India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మామిడి పూమొగ్గ, లేత పూత దశలో తేనే మంచు పురుగు, బూడిద తెగులు ఆశించి నష్టపరుస్తాయి. వీటి నివారణకు పూత ప్రారంభదశలో మొగ్గలుగా ఉన్నపుడే నివారణ చర్యలు చేపట్టాలి. లీటరు నీటికి ఇమిడాక్లోప్రిడ్ 0.5ml లేదా బ్యూప్రొపెజిన్ 2ml మందులలో ఒకదానితో పాటు లీటరు నీటికి వెట్టబుల్ సల్ఫర్ 3గ్రా. లేదా లీటరు నీటికి మైక్లోబుటానిల్ 1గ్రా. మరియు బోరాన్ లీటరు నీటికి 1గ్రా. లేదా 2గ్రా. కలిపి స్ప్రే చేసి చీడలను నివారించవచ్చు.

కురుక్షేత్రం ముగిశాక అంపశయ్యపై భీష్ముడు తన విశిష్టతను చాటుకున్నాడు. తనను దర్శించడానికి వచ్చిన ధర్మరాజుకు రాజనీతి సూత్రాలు, జీవన ధర్మాలు బోధించాడు. కృష్ణుడిని స్తుతిస్తూ పవిత్ర ‘విష్ణు సహస్రనామ స్తోత్రం’ లోకానికి అందించాడు. తన తండ్రికి ఇచ్చిన మాట కోసం జీవితాంతం బ్రహ్మచారిగా ఉండి, మరణ సమయాన్ని సైతం తన ఆధీనంలో ఉంచుకున్న ఈ వృద్ధ పితామహుడు ధర్మ స్థాపన కోసం తన జ్ఞానాన్ని పాండవులకు ధారపోసి ధన్యుడయ్యడు.

TG: మున్సిపల్ ఎలక్షన్స్ <<18974641>>షెడ్యూల్<<>> విడుదలైన విషయం తెలిసిందే. 2,996 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో రిజర్వేషన్ల వారీగా వార్డుల కేటాయింపు చూస్తే.. BCలకు 854(28.5%), SCలకు 444(14.8%), STలకు 187(6.24%), జనరల్ 1,511(50.4%)గా ఉన్నాయి. FEB 11న 8,203 పోలింగ్ స్టేషన్స్లో 16,031 బ్యాలెట్ బాక్సులతో ఎన్నికలు నిర్వహించనున్నారు. 13న 136 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

యురోపియన్ యూనియన్ కరెన్సీని ‘యూరో’గా పిలుస్తారు. దీని సింబల్ ‘€’. యూరోతో రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ.109.3గా ఉంది. ఒక్క యూరో 1.187 అమెరికన్ డాలర్లు, 0.867 UK పౌండ్లతో సమానం. మొత్తం 21 EU దేశాలు ఈ కరెన్సీని వినియోగిస్తున్నాయి. ఇటీవల బల్గేరియా దేశం యూరోను తన జాతీయ కరెన్సీగా స్వీకరించి ఈ లిస్టులో చేరింది. కాగా భారత్, ఈయూ మధ్య నిన్న ఫ్రీ ట్రేడ్ <<18973548>>అగ్రిమెంట్<<>> జరిగిన సంగతి తెలిసిందే.

వరి నారుమడి దశలో కాండం తొలిచే పురుగును గుర్తిస్తే నారుమడిలో కార్బోఫ్యూరాన్ 3సిజి గుళికలు లేదా 600 గ్రా. ఫిప్రోనిల్ 0.3జి గుళికలు వేయాలి. ఒకవేళ నారుమడిలో వేయకపోతే 15 రోజుల వయసున్న, పిలకదశలో ఉన్న వరిపైరులో తప్పకుండా ఎకరాకు కార్బోఫ్యూరాన్ 3సిజి గుళికలు 10KGలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు 8KGలు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.4G గుళికలు 4kgలను 20-25 కిలోల ఇసుకలో కలిపి బురద పదునులో వేయాలి.

మిరపలో నల్ల తామర పురుగుల తీవ్రతను బట్టి ఎకరానికి 25కు పైగా నీలి రంగు జిగురు అట్టలను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే బవేరియా బస్సియానా 5 గ్రాములు లేదా స్పైనటోరం 0.9ml మందును లేదా ఫిప్రోనిల్ 5% ఎస్.సి 2ML లేదా స్పైనోసాడ్ 45% ఎస్.సి 0.3MLలలో ఏదో ఒకదానిని లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తామర పురుగు ఉద్ధృతిని బట్టి ఈ మందులను మార్చిమార్చి పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

AP: జల్జీవన్ మిషన్ కింద రాష్ట్రానికి భారీగా నిధులు రానున్నాయి. గతంలో ఆగిపోయిన సుమారు రూ.23 వేల కోట్ల పనులకు కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇందులో కేంద్ర వాటాగా రూ.13 వేల కోట్లు విడుదల కానున్నాయి. 2027 నాటికి ప్రతి ఇంటికీ సురక్షిత కుళాయి నీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. CM చంద్రబాబు, Dy.CM పవన్ కళ్యాణ్ కేంద్రంతో చర్చలు జరపడంతో నిధుల విడుదలకు లైన్ క్లియరైంది.

వయసు పెరిగే కొద్దీ చర్మంపై మచ్చలు ముడతలు వస్తుంటాయి. వీటిని తొలగించడంలో ఎగ్ ఫేస్ ప్యాక్ ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. ఒక ఎగ్ వైట్, కలబంద గుజ్జు, పంచదార పొడి బాగా కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగేసుకుంటే సరిపోతుంది. ఇలా తరచూ చేస్తుంటే ముఖం అందంగా మెరిసిపోతుంది.

మొక్కజొన్న విత్తిన వెంటనే ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలను అమర్చి కత్తెర పురుగు ఉనికిని గమనించాలి. మొక్కలపై వాటి గుడ్లను గమనిస్తే వేపమందును పిచికారీ చేయాలి. లేత మొక్కజొన్న పంటల్లో 30 రోజుల వరకు ఎకరాకు 15 పక్షి స్థావరాలను, 15 లింగాకర్షక బుట్టలను పైరులో ఏర్పాటు చేసుకోవాలి. ఎకరాకు 9 కిలోల పొడి ఇసుక, కిలో సున్నాన్ని కలిపి మొక్కజొన్న సుడులలో వేస్తే ఇసుక రాపిడికి కత్తెర పురుగు లార్వాలు చనిపోతాయి.

AP: కొన్ని నెలలుగా ధరలు లేక ఇబ్బందులు పడుతున్న కొబ్బరి రైతులకు ఊరట కలుగుతోంది. TGలో మేడారం జాతర, వరుస శుభకార్యాల ప్రభావంతో ఒక్కసారిగా రేట్లు పెరిగాయి. వారం కిందటి వరకు వెయ్యి కాయల ధర రూ.15-16వేలు ఉండగా ఇప్పుడు రూ.19-20 వేలకు చేరింది. ఉభయగోదావరి జిల్లాల నుంచి రోజూ 70 లారీల సరకు ఎగుమతి అవుతోంది. ఇక కురిడీ కొబ్బరిలో పెద్ద రకం రూ.32,500, చిన్నకాయ రూ.29వేల వరకు పలుకుతోంది.
Sorry, no posts matched your criteria.