India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు స్కూళ్లలో పేద, వెనుకబడిన వర్గాల పిల్లలకు ఒకటో తరగతిలో 25% సీట్లు ఫ్రీగా కేటాయించేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైనవారు https://cse.ap.gov.in/లో FEB 20 నుంచి మార్చి 10 వరకు అప్లై చేసుకోవాలి. లాటరీ విధానంలో మార్చి 25, ఏప్రిల్ 12న విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. అనాథలు, దివ్యాంగులు, HIV బాధితులు, SC, ST, BCలకు రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయిస్తారు.

సేంద్రియ పద్ధతిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు APలోని అనకాపల్లి జిల్లాలో పలువురు రైతులు. ఈ పంటకు ఉపాధి హామీ పథకం కింద నిధుల సాయంతో వీరి పెట్టుబడి ఖర్చు చాలా వరకు తగ్గుతోంది. నిపుణుల సూచనతో పంట నాటి తొలి ఏడాది నుంచే రూ.లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. ఉపాధి హామీ కింద ఈ పంటకు ఎంత సాయం వస్తుంది? ఇతర కీలక సమాచారానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.

IMPS ట్రాన్సాక్షన్లపై సర్వీస్ ఛార్జీల వసూలుకు SBI సిద్ధమైంది. రూ.25వేల-రూ.లక్ష వరకు రూ.2+GST, రూ.లక్ష-2లక్షల వరకు రూ.6+GST, రూ.2లక్షల-5లక్షల వరకు రూ.6+GST వసూలు చేయనుంది. అయితే రూ.25వేల కంటే తక్కువ నగదు బదిలీకి ఎటువంటి ఛార్జీ చెల్లించనవసరం లేదు. ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్, యోనో యాప్ ద్వారా చేసే ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు వర్తిస్తాయి. FEB 15 నుంచి ఈ ఛార్జీలు అమలులోకి రానున్నాయి.

అసలైన కర్పూరం వెలిగించినప్పుడు పూర్తిగా కరిగిపోతుంది. ఎలాంటి బూడిదను, నల్లటి మచ్చలను మిగల్చదు. ఇది స్పటికంలా ఉండి, సులభంగా విరిగిపోతుంది. నిజమైన కర్పూరాన్ని నీటిలో వేస్తే వెంటనే మునిగిపోతుంది. అదే నకిలీది అయితే నీటిపై తేలుతుంది. స్వచ్ఛమైన కర్పూరం ఘాటుగా ఉండకుండా ప్రశాంతమైన వాసననిస్తుంది. గాలిలో ఉంచితే కొద్దిసేపటికే ఆవిరైపోతుంది. రసాయనాలతో కూడిన నకిలీ కర్పూరం ఆరోగ్యానికి హానికరం.

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)లో 40 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. బీఈ/బీటెక్(సివిల్)అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. గేట్ 2025 స్కోరు ఆధారంగా ఎంపిక చేయనున్నారు. నెలకు రూ.56,100-రూ.1,77,500 చెల్లిస్తారు. వెబ్సైట్: https://nhai.gov.in/

అంతర్జాతీయంగా వైట్ బాల్ క్రికెట్లో టీమ్ ఇండియా హవా కొనసాగుతోంది. గత రెండేళ్లలో టీమ్ ఇండియా ఖాతాలో ఏకంగా 5 ICC ట్రోఫీలు చేరడమే దీనికి నిదర్శనం. 2024లో రోహిత్ సారథ్యంలోని భారత్ T20I వరల్డ్ కప్ను గెలుచుకోగా తర్వాతి ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ సొంతం చేసుకుంది. ఇక 2025లోనే U-19 T20WCను మహిళల జట్టు గెలుచుకోగా నవంబర్లో హర్మన్ సేన వన్డే వరల్డ్ కప్ నెగ్గింది. తాజాగా U-19 మెన్స్ టీమ్ వన్డే WC గెలుచుకుంది.

తెలుగు రాష్ట్రాలను కొన్ని రోజులుగా పెద్దపులులు భయపెడుతున్నాయి. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో జనాలను భయాందోళనలకు గురిచేసిన పెద్దపులి నిన్న అధికారులకు చిక్కింది. మరోవైపు తెలంగాణ జనగాంలోని రఘునాథపల్లిలో మరో పెద్దపులి ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా లేగదూడను చంపిన ఆనవాళ్లను గుర్తించిన ఫారెస్ట్ అధికారులు సమీప గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

వచ్చే ఐదేళ్లలో అమెరికా నుంచి ఏకంగా 500 బిలియన్ డాలర్ల గూడ్స్ను ఇండియా కొనుగోలు చేయనుంది. ఇందులో ఇంధన ఉత్పత్తులు, ఎయిర్క్రాఫ్టులు, వాటి పార్టులు, విలువైన లోహాలు, టెక్నాలజీ ప్రొడక్టులు, కోకింగ్ కోల్ వంటివి ఉన్నాయి. డేటా సెంటర్లలో ఉపయోగించే గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ల(GPU)తో పాటు ఇతర టెక్నాలజీ ప్రొడక్టుల వాణిజ్యాన్ని పెంచుకోవాలని నిర్ణయించినట్లు రెండు దేశాలు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.

IND-US మధ్య ఇంటరిమ్ ట్రేడ్ అగ్రిమెంట్ ఖరారైనట్టు వైట్హౌస్ ప్రకటించింది. భారత ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాలను 18%కి తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపేసేందుకు భారత్ అంగీకరించిందని ఫ్రేమ్ వర్క్లో పేర్కొంది. US నుంచి ఇంధనం, గ్యాస్ను భారత్ దిగుమతి చేసుకోనున్నట్టు చెప్పింది. అమెరికా దిగుమతి చేసుకునే వాటిపై సుంకాలను IND సున్నాశాతానికి తగ్గిస్తుందని తెలిపింది.

బీట్రూట్ను డైట్లో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలున్నాయన్న విషయం తెలిసిందే. అయితే దీంతో అందాన్ని కూడా పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు. * బీట్రూట్ రసం, పెరుగు కలిపి ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. దీంతో ముఖంపై మచ్చలు తగ్గుతాయి. * బీట్రూట్ రసం, ఓట్స్ కలిపి స్క్రబ్ చేసుకుంటే రక్త ప్రసరణ పెరిగి చర్మం మెరుపు, మృదుత్వం పెరుగుతుంది.
Sorry, no posts matched your criteria.