India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జాతీయ గీతం ‘జన గణ మన’కు వర్తించే గౌరవ ప్రొటోకాల్ను జాతీయ గేయం వందేమాతరానికీ వర్తింపజేసే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. దీనిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట. అదే జరిగితే జన గణ మన పాడేటప్పుడు నిలబడినట్లుగానే వందేమాతరం ఆలపించేటప్పుడూ నిలబడాల్సి ఉంటుంది. ప్రొటోకాల్ను వందేమాతరానికీ వర్తింపజేయాలన్న డిమాండ్ చాలాకాలం నుంచి ఉంది. దీనిపై సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి.

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో ‘స్పిరిట్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్కు ఫాదర్ రోల్లో ఆయన కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. 15 నిమిషాల పాటు కనిపించే పాత్రకు ఆయన ఓకే చెప్పారని టాక్. అయితే ఈ విషయమై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ‘స్పిరిట్’ వచ్చే ఏడాది థియేటర్లలో రిలీజ్ కానుంది.

క్యాన్సర్ వైద్యంలో విప్లవం సృష్టించిన తెలుగు డాక్టర్ నోరి దత్తాత్రేయుడిని కేంద్రం పద్మభూషణ్తో సత్కరించింది. ఆయన అభివృద్ధి చేసిన ‘హై డోస్ రేట్ బ్రాకీథెరపీ’ విధానం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు కాపాడుతోంది. ఆరోగ్యకరమైన కణాలకు హాని చేయకుండా నేరుగా క్యాన్సర్ కణితిపైనే రేడియేషన్ వేయడం దీని ప్రత్యేకత. ముఖ్యంగా గర్భాశయ, ఊపిరితిత్తులు, మెడ భాగాల్లో వచ్చే క్యాన్సర్లకు ఈ చికిత్స వరంగా మారింది.

వేసవి పంట కోసం ఉల్లిని సాగు చేయాలనుకుంటే ఈ నెలలోనే సిద్ధమవ్వాలి. పంట కొరకు ముందుగా నారును పెంచుకోవాలి. నారుమడి కోసం నేలను దున్ని 4 మీటర్ల పొడవు, 1 మీటరు వెడల్పు, 15 సెంటీ మీటర్ల ఎత్తు గల 10 మళ్లను తయారు చేసుకోవాలి. ఒక కిలో విత్తనానికి కాప్టాన్ లేదా థైరమ్ను 3గ్రా. లేదా ట్రైకోడెర్మావిరిడె 4 గ్రాములు పట్టించి విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి.

భారత సంప్రదాయం ఉట్టిపడేలా యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సాధారణంగా ప్యాంటుసూట్స్లో కనిపించే ఆమె తాజాగా బనారసీ జాకెట్ను ధరించారు. గోల్డ్, మెరూన్ రంగులో ఉన్న ఈ దుస్తులు ఆకట్టుకుంటున్నాయి. 77వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఉర్సులా హాజరయ్యారు. ఈ వేడుకల్లో పాల్గొనడం తన జీవితంలో లభించిన అతిపెద్ద గౌరవం అని ట్వీట్ చేశారు.

AP: కర్నూలులో ఈనెల 9న నర్సు HIV ఇంజెక్షన్ ఇచ్చిన లేడీ డాక్టర్కు వైరస్ సోకే అవకాశం లేదని వైద్య నిపుణులు తెలిపారు. వసుంధర గతనెల 28న వైరస్ బ్లడ్ సేకరించి ఫ్రిజ్లో ఉంచడంతో అన్ని రోజులు వైరస్ బతకదన్నారు. కానీ రక్త గ్రూప్ తదితరాలతో ముప్పుపై అప్రమత్తత అవసరమని చెప్పారు. వసుంధర ప్రేమించిన డాక్టర్ మరో డాక్టర్ను పెళ్లి చేసుకోగా, అతడిని సొంతం చేసుకోవాలని యాక్సిడెంట్ చేయించి ఇంజెక్షన్ ఇవ్వడం తెలిసిందే.

భవిష్యత్తు ఆశతో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ భారతీయులు అధికంగా పట్టుబడుతున్నారు. ఆ దేశ సరిహద్దుల్లో 2025లో ప్రతి 20 నిమిషాలకో ఇండియన్ అరెస్టయ్యారు. గత ఏడాది 23,830 మంది భారతీయులను అదుపులోకి తీసుకున్నట్లు US కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్ వెల్లడించింది. 2024లో ఈ సంఖ్య 85,119గా ఉంది. గతేడాది వివిధ దేశాలకు చెందిన 3.91L మంది అరెస్టయ్యారు. కెనడా, మెక్సికో సరిహద్దుల్లో ఎక్కువ మంది పట్టుబడుతున్నారు.

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం <<18961013>>ధర<<>> ఉదయంతో పోల్చితే కాస్త తగ్గింది. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఉదయం రూ.1,62,710 ఉండగా రూ.760 తగ్గి రూ.1,61,950కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర ఉదయం నుంచి రూ.700 పతనమై రూ.1,48,450 పలుకుతోంది. అటు KG సిల్వర్ రేటు రూ.3,75,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.

చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ మూవీ నిన్నటి వరకు రూ.350 కోట్ల(గ్రాస్)కు పైగా వసూలు చేసింది. నిన్న జరిగిన ఈవెంట్లో మేకర్స్ స్పెషల్ పోస్టర్ వేశారు. ఈ సినిమా ఇప్పటికే అత్యధిక వసూళ్లు రాబట్టిన ప్రాంతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటించగా విక్టరీ వెంకటేశ్ స్పెషల్ రోల్ చేశారు.

గాయంతో NZతో జరిగిన తొలి 3 T20లకు దూరమైన తిలక్ చివరి 2 మ్యాచులూ ఆడట్లేదని BCCI తెలిపింది. అతని స్థానంలో శ్రేయస్ జట్టులో కంటిన్యూ అవుతారని వివరించింది. అయితే వచ్చే నెల ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ నాటికి తిలక్ పూర్తి ఫిట్నెస్ సాధిస్తారని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం నం.3లో ఇషాన్ ఆడుతుండగా, తిలక్ జట్టులో జాయిన్ అయితే ఆ స్థానంలో ఎవరు బరిలోకి దిగుతారనేది ఆసక్తికరంగా మారింది.
Sorry, no posts matched your criteria.