news

News April 19, 2025

ఆ లిస్టులో సెకండ్ ప్లేస్‌కు పాటీదార్

image

నిన్న పంజాబ్‌తో మ్యాచ్ సందర్భంగా RCB కెప్టెన్ రజత్ పాటీదార్ IPLలో తక్కువ ఇన్నింగ్స్‌(30)లో 1,000 పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో 2వ స్థానం దక్కించుకున్నారు. ఈ లిస్టులో 25 ఇన్నింగ్స్‌లతో GT ప్లేయర్ సాయి సుదర్శన్ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచారు. సచిన్, రుతురాజ్ 3వ స్థానంలో ఉన్నారు. కాగా, ఈ ఏడాది RCBకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పాటీదార్ 7మ్యాచుల్లో 209 రన్స్ చేసి జట్టును ముందుండి నడిపిస్తున్నారు.

News April 19, 2025

ఈనెల 23 నుంచి JEE అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్

image

జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈనెల 23న ప్రారంభం కానుంది. మే 2 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తొలుత <<16144953>>మెయిన్‌లో<<>> సాధించిన మార్కుల ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తారు. ఆ తర్వాత ర్యాంకులు, రిజర్వేషన్ల ఆధారంగా మొత్తం 2.50 లక్షల మందికి అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ పరీక్ష మే 18న జరగనుంది. జూన్ 2న ఫలితాలు వెలువడుతాయి.

News April 19, 2025

రాష్ట్రంలో ఎక్కడా బర్డ్ ఫ్లూ లేదు: పశు సంవర్ధక శాఖ

image

AP: రాష్ట్రంలో ఎక్కడా బర్డ్ ఫ్లూ లేదని పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ టి.దామోదరనాయుడు తెలిపారు. ఈ మేరకు భోపాల్‌లోని జాతీయ అత్యున్నత భద్రతా జంతు వ్యాధుల సంస్థ నిర్ధారించిందన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో పెద్ద ఎత్తున కోళ్ల మరణాలు సంభవించగా శాంపిల్స్ భోపాల్ పంపించి టెస్ట్ చేయించినట్లు వివరించారు. పల్నాడులో బర్డ్ ఫ్లూతో చిన్నారి మృతిచెందిన ప్రాంతంలో 70మంది శాంపిల్స్ పరీక్షించగా నెగటివ్ వచ్చిందని చెప్పారు.

News April 19, 2025

బైడెన్ US చరిత్రలోనే వరస్ట్ ప్రెసిడెంట్: ట్రంప్

image

బైడెన్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ ట్రంప్ వివాదాస్పద పోస్ట్ చేశారు. ఓపెన్ బోర్డర్‌ రూపంలో బైడెన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షల మంది క్రిమినల్స్‌ను అమెరికాలోకి రానిచ్చారని ఆరోపించారు. వారిలో హంతకులు, డ్రగ్ డీలర్స్, పిచ్చాస్పత్రుల నుంచి వచ్చిన వారే అధికంగా ఉన్నారన్నారు. వారిని దేశం నుంచి వెళ్లగొట్టడమే తన పని అని, అందుకే తనని ఎన్నుకున్నారని తెలిపారు. బైడెన్ US చరిత్రలోనే వరస్ట్ ప్రెసిడెంట్ అని ఫైరయ్యారు.

News April 19, 2025

ALERT: నేడు భారీ వర్షాలు

image

AP: నేడు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, తూర్పుగోదావరి, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.

News April 19, 2025

నేడు జీవీఎంసీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం

image

AP: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్(GVMC) మేయర్ జి. హరి వెంకట కుమారిపై నేడు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు. ఈ మేరకు ఇన్‌ఛార్జ్ కమిషనర్, కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధ్యక్షతన ఉ.11కు కౌన్సిల్ సమావేశం కానుంది. మేయర్ పీఠం దక్కించుకునేందుకు తమ వద్ద 74మంది కార్పొరేటర్లు ఉన్నారని కూటమి నేతలు ధీమాగా ఉండగా, విప్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని YCP తమ కార్పొరేటర్లను హెచ్చరించింది.

News April 19, 2025

నేటి నుంచి GMAT స్పెషల్ క్లాసులు

image

TG: గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్(GMAT) వచ్చే నెలలో జరగనుంది. పరీక్ష రాసే అభ్యర్థుల్లో నైపుణ్యాలను పెంచేందుకు నేటి నుంచి స్పెషల్ క్లాసులు నిర్వహించనున్నట్లు టీశాట్ CEO వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. రోజూ ఉ.8-8.30 వరకు నిపుణ ఛానల్‌లో, సాయంత్రం 6-6.30 వరకు విద్య ఛానల్లో క్లాసులు ప్రసారం చేస్తామని వెల్లడించారు. APRIL 22న ‘వరల్డ్ ఎర్త్ డే’ సందర్భంగా ఉ.11కు ప్రత్యేక లైవ్ పోగ్రామ్ ఉంటుందన్నారు.

News April 19, 2025

నేడు ఐపీఎల్‌లో డబుల్ ధమాకా

image

IPLలో ఇవాళ 2 మ్యాచ్‌లు జరగనున్నాయి. మ.3.30కు అహ్మదాబాద్ వేదికగా టైటాన్స్‌తో ఢిల్లీ తలపడనుంది. ఇప్పటి వరకూ ఈ రెండింటి మధ్య 5 మ్యాచులు జరగ్గా DC 3, GT 2 సార్లు గెలిచాయి. అలాగే, రాత్రి 7.30కు జైపూర్‌లో రాజస్థాన్, లక్నో బరిలోకి దిగనున్నాయి. ఈ టీమ్స్ గతంలో ఐదుసార్లు తలపడితే రాజస్థాన్‌(4)దే పైచేయిగా నిలిచింది. పక్కటెముకల గాయంతో బాధపడుతున్న RR కెప్టెన్ శాంసన్ ఈ మ్యాచ్ ఆడటంపై సందిగ్ధం నెలకొంది.

News April 19, 2025

మే 2న కేదార్‌నాథ్, 4న బద్రీనాథ్ ఆలయాలు ఓపెన్

image

చార్‌ధామ్ యాత్రలో ముఖ్యమైన కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రాన్ని మే 2న తెరవనున్నట్లు బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ అధికార ప్రతినిధి తెలిపారు. అలాగే, మే 4న బద్రీనాథ్ ఆలయాన్ని ఓపెన్ చేస్తామన్నారు. వీటితో పాటు రెండో కేదార్‌గా పిలవబడే మద్‌మహేశ్వర ఆలయాన్ని మే 21న, మూడో కేదార్ తుంగ గుడిని మే 2న తెరుస్తామని వివరించారు. విపరీతమైన మంచు వల్ల వేసవిలో కొన్ని రోజుల పాటే ఈ ఆలయాలు తెరిచి ఉంటాయి.

News April 19, 2025

RBI వద్ద 879 టన్నుల పసిడి నిల్వలు

image

ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి RBI వద్ద 879 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. దీని విలువ రూ.6.83 లక్షల కోట్లు అని అంచనా. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తల నేపథ్యంలో పసిడి నిల్వలు పెంచుకునేందుకు RBI ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా 2024లో ఏకంగా 72.6 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులన్నీ పసిడి నిల్వలు పెంచుకుంటున్న క్రమంలో RBI కూడా అదే కోవలో పయనిస్తోంది.