India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ముంబైతో జరుగుతున్న మ్యాచులో సన్ రైజర్స్ 162 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్(40), క్లాసెన్(37) ఫర్వాలేదనిపించినా హెడ్(29 బంతుల్లో 28), నితీశ్(19), కిషన్(2) విఫలమయ్యారు. ఓ దశలో ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో SRH బ్యాటర్లు పరుగులు తీసేందుకు ఇబ్బందులు పడ్డారు. చివర్లో అనికేత్ 8 బంతుల్లో 18 పరుగులు చేయడంతో గౌరవప్రదమైన స్కోరు నమోదైంది. విల్ జాక్స్ 2 వికెట్లు తీశారు. MI టార్గెట్ 163.
AP: మంగళగిరి ఎయిమ్స్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విన్నపంతో 534 పోస్టుల భర్తీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో పోస్టుల భర్తీకి సహకరించిన కేంద్ర మంత్రులు నిర్మలాసీతారామన్, జేపీ నడ్డాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
మలయాళంలో విడుదలై సూపర్ హిట్గా నిలిచిన ‘అలప్పుజ జింఖానా’ తెలుగులో రిలీజ్ కానుంది. ఇప్పటికే రూ.30 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ఈ నెల 25న తెలుగులో విడుదల కానున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. కాలేజ్ బ్యాక్ గ్రౌండ్లో బాక్సింగ్ క్రీడా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. గతంలో విడుదలైన ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్ వంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే.
* MI పార్ట్ టైమ్ బౌలర్ విల్ జాక్స్కు రెండు వికెట్లు
* అభిషేక్(40), నిరాశపరిచిన కిషన్
* క్యాచులు డ్రాప్ చేసినా సద్వినియోగం చేసుకోని SRH బ్యాటర్లు
* గాయంతో మైదానం వీడిన కరణ్ శర్మ
* 2 ఓవర్లలో 10 పరుగులిచ్చిన బుమ్రా
* 15 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 105 పరుగులు
AP: పాస్టర్లకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాస్టర్లకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం విడుదలకు సీఎం చంద్రబాబు ఓకే చెప్పారు. మొత్తం 8,427 మంది పాస్టర్లకు 7 నెలల(2024 మే-నవంబర్) కాలానికి రూ.30 కోట్లు రిలీజ్ చేశారు. ఎన్నికల సమయంలో పాస్టర్లకు గౌరవ వేతనం ఇస్తామని ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
IPL: ముంబైతో మ్యాచులో SRH బ్యాటర్లు పరుగులు చేసేందుకు చెమటోడుస్తున్నారు. 14 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 95 పరుగులు మాత్రమే చేశారు. గ్రౌండ్ చిన్నదైనప్పటికీ ఒక్క సిక్స్ కూడా కొట్టకపోవడం గమనార్హం. విధ్వంసానికి మారుపేరైన కాటేరమ్మ కొడుకులు సిక్సర్ బాదేందుకు కష్టపడుతున్నారు. పిచ్ బౌలింగ్కు సహకరిస్తుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మరి మ్యాచ్ ముగిసేలోపు సిక్సర్ల ఖాతా తెరుస్తారా? లేదా? చూడాలి.
AP: అన్నమయ్య జిల్లా పొన్నూటిపాళెంలో వేటగాళ్ల ఉచ్చుకు ఇటీవల చిరుతతో పాటు దాని కడుపులోని రెండు కూనలు మరణించాయి. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. అటవీ ప్రాంతాలు, సమీప గ్రామాల్లో జంతువుల కోసం ఉచ్చులు వేసే వేటగాళ్లు, నేరస్థులపై నిఘా ఉంచాలని స్పష్టం చేశారు.
TG: రాష్ట్రంలో అభివృద్ధి పనులకు నిధుల కోసం జైకా ప్రతినిధులతో CM రేవంత్ చర్చలు జరిపారు. మెట్రో రెండో దశ, మూసీ పునరుజ్జీవం, RRR ఇతర మౌలికవసతుల ప్రాజెక్టులకు ఆర్థికసాయం కోరారు. మెట్రో రెండో దశకు రూ.11,693 కోట్లు అడిగారు. HYDను న్యూయార్క్, టోక్యో తరహాలో అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఆర్థిక సాయం పొందేందుకు కేంద్రంతో కలిసి ప్రాజెక్టులను కొనసాగించాలని జైకా ప్రతినిధులు సూచించారు.
యూరోపియన్ క్రికెట్ సిరీస్(T10)-ఇటలీలో సంచలనం నమోదైంది. సివిడేట్ జట్టుతో మ్యాచ్లో మిలానో ప్లేయర్ జైన్ నఖ్వీ 26బంతుల్లోనే శతకం బాదారు. క్రికెట్ హిస్టరీలో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. అతను మొత్తంగా 37 బంతుల్లో 160* రన్స్(24 సిక్సర్లు, 2 ఫోర్లు) చేశారు. ఇన్నింగ్స్ 8, 10వ ఓవర్లలో 6 బంతులకు 6 సిక్సర్లు కొట్టారు. నఖ్వీ విధ్వంసంతో ఆ జట్టు 10 ఓవర్లలో 210/2 స్కోర్ చేయగా, ప్రత్యర్థి టీమ్ 106 పరుగులకే ఆలౌటైంది.
IPL: గత ఐదేళ్లు SRHకు కీలక బౌలర్గా ఉన్న నటరాజన్ను ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సరిగ్గా ఉపయోగించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మెగా ఆక్షన్లో DC రూ.10.75 కోట్లు వెచ్చించి అతడిని కొనుగోలు చేసినా బెంచ్కే పరిమితం చేస్తోంది. గాయం నుంచి కోలుకుని ఫిట్గా ఉన్నప్పటికీ తుది జట్టులోకి ఎందుకు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. నటరాజన్ గత సీజన్లోనూ 19 వికెట్లతో సత్తాచాటారు.
Sorry, no posts matched your criteria.