news

News November 3, 2025

కరెంట్, రోడ్లు అడిగితే చనిపోతారని చెప్పేవాళ్లు: మోదీ

image

దశాబ్దాలపాటు బిహార్‌ను కష్టాల్లో ఉంచిందని ఆర్జేడీపై ప్రధాని మోదీ మండిపడ్డారు. ‘ఆ పార్టీకి అభివృద్ధి వ్యతిరేక చరిత్ర ఉంది. రోడ్లు నిర్మిస్తే ప్రమాదాలు జరుగుతాయని, కరెంటు సరఫరా చేస్తే షాక్‌కు గురై చనిపోతారని ప్రజలకు ఆర్జేడీ నాయకులు చెప్పేవాళ్లు’ అని విమర్శించారు. నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో సుపరిపాలన అందించామని, రాష్ట్రానికి వందే భారత్ రైళ్లు, రోడ్లు తీసుకొచ్చామని కటిహార్‌లో ఎన్నికల ప్రచారంలో అన్నారు.

News November 3, 2025

రూల్ బ్రేక్ చేస్తే ట్రిపుల్ పెనాల్టీ: మంత్రి పొన్నం

image

TG: ఇరుకు రోడ్డు కావడం, డివైడర్ లేకపోవడం వల్లే చేవెళ్ల బస్సు ప్రమాదం జరిగిందని మంత్రి పొన్నం తెలిపారు. రవాణా శాఖ అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ‘ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ద్వారా కఠినంగా వ్యవహరిస్తేనే యాక్సిడెంట్లను నియంత్రించవచ్చు. వాహనాల స్పీడ్ లాక్ ఎంత వరకు అమలవుతుందో చూడాలి. దాన్ని బ్రేక్ చేస్తే ట్రిపుల్ పెనాల్టీ వేయాలి. ఫిట్‌నెస్ పర్మిట్లపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి’ అని ఆదేశించారు.

News November 3, 2025

‘బాహుబలి-ది ఎపిక్’.. 3రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

image

అక్టోబర్ 31న విడుదలైన ‘బాహుబలి-ది ఎపిక్’ సినిమా 3 రోజుల్లో రూ.38.9 కోట్లు కలెక్ట్ చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇందులో ఇండియాలోనే రూ.27.9Cr వచ్చినట్లు పేర్కొన్నాయి. బాహుబలి పార్ట్-1, పార్ట్-2ను కలిపి ‘బాహుబలి-ది ఎపిక్’ పేరుతో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇదే గ్రేటెస్ట్ ఫిల్మ్ అని, లైఫ్ టైమ్‌లో ఇలాంటి సినిమా ఒక్కసారే వస్తుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

News November 3, 2025

తాజా వార్తలు

image

☛ చేవెళ్ల యాక్సిడెంట్.. 19మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి
☛ జోగి రమేశ్‌ను 10రోజుల కస్టడీకి కోరుతూ ఎక్సైజ్ శాఖ పిటిషన్.. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ రేపటికి వాయిదా వేసిన VJA కోర్టు
☛ రాష్ట్రంలోని దుర్మార్గాలకు ఆద్యుడు లోకేశ్. ఉద్దేశపూర్వకంగానే YCP నేతలపై కేసులు: సజ్జల
☛ INDతో చివరి 2 T20లకు హెడ్ దూరం
☛ TNలో SIRకు వ్యతిరేకం.. సుప్రీం కోర్టును ఆశ్రయించినట్లు డీఎంకే వెల్లడి

News November 3, 2025

వారసత్వ రాజకీయాలపై శశిథరూర్ తీవ్ర విమర్శలు

image

వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ముప్పు అని కాంగ్రెస్ MP శశిథరూర్ విమర్శించారు. భారత రాజకీయాలు కుటుంబ వ్యాపారాలుగా మారాయన్నారు. ‘దశాబ్దాలుగా ఒకే ఫ్యామిలీ ఆధిపత్యం చెలాయిస్తోంది. నెహ్రూ-గాంధీ డైనస్టీ ప్రభావం స్వతంత్ర పోరాటంతో ముడిపడి ఉంది. కానీ రాజకీయ నాయకత్వం జన్మహక్కు అనే ఆలోచన పాతుకుపోయేలా చేసింది’ అని ఓ వ్యాసంలో పేర్కొన్నారు. దీంతో రాహుల్, తేజస్వీపై థరూర్ నేరుగా అటాక్ చేశారని BJP చెప్పింది.

News November 3, 2025

యాక్సిడెంట్ల రికార్డులు లేవన్న TGSRTC.. విమర్శలు

image

TG: చేవెళ్ల RTC బస్సు ప్రమాదంలో 19 మంది మరణించడం తెలిసిందే. ఇలాంటి ప్రమాదాలపై OCTలో వివరాలు అడిగిన ఓ RTI కార్యకర్తకు తమ వద్ద అలాంటి రికార్డులు లేవని RTC చెప్పింది. ప్రమాదాల్లో ఎంతో మంది చనిపోతున్నా రికార్డులు నిర్వహించకపోవడంపై విమర్శలొస్తున్నాయి. అయితే 2017-21 వరకు 2,674 ఘటనల్లో 1,230 మంది మృతి చెందారని 2022లో ఓ దరఖాస్తుకు RTC సమాధానమిచ్చింది. ఇప్పుడు రికార్డులే లేవనడం చర్చనీయాంశంగా మారింది.

News November 3, 2025

₹1500 MO కేసు… 32 ఏళ్ల తర్వాత రిటైర్డ్ పోస్ట్‌మాస్టర్‌కి 3ఏళ్ల జైలు

image

మనీ ఆర్డర్ మోసం కేసులో నోయిడా కోర్టు తీర్పు చర్చనీయాంశమైంది. అరుణ్ 1993లో ₹1500 తండ్రికి MO చేశారు. సబ్‌పోస్టుమాస్టర్ మహేంద్ర కుమార్ కమీషన్‌‌తో కలిపి ₹1575కు నకిలీ రశీదు ఇచ్చి డబ్బును ప్రభుత్వానికి జమ చేయలేదు. సొమ్ము అందకపోవడంతో అరుణ్ ఫిర్యాదు చేయగా అధికారులు కేసుపెట్టారు. తప్పు అంగీకరించిన కుమార్ సొమ్మును తిరిగిచ్చేశాడు. విచారణ అనంతరం కోర్టు రిటైరైన అతడికి 3 ఏళ్ల జైలు, ₹10వేల జరిమానా విధించింది.

News November 3, 2025

పరమాత్ముడి గుణాలను మనం వర్ణించగలమా?

image

పరమాత్ముడి గుణాలు అనంతం. వాటిని లెక్కించడం అసాధ్యం. ఆయన మనపై కరుణతోనే ఎన్నో అవతారాలు ఎత్తాడు. అందులో రామావతారం ఒకటి. ఆ మర్యాద పురుషోత్తముడి గుణాలను ఆదిశేషుడు, మహర్షులు కూడా పూర్తిగా వర్ణించలేరు. అయినా భక్తులు శాస్త్రాలలో ఆయన మహిమలను కీర్తించి, పాటించి, ఇతరులకు తెలిసేలా చేస్తున్నారు. మనం కూడా ఆ దైవ గుణాలను తెలుసుకొని, పాటించాలి. ఆయన లీలలు విని, అనుసరించిన వారికి మోక్షం లభిస్తుందని పురాణాల వాక్కు.

News November 3, 2025

కట్నం వద్దు కానీ.. 10 కండీషన్స్! చదివేయండి

image

తనకు కట్నం వద్దు కానీ వధువు 10 కండీషన్స్‌కు ఓకే చెప్పాలని ఓ యువకుడు SMలో పోస్ట్ చేశాడు. 1.No PreWed షూట్, 2.లెహంగా బదులు చీర ధరించాలి, 3.సంప్రదాయ సంగీతం ఉండాలి. 4.దండలు ప్రశాంతంగా మార్చుకోవాలి. 5.పూజారి తంతును ఎవరూ ఆపరాదు. 6.ఫొటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ జోక్యం ఉండొద్దు. 7. అభ్యంతరకర పోజులు అడగొద్దు. 8.వేదికపై నో కిస్సెస్/హగ్స్. 9.పెళ్లి పగలే జరగాలి. 10.సాయంత్రానికి అప్పగింతలు పూర్తి చేయాలి.

News November 3, 2025

APలో రూ.20వేల కోట్ల పెట్టుబడులు: హిందూజా గ్రూప్

image

AP: రాష్ట్రంలో రూ.20 వేల కోట్ల పెట్టుబడికి హిందూజా గ్రూప్ నిర్ణయం తీసుకుంది. లండన్ పర్యటనలో ఉన్న CM చంద్రబాబు ఆ కంపెనీ ప్రతినిధులతో భేటీ కాగా పెట్టుబడులకు ముందుకొచ్చారు. విశాఖలో హిందూజా పవర్ ప్లాంట్ సామర్థ్యాన్ని మరో 1,600MW పెంచేందుకు, రాయలసీమలో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి యూనిట్‌ల ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ల నెట్వర్క్ ఏర్పాటుపై MOU పూర్తైంది.