news

News September 6, 2025

కాసేపట్లో KCRతో హరీశ్‌రావు భేటీ!

image

TG: BRS నేత, మాజీమంత్రి హరీశ్ రావు లండన్ నుంచి హైదరాబాద్ వచ్చేశారు. కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మాజీ సీఎం KCRతో హరీశ్ రావు భేటీ కానున్నారు. కవిత ఆరోపణలపై ఆయన కేసీఆర్‌తో చర్చించే అవకాశముంది. కవితను సస్పెండ్ చేయడంతో పార్టీ హరీశ్‌రావు వైపే ఉందని కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. కవిత, విపక్షాల విమర్శలు, కాళేశ్వరం నివేదిక అంశంపైనా వీరి మధ్య చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.

News September 6, 2025

ఇక IT ఎగుమతులపైనా US టారిఫ్స్?

image

భారత వస్తువులపై 50% టారిఫ్స్ వేస్తున్న US త్వరలో IT సేవలపైనా ట్యాక్స్ విధించొచ్చని తెలుస్తోంది. INDలోని చాలా IT కంపెనీలు USకు ఔట్‌సోర్సింగ్‌ సేవలందిస్తున్నాయి. వస్తువుల్లాగే లాగే సేవలపైనా TAX చెల్లించాలని US మాజీ నేవీ ఆఫీసర్ ట్వీట్ చేశారు. దీన్ని ట్రంప్ అడ్వైజర్ నవరో రీపోస్ట్ చేయడంతో భారత IT కంపెనీల్లో ఆందోళన మొదలైంది. దీనిని అమెరికన్ టెక్ వర్కర్స్ స్వాగతిస్తుండగా ఇండియన్ టెకీస్ ఖండిస్తున్నారు.

News September 6, 2025

ట్రంప్ వ్యాఖ్యలను అభినందిస్తున్నా: మోదీ

image

మోదీ తనకు మిత్రుడని, భారత్‌తో అమెరికాకు <<17626556>>ప్రత్యేక అనుబంధం<<>> ఉందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందించారు. ‘ఇరు దేశాల బంధాలు, సెంటిమెంట్లపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలను అభినందిస్తున్నా. ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు భారత్, అమెరికా చాలా సానుకూల దృక్పథంతో ఉన్నాయి’ అని మోదీ ట్వీట్ చేశారు.

News September 6, 2025

తురకపాలెం ప్రజలు వంట చేసుకోవద్దు: సీఎం

image

AP: గుంటూరు <<17604174>>తురకపాలెం<<>>లో వరుస మరణాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. గ్రామస్థులెవరూ వంట చేసుకోవద్దని, అక్కడి తాగు నీటిని వినియోగించొద్దని సూచించారు. అక్కడి ప్రజలకు అధికారులే ఆహారం సరఫరా చేయాలని ఆదేశించారు. దీంతో ఇవాళ్టి నుంచే తురకపాలెం గ్రామస్థులకు మూడు పూటలా ఆహారం, మంచినీళ్లు సరఫరా చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు వైద్యులు మరణాలకు గల కారణాలు కనుగొనే పనిలో పడ్డారు.

News September 6, 2025

BREAKING: మోదీ అమెరికా పర్యటన రద్దు

image

న్యూయార్క్‌(US)లో ఈనెల 23 నుంచి 29 వరకు జరగనున్న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ హైలెవెల్ డిబేట్‌కు PM మోదీ హాజరుకావడం లేదు. ఇటీవల విడుదల చేసిన వివిధ దేశాధినేతల స్పీచ్ షెడ్యూల్ ప్రకారం ఈనెల 26న మోదీ UN జనరల్ అసెంబ్లీలో ప్రసంగించాల్సి ఉంది. కానీ తాజాగా షెడ్యూల్ రివైజ్ అయింది. PM స్థానంలో విదేశాంగ మంత్రి జైశంకర్ ఈనెల 27న స్పీచ్ ఇవ్వనున్నారు. పర్యటన రద్దుకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News September 6, 2025

వెనిజులపై యుద్ధానికి సిద్ధమైన అమెరికా!

image

US-వెనిజుల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. వెనిజుల అధ్యక్షుడు మదురోను పదవి నుంచి దించేయాలని ప్లాన్ చేస్తున్న ట్రంప్.. 10 F-35 ఫైటర్ల జెట్లను సరిహద్దుల్లో మోహరించారు. ఆ దేశంలోని డ్రగ్స్ కార్టెల్స్‌పై మిలిటరీ స్ట్రైక్స్ చేయాలని భావిస్తున్నారు. తమ దేశంలోకి <<17597311>>డ్రగ్స్<<>> వచ్చేందుకు మదురోనే కారణమని US ఆరోపిస్తోంది. అయితే వెనిజుల చమురు సంపదను దోచుకునేందుకే యూఎస్ ఈ కుట్రలకు పాల్పడుతోందనే ఆరోపణలున్నాయి.

News September 6, 2025

టెస్లా కారు కొన్న మంత్రి.. ‘స్వదేశీ’ ఏమైంది?

image

భారత్‌లో తొలి టెస్లా Y మోడల్ కారును మహారాష్ట్ర మంత్రి ప్రతాప్ <<17619296>>కొనుగోలు<<>> చేసిన విషయం తెలిసిందే. దీనిపై నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. స్వదేశీ వస్తువులు కొనుగోలు చేయాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చిన విషయం గుర్తు లేదా అని ప్రశ్నిస్తున్నారు. మంత్రులే ప్రధాని మాటను లెక్కచేయకపోతే ఎలా అని నిలదీస్తున్నారు. టాటా, మహీంద్రా లాంటి కంపెనీలు కనబడట్లేదా అని ఫైరవుతున్నారు. దీనిపై మీ కామెంట్?

News September 6, 2025

SIIMA: ప్రభాస్ మూవీకి ‘బెస్ట్ ఫిల్మ్’ అవార్డ్

image

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సైఫై థ్రిల్లర్ ‘కల్కి 2898 AD’ని SIIMA బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ వరించింది. ప్రొడ్యూసర్ ప్రియాంకా దత్ పురస్కారాన్ని స్వీకరించారు. బెస్ట్ సపోర్టింగ్ రోల్(మేల్, ఫీమేల్), బెస్ట్ నెగటివ్ రోల్ అవార్డులను కూడా ఈ మూవీ సొంతం చేసుకుంది. ఓవరాల్‌గా ‘కల్కి 2898 AD’కి 4, <<17626582>>పుష్ప-2కు<<>> 4, దేవరకు 3, హనుమాన్‌, కమిటీ కుర్రోళ్లు చిత్రాలకు 2 చొప్పున అవార్డ్స్ వచ్చాయి.

News September 6, 2025

తిరుమల: దర్శనానికి 24 గంటలు

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు శిలా తోరణం వరకు క్యూలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 69,531 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,439 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3.49 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ వెల్లడించింది.

News September 6, 2025

రిచ్‌మండ్ విల్లాస్ ‘గణేశ్ లడ్డూ’ చరిత్ర

image

TG: HYD బండ్లగూడ కీర్తి <<17626437>>రిచ్‌మండ్<<>> విల్లాస్‌లో గణేశ్ లడ్డూ రూ.2.32కోట్ల భారీ ధర పలికిన విషయం తెలిసిందే. 80 విల్లాల ఓనర్స్ 4 గ్రూపులుగా ఏర్పడి బిడ్ తరహా వేలంలో పాల్గొంటారు. ఆక్షన్‌లో వచ్చిన మొత్తాన్ని RV దియా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా 42 NGOలకు ఆర్థికసాయం చేస్తారు. వృద్ధాశ్రమాలు, స్త్రీ సంక్షేమం, జంతు సంరక్షణకు వినియోగిస్తారు. 2018లో రూ.25 వేలతో మొదలైన ఈ లడ్డూ వేలం ఇప్పుడు రూ.2.32 కోట్లకు చేరింది.