India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జింబాబ్వే క్రికెటర్ సికందర్ రజా సరికొత్త చరిత్ర సృష్టించారు. టీ20 ఫార్మాట్(టెస్టులు ఆడే దేశాలు)లో అత్యధిక POTMలు అందుకున్న ప్లేయర్గా రజా నిలిచారు. ఇప్పటివరకు ఆయన 18 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నారు. శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో ఆయన POTMగా నిలిచి ఈ ఫీట్ సాధించారు. రజా తర్వాత కోహ్లీ, సూర్యకుమార్(16), మహమ్మద్ నబీ, రోహిత్(14), మహ్మద్ రిజ్వాన్, వార్నర్, మ్యాక్స్వెల్ (12) ఉన్నారు.
6,589 క్లర్క్(జూనియర్ అసోసియేట్స్) పోస్టుల భర్తీకి ఈనెల 20, 21, 27 తేదీల్లో ప్రిలిమ్స్ నిర్వహించనున్నట్లు SBI ప్రకటించింది. త్వరలో కాల్ లెటర్లు విడుదల చేయనున్నట్లు తెలిపింది. కాగా AUG 26 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించింది. మొత్తం పోస్టుల్లో 5,180 రెగ్యులర్, 1,409 బ్యాక్లాగ్ ఉద్యోగాలున్నాయి. వీటిలో APలో 310, TGలో 250 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
వెబ్సైట్: <
APలో LAWCET, PGLCET, EdCET, PECETలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. LAWCET, PGLCETకు ఈనెల 8-11 మధ్య దరఖాస్తు ఫీజు చెల్లించాలి. 12-14 మధ్య వెబ్ ఆప్షన్స్, 17న సీట్ల కేటాయింపు చేపడతారు. EdCETకు 9-12 మధ్య ఫీజు చెల్లింపు, 13-15 మధ్య వెబ్ ఆప్షన్స్, 18న సీట్ అలాట్మెంట్ ఉంటుంది. PECETకు 10-13 మధ్య ఫీజు చెల్లింపు, 14-16 మధ్య వెబ్ ఆప్షన్స్, 19న సీట్ల కేటాయింపు ఉంటుంది. పూర్తి వివరాలకు <
పుస్తకాలు సేకరించే అభిరుచిని ప్రజా ప్రయోజనంగా మార్చారు కర్ణాటకలోని హరలహల్లికి చెందిన అంకే గౌడ. బస్ కండక్టర్గా జీవితాన్ని ప్రారంభించి సాహిత్యంలో మాస్టర్స్ పూర్తి చేశారు. పుస్తకాల సేకరణకు తన ఆస్తిని కూడా అమ్మేశారు. ప్రస్తుతం ఆయన 20లక్షల పుస్తకాలతో వ్యక్తిగత లైబ్రరీని ఏర్పాటు చేయగా అందులో 5లక్షల విదేశీ పుస్తకాలు, వివిధ భాషలకు చెందిన 5K నిఘంటువులు ఉన్నాయి. ఈ లైబ్రరీకి న్యాయమూర్తులు సైతం వెళ్తుంటారు.
AP: చంద్రగ్రహణం సందర్భంగా రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేస్తున్నట్లు TTD అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ‘మ.3.30గంటలకు ఆలయం మూసివేస్తాం. ఎల్లుండి సుప్రభాత సేవతో ఆలయ తలుపులు తెరుస్తాం. మధ్యాహ్నంలోపు 30వేల మందికి దర్శనం కల్పిస్తాం. రేపు వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు’ అని చెప్పారు. అలాగే శ్రీశైలం ఆలయం కూడా రేపు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూసివేయనున్నారు.
సౌత్ కొరియాలో జరుగుతున్న ఆర్చరీ ఛాంపియన్ షిప్లో భారత ఆర్చర్లు వెన్నం సురేఖ, రిషభ్ యాదవ్ సత్తా చాటారు. సెమీ ఫైనల్లో కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో చైనీస్ తైపీ జట్టుపై గెలిచి ఫైనల్కు దూసుకెళ్లారు. చైనీస్ తైపీపై 157-155 పాయింట్ల తేడాతో నెగ్గారు. ఫైనల్లో నెదర్లాండ్స్ను వీరు ఎదుర్కొంటారు.
జీఎస్టీ శ్లాబుల మార్పుల వేళ <<17624320>>టాటా<<>>, మహీంద్రా బాటలోనే టొయోటా కూడా కార్ల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఫార్చునర్పై అత్యధికంగా రూ.3.49లక్షల వరకు తగ్గనున్నట్లు తెలిపింది. గ్లాంజాపై రూ.85,300 వరకు, టైసోర్పై రూ.1.11 లక్షల వరకు, ఇన్నోవా క్రిస్టాపై రూ.1.8లక్షల వరకు, హైలక్స్పై రూ.2.52లక్షల వరకు, వెల్ఫైర్పై రూ.2.78లక్షల వరకు ధర తగ్గిస్తున్నట్లు పేర్కొంది. ఇవి ఈనెల 22 నుంచి అమల్లోకి వస్తాయంది.
ప్రపంచ శాంతి కోసం భారత్-ఫ్రాన్స్ కలిసి పనిచేస్తాయని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్తో ఫోన్లో సంభాషించినట్లు తెలిపారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం కొనసాగడంపై చర్చించినట్లు చెప్పారు. అంతర్జాతీయ అంశాలతో పాటు ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు చేపట్టాల్సిన అంశాలపైనా సుదీర్ఘంగా మాట్లాడినట్లు మోదీ వెల్లడించారు.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. రాష్ట్రపతి భవన్కు వెళ్లిన ఆయన ఈ నెల 9న జరగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నిక, ఇతర అంశాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు కాసేపట్లో వెల్లడయ్యే అవకాశం ఉంది.
రూ.5 కోట్ల బడ్జెట్తో తీస్తే ఏకంగా రూ.120 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ‘సు ఫ్రం సో’ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈనెల 9 నుంచి జియో హాట్స్టార్ స్ట్రీమింగ్ చేయనుంది. జేపీ తుమినాడ్ దర్శకత్వం వహించిన ఈ హారర్ కామెడీ తొలుత కన్నడలో రిలీజై ఆకట్టుకుంది. తర్వాత తెలుగులోనూ విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తోంది.
Sorry, no posts matched your criteria.