India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: నామినేషన్ సమయంలో రూ.8కోట్ల పన్ను కట్టిన నిజామాబాద్ కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి కాటిపల్లి శమంతకు ఓటర్లు షాకిచ్చారు. 19వ డివిజన్ నుంచి బరిలోకి దిగిన ఆమె BJP అభ్యర్థి చేతిలో ఓడారు. పార్టీ ముందుగానే మేయర్ అభ్యర్థిగా ప్రకటించడంతో గెలుపు కోసం ఖర్చుకు వెనుకాడలేదని తెలుస్తోంది. తన డివిజన్లో ఒక్కో ఓటుకు ₹5వేల వరకు పంచినట్లు సమాచారం. మిగతా డివిజన్లకూ డబ్బు సర్దడంతో ₹20కోట్ల వరకు ఖర్చయినట్లు తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి నెలకొననుంది. ఈ నెల 17తో శుక్ర మౌఢ్యమి ముగియడంతో 19 నుంచి పెళ్లి ముహూర్తాలు మొదలుకానున్నట్లు పండితులు తెలిపారు. *ఫిబ్రవరి: 19, 20, 21, 24, 25, 26 *మార్చి: 1, 3, 4, 7, 8, 9, 11, 12 *ఏప్రిల్: 15, 20, 21, 25, 26, 27, 28, 29 *మే: 1, 3, 5, 6, 7, 8, 13, 14 *జూన్: 21, 22, 23, 24, 25, 26, 27, 29 *జులై: 1, 6, 7, 11 *నవంబర్: 21, 24, 25, 26 *డిసెంబర్: 2, 3, 4, 5, 6, 11, 12.

ఇకపై పెన్షన్ స్కీమ్స్తో పాటే హెల్త్ కవర్నూ అందించేందుకు PFRDA ప్లాన్ చేస్తోంది. రిటైర్మెంట్ తర్వాత వైద్య ఖర్చుల కోసం ఇబ్బంది లేకుండా ఇన్వెస్టర్ల డబ్బులో 30% వైద్య అవసరాలకు కేటాయించేలా ‘Swasthya’ ప్లాన్ను రూపొందించే యోచనలో ఉంది. పెన్షన్ ఫండ్స్ స్పాన్సర్ చేసే ICICI, Axis, Tata వంటివి దీనిపై కసరత్తు చేస్తున్నాయి. దీంతో తక్కువ ప్రీమియంతోనే ఇన్సూరెన్స్, హాస్పిటల్స్లో మంచి డిస్కౌంట్లు లభిస్తాయి.

మొక్కల ఎదుగుదలకు అవసరమైన నత్రజనిని అందించే యూరియాను పంటను బట్టి ఉపయోగించాలి. వరి పంటకు యూరియాను బురద పదునులో వేయాలి. పెద్ద గుళికల యూరియాను వరి పైరుకు వేస్తే నత్రజని లభ్యత ఎక్కువ రోజులు ఉంటుంది. ఆరుతడి పైర్లకు యూరియాను భూమిపైన కాకుండా మొక్కల దగ్గర గుంత తీసి అందులో వేసి మట్టితో కప్పివేయాలి. ఆరుతడి పంటలకు సన్నగుళికల యూరియా వేస్తే తేమ తక్కువగా ఉన్నా, తొందరగా కరిగి మొక్కకు అందుతుంది.

శివుని మెడలో పాము కాలచక్రానికి చిహ్నం. ఇది భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలను సూచిస్తుంది. పాము తన కుబుసాన్ని విడిచినట్లుగా మానవుడు అహంకారాన్ని, మోహాన్ని, గతాన్ని వీడి కొత్త జన్మను ఎత్తాలని ప్రబోధిస్తుంది. పాము అప్రమత్తతకు, జాగ్రత్తకు నిదర్శనం. ఇది వెన్నెముకలోని కుండలినీ శక్తికి సంకేతం. భయంకర సర్పాలను ఆభరణాలుగా ధరించడంతో భయాన్ని జయించి, ప్రకృతిలోని ప్రతి జీవిని ప్రేమించాలనే భావాన్ని చెబుతున్నాడు.

బెంగళూరులో DRDOకు చెందిన సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ (CAIR)11 ఇంటర్న్ పోస్టులను భర్తీ చేయనుంది. BE/BTech (CS,IT,ఇన్ఫర్మేషన్ సైన్స్, AI-ML, EC, EEE) ఫైనల్ ఇయర్ చదుతున్నవారు ఫిబ్రవరి 28 వరకు అప్లై చేసుకోవచ్చు. నెలకు రూ.5వేల చొప్పున స్టైపెండ్ చెల్లిస్తారు. టెన్త్, ఇంటర్/డిప్లొమా, BE/BTech సెమిస్టర్ పర్సెంటేజ్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.drdo.gov.in

2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని ఎలక్టోరల్ ట్రస్టులకు వచ్చిన విరాళాల్లో సింహభాగం అధికార BJPకే దక్కింది. మొత్తం ₹3,826 కోట్ల డొనేషన్స్లో ₹3,157 కోట్లు (82%) ఆ పార్టీ ఖాతాలోకి వెళ్లగా కాంగ్రెస్కు ₹298 కోట్లు (7.8%) మాత్రమే అందాయి. TMC ₹102 కోట్లు అందుకుంది. టాప్ డోనర్లలో ఎలివేటెడ్ అవెన్యూ రియల్టీ(₹500 కోట్లు), టాటా గ్రూప్ (₹308 కోట్లు), తెలంగాణకు చెందిన మేఘా ఇంజినీరింగ్ (₹175 కోట్లు) ఉన్నాయి.

ఇరాన్లో ఆర్థిక సంక్షోభం వెనక తమ హస్తం ఉందని అమెరికా ట్రెజరీ చీఫ్ స్కాట్ బెసెంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దేశ ఆయిల్ ఎగుమతులను అడ్డుకొని బ్యాంకింగ్ రంగాన్ని ఐసోలేట్ చేయడం ద్వారా కావాలనే డాలర్ కొరతను సృష్టించామని తెలిపారు. దీనివల్ల ఇరాన్ కరెన్సీ ‘రియాల్’ విలువ ఏడాదిలో సగానికి పడిపోయింది. ఫలితంగా ద్రవ్యోల్బణం 72% ఎగబాకింది. చివరకు మందులకు కూడా డబ్బుల్లేక ప్రజలు రోడ్లకు మీదకు రావాల్సి వచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు రోజురోజుకూ పడిపోతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో రూ.100కే 6 కేజీలు విక్రయిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో కేజీ రూ.20కి అమ్ముతున్నారు. టమాటా రేట్లు కూడా పడిపోయాయి. కేజీ రూ.10-15 పలుకుతోంది. వంకాయ కేజీ రూ.25-30కే లభిస్తోంది. దొండకాయ రూ.50, పచ్చిమిర్చి రూ.50, క్యాప్సికం రూ.45కు విక్రయిస్తున్నారు.

ఖలీస్థానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ హత్యకు యూఎస్లో కుట్ర పన్నినట్లు ఇండియన్ నిఖిల్ గుప్తా US కోర్టులో అంగీకరించాడు. దీంతో అతనిపై హత్యకు కుట్ర, మనీలాండరింగ్, కిరాయి హత్య <<14361092>>అభియోగాలు<<>> మోపారు. గరిష్ఠంగా 40 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది. అయితే 21-25 ఏళ్లకు శిక్షను తగ్గించాలని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు సిఫార్సు చేయడం గమనార్హం. మే 29న శిక్ష ఖరారు చేయనున్నారు.
Sorry, no posts matched your criteria.