news

News September 6, 2025

రూ.217 కోట్ల నిధులు రిలీజ్

image

AP: విలేజ్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణం, పెండింగ్ పనుల పూర్తికి కేంద్రం మంజూరు చేసిన ₹217కోట్ల నిధులకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులిచ్చింది. ఈ మేరకు నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా వచ్చిన నిధులను విడుదల చేసింది. ఉపాధిహామీ కింద నిర్మిస్తున్న 2,309 భవనాల పూర్తికి, PM-ABHIM కింద 696 విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించింది. ఒక్కో భవనానికి ₹55లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది.

News September 6, 2025

వరద ప్రభావిత రాష్ట్రాల్లో PM మోదీ పర్యటన?

image

ఇటీవల భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలో షెడ్యూల్ ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. ఈ వర్షాకాలంలో హిమాచల్‌ప్రదేశ్, J&K, పంజాబ్, హరియాణా, ఉత్తరాఖండ్, ఢిల్లీలో వరదలు బీభత్సం సృష్టించాయి. సుమారు 500మంది ప్రాణాలు కోల్పోయారు. రూ.వేల కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. ఆయా ప్రాంతాలను ప్రధాని పరిశీలించి, నష్టంపై సమీక్షిస్తారని సమాచారం.

News September 6, 2025

బీసీ సంక్షేమశాఖకు స్కోచ్ అవార్డ్

image

AP: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖను ప్రతిష్ఠాత్మక స్కోచ్ అవార్డు వరించింది. పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే BC నిరుద్యోగులకు ఉచిత శిక్షణ అందించినందుకుగానూ ఈ పురస్కారం దక్కింది. ఈ నెల 20న ఢిల్లీలో ఈ అవార్డును మంత్రి సవిత అందుకోనున్నారు. కాగా రాష్ట్రంలో BC స్టడీ సర్కిళ్ల ద్వారా సివిల్స్, టీచర్స్, రైల్వే వంటి వివిధ ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులకు శిక్షణ అందించారు.

News September 6, 2025

అమెరికాకు భారత్ తలవంచుతుంది: ట్రంప్ సలహాదారు

image

ట్రంప్ సలహాదారు హోవర్డ్ లుత్నిక్ భారత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. టారిఫ్‌ వ్యవహారంలో అగ్రరాజ్యం ముందు ఇండియా తలవంచుతుందన్నారు. అమెరికాకు ‘సారీ’ చెప్పి అధ్యక్షుడు ట్రంప్‌తో డీల్ కుదుర్చుకుంటుందని అహంకారపూరిత కామెంట్స్ చేశారు. US మార్కెట్ లేకుండా IND ఆర్థికంగా వృద్ధి చెందలేదన్నారు. ‘ఒకటి, రెండు నెలల్లో USతో చర్చలకు భారత్ దిగొస్తుంది. మోదీతో ఎలా డీల్ చేసుకోవాలో ట్రంప్‌కు తెలుసు’ అని హోవర్డ్ అన్నారు.

News September 6, 2025

కాళేశ్వరంపై ప్రధానిని కలుస్తాం: మంత్రి కోమటిరెడ్డి

image

TG: కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ వేగవంతం చేసేందుకు సీఎంతో కలిసి ప్రధానిని కలుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. త్వరలో ప్రధాని అపాయింట్‌మెంట్ ఖరారవుతుందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎంగా మారిందని బీజేపీ అగ్రనేతలు కూడా విమర్శించారని గుర్తుచేశారు. సీబీఐ విచారణకు కేంద్రం సహకరించాలని ఆయన కోరారు.

News September 5, 2025

ప్రధాని మోదీకి డైరెక్టర్ నాగ్ అశ్విన్ రిక్వెస్ట్

image

సినిమా టికెట్లకు విధించే GSTపై ప్రధాని మోదీకి డైరెక్టర్ నాగ్ అశ్విన్ రిక్వెస్ట్ చేశారు. ‘జీఎస్టీ సంస్కరణలను స్వాగతిస్తున్నా. 5 శాతం జీఎస్టీని రూ.100 టికెట్లలోపు కాకుండా రూ.250 టికెట్లకు పెడితే మరింత మేలు జరుగుతుంది. ఇది మధ్య తరగతి ప్రజలు థియేటర్లకు వచ్చేందుకు ఎంతో సహకరిస్తుంది’ అని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా రూ.100 టికెట్లపై 12 శాతం GSTని తొలగించి 5 శాతం జీఎస్టీని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

News September 5, 2025

రష్యా ఆయిల్ కొనుగోలు చేస్తూనే ఉంటాం: నిర్మల

image

దేశ అవసరాలకు తగ్గట్టు రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేస్తూనే ఉంటుందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. భారత్ తన సొంత ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తుందని ఆమె స్పష్టం చేశారు. చమురును ఎక్కడి నుంచి కొనుగోలు చేయాలనే నిర్ణయం మనదే అని వివరించారు. అమెరికా అధిక టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో ఎగుమతిదారులకు ఉపశమనం కలిగేలా త్వరలో ప్యాకేజీ ప్రకటిస్తామని చెప్పారు.

News September 5, 2025

GST ఎఫెక్ట్.. టాటా కార్ల ధరలు తగ్గాయ్

image

GST తగ్గించిన నేపథ్యంలో SEP 22 నుంచి కార్ల ధరలను సవరిస్తున్నట్లు టాటా ప్రకటించింది. చిన్నకార్లపై రూ.75వేల వరకు, పెద్ద కార్లపై రూ.1.45లక్షల వరకు తగ్గింపు ఉండనుంది.
☛ చిన్నకార్లు: * టియాగో-రూ.75వేలు, * టిగోర్-రూ.80వేలు, * అల్ట్రోజ్-రూ.1.10లక్షలు
☛ కాంపాక్ట్ SUVలు: * పంచ్-రూ.85వేలు, * నెక్సాన్-రూ.1.55లక్షలు
☛ మిడ్ సైజ్ మోడల్: * కర్వ్-రూ.65వేలు
☛ SUVలు: * హారియర్-రూ.1.40లక్షలు, * సఫారీ-రూ.1.45లక్షలు

News September 5, 2025

నేను నిత్య విద్యార్థిని: చంద్రబాబు

image

AP: తల్లిదండ్రుల తర్వాత మనం గుర్తు పెట్టుకునేది ఉపాధ్యాయులనే అని CM చంద్రబాబు అన్నారు. ‘నేను కూడా టీచర్ కావాల్సింది. SVUలో లెక్చరర్‌గా చేరాలని వర్సిటీ వీసీ కోరితే MLA అవుతానని చెప్పా. భక్తవత్సలం అనే ఉపాధ్యాయుడు నా జీవితంలో స్ఫూర్తి నింపారు. నేను నిత్య విద్యార్థిని. ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటా. లోకేశ్ చదువు గురించి నా భార్యే చూసేది. ఆ క్రెడిట్ ఆవిడదే’ అని తెలిపారు.

News September 5, 2025

ప్రముఖ నటుడు ఆశిష్ వారంగ్ కన్నుమూత

image

ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆశిష్ వారంగ్ (55) ఇవాళ ముంబైలో కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఆయన మరణించినట్లు తెలుస్తోంది. సూర్యవంశీ, దృశ్యం, మర్దానీ వంటి చిత్రాల్లో సహాయ పాత్రలతో ఆశిష్ గుర్తింపు పొందారు. హిందీతో పాటు మరాఠీ, దక్షిణాది చిత్రాల్లోనూ నటించారు. ఆశిష్ మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.