుకురావాలని చెప్పారు.
కడప నగరంలో నవంబర్ 16 నుంచి 20 వరకు జరగనున్న కడప అమీన్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాలకు సీఎం చంద్రబాబు నాయుడుని దర్గా పెద్దలు ఆహ్వానించారు. సచివాలయంలో సీఎంను మంగళవారం కలిసి దర్గా ముతావల్లి ఖ్వాజా సయ్యద్ షా ఆరిఫుల్లా హుస్సేనీ ఆహ్వాన పత్రిక అందించారు. సీఎం సానుకూలంగా స్పందించారని మత పెద్దలు తెలిపారు.
సామాజిక తనిఖీలో భాగంగా కమలాపురం పోలీస్ స్టేషన్ను మంగళవారం కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం లాంటి అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కుపాదం మొపుతాం మోపుతామన్నారు. కష్టాల్లో వచ్చిన ప్రజలకు పోలీసులు అండగా నిలవాలిని ఫ్రెండ్లీ పోలీసింగ్ లాంటి అంశాలపై సిబ్బందికి తగు సూచనలు ఇచ్చిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు.
విద్యుత్ సమస్యలపై నిరంతరం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా సూపరింటెండెంట్ రమణ పేర్కొన్నారు. వర్షం సమయంలో సమస్యలు తలెత్తితే కంట్రోల్ రూమ్కి కాల్ చేయాలన్నారు.
▶ కడప కంట్రోల్ రూమ్ 9440817440
▶ కడప డివిజన్ 9440817441
▶ పులివెందుల 9491431255
▶ ప్రొద్దుటూరు డివిజన్ 7893261958
▶జమ్మలమడుగు కంట్రోల్ రూమ్ 80742 69513
▶మైదుకూరు డివిజన్ 9492873325, 80742 69513 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.
Sorry, no posts matched your criteria.