India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారత్లో తొలి టెస్లా Y మోడల్ కారును మహారాష్ట్ర మంత్రి ప్రతాప్ <<17619296>>కొనుగోలు<<>> చేసిన విషయం తెలిసిందే. దీనిపై నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. స్వదేశీ వస్తువులు కొనుగోలు చేయాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చిన విషయం గుర్తు లేదా అని ప్రశ్నిస్తున్నారు. మంత్రులే ప్రధాని మాటను లెక్కచేయకపోతే ఎలా అని నిలదీస్తున్నారు. టాటా, మహీంద్రా లాంటి కంపెనీలు కనబడట్లేదా అని ఫైరవుతున్నారు. దీనిపై మీ కామెంట్?
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సైఫై థ్రిల్లర్ ‘కల్కి 2898 AD’ని SIIMA బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ వరించింది. ప్రొడ్యూసర్ ప్రియాంకా దత్ పురస్కారాన్ని స్వీకరించారు. బెస్ట్ సపోర్టింగ్ రోల్(మేల్, ఫీమేల్), బెస్ట్ నెగటివ్ రోల్ అవార్డులను కూడా ఈ మూవీ సొంతం చేసుకుంది. ఓవరాల్గా ‘కల్కి 2898 AD’కి 4, <<17626582>>పుష్ప-2కు<<>> 4, దేవరకు 3, హనుమాన్, కమిటీ కుర్రోళ్లు చిత్రాలకు 2 చొప్పున అవార్డ్స్ వచ్చాయి.
AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు శిలా తోరణం వరకు క్యూలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 69,531 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,439 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3.49 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ వెల్లడించింది.
TG: HYD బండ్లగూడ కీర్తి <<17626437>>రిచ్మండ్<<>> విల్లాస్లో గణేశ్ లడ్డూ రూ.2.32కోట్ల భారీ ధర పలికిన విషయం తెలిసిందే. 80 విల్లాల ఓనర్స్ 4 గ్రూపులుగా ఏర్పడి బిడ్ తరహా వేలంలో పాల్గొంటారు. ఆక్షన్లో వచ్చిన మొత్తాన్ని RV దియా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా 42 NGOలకు ఆర్థికసాయం చేస్తారు. వృద్ధాశ్రమాలు, స్త్రీ సంక్షేమం, జంతు సంరక్షణకు వినియోగిస్తారు. 2018లో రూ.25 వేలతో మొదలైన ఈ లడ్డూ వేలం ఇప్పుడు రూ.2.32 కోట్లకు చేరింది.
ప్రకృతి ప్రకోపంతో వేలాది ప్రాణాలు పోతుంటే మత ఆచారం పేరుతో సాయం చేయలేని దుస్థితి. అఫ్గానిస్థాన్లో వరుస భూకంపాలతో దాదాపు 2,200 మంది మరణించిన విషయం తెలిసిందే. సంబంధం లేని మహిళలను తాకొద్దన్న తాలిబన్ల రూల్ వారి పాలిట మరణ శాసనమైంది. శిథిలాల కింద చిక్కుకుని ఆర్తనాదాలు చేస్తున్నా పురుష రెస్క్యూ సిబ్బంది చేయందించలేదు. మృతుల సంఖ్య పెరగడానికి ఈ విపరీత ఆచారమూ ఓ కారణం. ప్రాణం కన్నా ఆచారమే ముఖ్యమా? COMMENT
GST 2.0 ప్రభుత్వానికి కచ్చితంగా భారం కాకమానదు. కేంద్రం అంచనాల ప్రకారం ఏడాదికి నికర ఆర్థిక ప్రభావం రూ.48 వేల కోట్లుగా ఉంది. కానీ వినియోగం, వృద్ధిని లెక్కలోకి తీసుకుంటే GST 2.0తో కేంద్రానికి కనీసం రూ.3,700 కోట్లు నష్టముంటుందని SBI అంచనా వేసింది. ఇది ఆర్థిక లోటుపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదని స్పష్టం చేసింది. 2026-27లో ద్రవ్యోల్బణం 65-75 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశమున్నట్లు పేర్కొంది.
బంగాళాఖాతంలో ఈనెల 13న మరోసారి అల్పపీడనం ఏర్పడే అవకాశముందని IMD తెలిపింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ నెలాఖరు వరకు భారీ వర్షాలు కురవొచ్చని వెల్లడించింది. మరోవైపు 4 రోజులపాటు APలోని పలు చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశముందని వాతావరణ విభాగం అంచనా వేసింది. కాగా 2 రోజుల క్రితం వరకు తీవ్ర అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.
మారుతి సుజుకీ బ్రెజా కారు ధర ప్రస్తుతం రూ.8.69 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. మొత్తం 45% పన్ను (28% GST+17% CESS) పడుతోంది. కొత్త జీఎస్టీ ప్రకారం 40% ట్యాక్స్ వేయనున్నారు. సెస్ లేకపోవడంతో రూ.30వేల వరకు ఆదా కానున్నాయి. నెక్సాన్ (పెట్రోల్) కారుపై రూ.68వేల నుంచి రూ.1.26 లక్షలు, వ్యాగన్ Rపై రూ.64వేల-రూ.84వేలు, స్విఫ్ట్పై రూ.71వేల-రూ.1.06 లక్షలు, i20పై రూ.83వేల-రూ.1.24 లక్షల వరకు సేవ్ కానున్నాయి.
గుడ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ తొలిస్థానంలో ఉందని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు తెలిపారు. గొర్రెలు, కోళ్ల ఉత్పత్తిలో 2వ స్థానం, మాంస ఉత్పత్తిలో 4, పాల ఉత్పత్తిలో 5, గేదెల ఉత్పత్తిలో 6వ స్థానంలో నిలిచిందన్నారు. పశుదాణా, పశుగ్రాస విత్తనాలు, గోకులాల నిర్మాణాలకు సబ్సిడీలో ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 25 లక్షల కుటుంబాలు పశుసంవర్ధక రంగంతో ఉపాధి పొందుతున్నాయని వివరించారు.
మాజీ సైనికాధికారి KJN ధిల్లాన్ రచించిన ‘ఆపరేషన్ సిందూర్: ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ డీప్ స్ట్రైక్స్ ఇన్సైడ్ పాకిస్థాన్’ బుక్ను ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘మే 10న వార్ ముగిసిందని మీరు అనుకోవచ్చు. కానీ అనేక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నందున ఆ తర్వాత కూడా కొనసాగింది. యూనిఫామ్లో ఉండి చెప్పలేని అంశాలను ఈ బుక్లో కవర్ చేశారు’ అని వ్యాఖ్యానించారు.
Sorry, no posts matched your criteria.