India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ప్రజల ఆస్తులను CM చంద్రబాబు తనవాళ్లకు పప్పుబెల్లాల్లా పంచుతున్నారని YCP చీఫ్ జగన్ ఆరోపించారు. ‘ప్రభుత్వ మెడికల్ కాలేజీలను స్కాంల కోసం ప్రైవేటుపరం చేస్తున్నారు. మా 5ఏళ్లలో 17కాలేజీల్లో 5చోట్ల క్లాసులు ప్రారంభమయ్యాయి. మిగతా పనులు మీరు బాధ్యతగా చేసి ఉంటే మరో 12 కాలేజీల్లోనూ క్లాసులు స్టార్ట్ అయ్యేవి. మేం అధికారంలోకి రాగానే ఈ కాలేజీలను తిరిగి ప్రభుత్వ రంగంలోకి తెచ్చుకుంటాం’ అని ట్వీట్ చేశారు.
AP: ఎంతో ఇష్టంతో తాను HYDను అభివృద్ధి చేశానని, దాని వల్లే TG నంబర్వన్గా నిలిచిందని CM చంద్రబాబు అన్నారు. అలాగే దేశంలో ఏపీని నంబర్వన్గా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడలో జరుగుతున్న టీచర్స్ డే కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. ‘ప్రపంచంలోనే తెలుగుజాతి నంబర్వన్గా నిలవాలి. రాబోయే 22 ఏళ్లపాటు మనమంతా దీనిపై దృష్టి సారిస్తే సాధ్యమే. విజన్ 2047 కోసం శ్రమిద్దాం’ అని ఆయన పిలుపునిచ్చారు.
TG: ధరణి పేరిట ధన, భూదాహంతో BRS ప్రభుత్వం భూములన్నీ చెరబట్టిందని CM రేవంత్ విమర్శించారు. తమ దుర్మార్గాలు ప్రజలకు తెలియకూడదనే VRO, VRAలను తొలగించారన్నారు. ఎన్నికల ముందు ఎవరిని కదిలించినా ధరణి గురించే చెప్పేవారని, అందుకే దాన్ని బంగాళాఖాతంలో పడేస్తామన్న హామీని నెరవేర్చినట్లు చెప్పారు. ధరణితో పట్టుకున్న దరిద్రాన్ని భూభారతితో తొలగిస్తున్నామని GPO నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో అన్నారు.
AP: ఇప్పుడున్న ఉపాధ్యాయుల్లో దాదాపు 80% మందిని CM చంద్రబాబే నియమించి ఉంటారని మంత్రి లోకేశ్ అన్నారు. ‘DSC అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే DSC. 13 DSCల ద్వారా 1.80లక్షల మంది టీచర్లను చంద్రబాబే నియమించారు. 70 కేసులు వేసినా డీఎస్సీ మాత్రం ఆగలేదు. గత ప్రభుత్వంలో విచిత్రమైన పాలన చూశాం. ఉపాధ్యాయులను వైన్ షాపుల ముందు కాపలా పెట్టారు. జీతాలు కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి’ అని లోకేశ్ ధ్వజమెత్తారు.
తమిళనాడులోకి గన్ కల్చర్ రాకుండా అడ్డుకునేందుకు హీరో చేసే పోరాటమే ‘మదరాసి’. యాక్షన్ సీన్లు, హీరోయిన్తో శివకార్తికేయన్ కెమిస్ట్రీ బాగుంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నతంగా ఉన్నాయి. ఫస్టాఫ్ పర్వాలేదనిపించినా సెకండాఫ్లో డైరెక్టర్ మురగదాస్ దారి తప్పారు. కథను కొత్తగా చెప్పడంలో సక్సెస్ కాలేకపోయారు. ఊహించే సీన్లు, సాగదీత విసుగు తెప్పిస్తాయి. అనిరుధ్ మ్యూజిక్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.
రేటింగ్: 2.25/5
AP: గుంటూరు తురకపాలెంలో వరుస మరణాలపై మరింత లోతుగా పరిశోధన చేయాలని CM చంద్రబాబు ఉన్నతాధికారులను ఆదేశించారు. శని, ఆదివారాల్లో అన్ని రకాల వైద్య పరీక్షలు జరిపి సోమవారం కల్లా ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలన్నారు. కొత్త కేసులు నమోదు కాకుండా స్థానిక ప్రజల్లో నమ్మకాన్ని పెంచాల్సిన బాధ్యత వైద్యాధికారులదేనని స్పష్టం చేశారు. హెల్త్ ఎమర్జెన్సీగా పరిగణించి చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
సామాన్యులపై భారం తగ్గేలా జీఎస్టీ 2.0 తీసుకొచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ India Todayతో అన్నారు. భవిష్యత్తులో జీఎస్టీ 3.0 కూడా ఉంటుందని హింట్ ఇచ్చారు. దాని ద్వారా ధరల్లో స్థిరత్వం, పారదర్శకత తీసుకురానున్నట్లు వెల్లడించారు. చిరు వ్యాపారుల్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ట్యాక్స్ల నిబంధనలు రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. వారిపై భారం పడకుండా చూస్తామని నిర్మల వెల్లడించారు.
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ రాస్ టేలర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. తన తల్లి పుట్టిన సమోవా దేశం తరఫున త్వరలో బరిలోకి దిగనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఆ దేశ పాస్పోర్ట్ కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా 41 ఏళ్ల టేలర్ కివీస్ తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 18 వేలకుపైగా పరుగులు సాధించారు. 2022లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగారు.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గొప్ప మనసు చాటుకున్నారు. పంజాబ్ వరద బాధితుల కోసం ఆయన రూ.5 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. దీనిని ప్రజా సేవగా భావిస్తున్నానని, విరాళం అనుకోనని ఆయన తెలిపారు. కాగా వరద బాధితులకు ఇప్పటికే ప్రీతి జింటా-రూ.33 లక్షల విరాళం ప్రకటించారు. మరోవైపు దిల్జిత్ దోసాంజ్, సోనమ్ బజ్వా, సంజయ్ దత్, సోనూ సూద్ తదితరులు పలు గ్రామాలను దత్తత తీసుకుంటామని వెల్లడించారు.
SA టీ20లో ప్రిటోరియా క్యాపిటల్స్ హెడ్ కోచ్గా భారత మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ నియమితులయ్యారు. లీగ్ కమిషనర్ గ్రేమీ స్మిత్ ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే సీజన్ వరకు దాదా ఆ జట్టుకు కోచ్గా వ్యవహరిస్తారు. ఈ లీగ్లో ప్రిటోరియా క్యాపిటల్స్ అంతగా ఆకట్టుకోలేదు. ఇప్పటివరకు ఆ జట్టు ఒక్క టైటిల్ కూడా కొట్టలేదు. ఒకే ఒక్కసారి రన్నరప్గా నిలిచింది. దాదా ఆధ్వర్యంలో ఈసారి కప్ సాధించాలని ప్రిటోరియా భావిస్తోంది.
Sorry, no posts matched your criteria.