news

News May 7, 2025

పెద్దిరెడ్డి కుటుంబం ముఠామేస్త్రిలా వ్యవహరిస్తోంది: రాంప్రసాద్ రెడ్డి

image

AP: మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ భూములకు సంబంధించి చట్టపరంగా చర్యలు తీసుకున్నామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ‘రాయలసీమలో ఆయన కుటుంబం ముఠామేస్త్రిలా వ్యవహరిస్తోంది. మదనపల్లి ఫైల్స్ పేరుతో సినిమా తీయొచ్చు. మాధవరెడ్డి అరెస్టుతో ఆ కేసు కొలిక్కి వచ్చింది. ఆలస్యమైనా తప్పులు చేసిన వారిని జైలుకు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జగన్‌కు రాజ్ కసిరెడ్డి అత్యంత సన్నిహితుడు’ అని మంత్రి అన్నారు.

News May 7, 2025

వచ్చే సీజన్‌పై ధోనీ దృష్టి: రాయుడు

image

IPL: ఈ సీజన్‌లో CSK ప్రదర్శనపై ఆ జట్టు మాజీ ఆటగాడు అంబటి రాయుడు స్పందించారు. ‘చెన్నై దారుణంగా ఆడుతోంది. అయితే దీని నుంచి చాలా నేర్చుకునే అవకాశం ఉంది. భవిష్యత్‌పై దృష్టి పెట్టకపోతే ఇదే జరుగుతుంది. ఇక నుంచి మేనేజ్‌మెంట్ చాలా అప్రమత్తంగా ఉంటుంది. గేమ్ ఎంతలా మారిపోయిందో ధోనీ కూడా అర్థం చేసుకున్నారు. వచ్చే సీజ‌న్‌కు టీమ్‌ను బలోపేతం చేయడంపై ధోనీ ఇప్పటికే ఆలోచన మొదలుపెట్టుంటారు’ అని వ్యాఖ్యానించారు.

News May 7, 2025

BRS సభ సరికొత్త చరిత్రను సృష్టించబోతోంది: KTR

image

TG: రేపు నిర్వహించనున్న బీఆర్ఎస్ వరంగల్ సభ రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చరిత్రను సృష్టించబోతోందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్టీ ముఖ్యనేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. చారిత్రక సభలో కేసీఆర్ ప్రసంగంపై అన్ని వర్గాల్లో పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొని ఉందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సబ్బండవర్గాల ప్రజలు లక్షలాదిగా తరలిరావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

News May 7, 2025

ఉగ్రదాడి ఘటనలో కీలక పరిణామం

image

పహల్గామ్ ఉగ్రదాడి నుంచి బయటపడ్డ మహారాష్ట్ర వాసి శ్రీజిత్ NIAకి కీలక సమాచారం ఇచ్చారు. తన కుమార్తె డాన్స్ వీడియోలో ఇద్దరు అనుమానితులను ఆయన గుర్తించారు. దీంతో ఆ దిశగా NIA విచారణ చేపట్టింది. దాడికి ముందు ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించినట్లు తేల్చింది. బైసరన్ లోయలో ఇద్దరు అనుమానితులను గుర్తించగా, దాడికి పాల్పడిన వారిలో వారు ఉన్నట్లు అనుమానిస్తోంది.

News May 7, 2025

BRS సభ సరికొత్త చరిత్రను సృష్టించబోతోంది: KTR

image

TG: రేపు నిర్వహించనున్న బీఆర్ఎస్ వరంగల్ సభ రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చరిత్రను సృష్టించబోతోందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్టీ ముఖ్యనేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. చారిత్రక సభలో కేసీఆర్ ప్రసంగంపై అన్ని వర్గాల్లో పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొని ఉందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సబ్బండవర్గాల ప్రజలు లక్షలాదిగా తరలిరావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

News May 7, 2025

రాష్ట్రంలో బార్ల లైసెన్సు ఫీజులు తగ్గింపు

image

AP: టూరిజం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం బార్ల లైసెన్స్ ఫీజులు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గించింది. బార్ల లైసెన్స్‌ ఫీజు రూ.5 లక్షలు, 3, 5 స్టార్ హోటళ్ల రిజిస్ట్రేషన్ ఛార్జీని రూ.66 లక్షల నుంచి రూ.25 లక్షలకు తగ్గించేసింది. నాన్ రిఫండబుల్ ఛార్జీని రూ.20 లక్షలుగా పేర్కొంది. సెప్టెంబర్ 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నట్లు ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.

News May 7, 2025

IPL: టాస్ గెలిచిన పంజాబ్

image

కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచులో పంజాబ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. PBKS టీమ్‌లోకి మ్యాక్సీ, ఒమర్‌‌‌జాయ్ రాగా, KKR తరఫున పావెల్ డెబ్యూ చేస్తున్నారు.

PBKS: ప్రభ్‌సిమ్రన్, ప్రియాంశ్, శ్రేయస్, ఇంగ్లిస్, శశాంక్, వధేరా, మ్యాక్స్‌వెల్, ఒమర్‌జాయ్, జాన్‌సెన్, చాహల్, అర్ష్‌దీప్
KKR: గుర్బాజ్, నరైన్, రహానె, వెంకటేశ్ అయ్యర్, రింకూ, రసెల్, పావెల్, వైభవ్, చేతన్, హర్షిత్, వరుణ్ చక్రవర్తి

News May 7, 2025

జగన్ ఏ ప్రాజెక్టునూ పూర్తి చేయలేదు: షర్మిల

image

AP: 15 ఏళ్లుగా పోలవరం నిర్వాసితులకు న్యాయం జరగలేదని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ YS షర్మిల అన్నారు. జగన్ CM అయ్యాక నిర్వాసితులను విభజించారని, R&R ప్యాకేజీలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. 95వేల కుటుంబాలకు సాయం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జలయజ్ఞంలో ఏ ప్రాజెక్టునూ జగన్ పూర్తి చేయలేదని విమర్శించారు. గతంలో మోదీ రాజధానిలో మట్టి వేసి వెళ్లారని, ఇప్పుడు సున్నం కొట్టడానికి వస్తున్నారని ఎద్దేవా చేశారు.

News May 7, 2025

మూడేళ్లలో అమరావతిని పూర్తి చేస్తాం: నారాయణ

image

AP: రాబోయే మూడేళ్లలో రాజధాని అమరావతి పనులు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ ధీమా వ్యక్తం చేశారు. రూ.64 వేల కోట్లతో రాజధాని అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. ‘రాజధాని కోసం రైతులు 34,000 ఎకరాలు ఇచ్చారు. ఆ భూముల్లో అంతర్జాతీయ విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ సిటీ కడుతున్నాం. గత ప్రభుత్వ హయాంలో జగన్ తుగ్లక్ పాలనతో అమరావతి పనులు నిలిచిపోయాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News May 7, 2025

‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రీ రిలీజ్

image

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా రీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ మూవీని వచ్చే నెల 9న 2D, 3D వెర్షన్‌లో రీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీదేవి హీరోయిన్‌గా నటించారు. ఇళయరాజా మ్యూజిక్ అందించారు. 1990 మే 9న విడుదలైన ఈ మూవీ అప్పట్లోనే దాదాపు రూ.15 కోట్ల కలెక్షన్లు రాబట్టి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.