India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రముఖ నటుడు అర్జున్ సర్జా చిన్న కూతురు అంజన త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. తాజాగా ఇటలీలో ప్రియుడితో ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబాల సభ్యులు హాజరయ్యారు. 13 ఏళ్ల తర్వాత కల నెరవేరింది అనే అర్థంలో ఆమె ఇన్స్టాలో పోస్టు చేశారు. వరుడు విదేశీయుడు కాగా ఇతర వివరాలేవీ తెలియరాలేదు. అర్జున్ పెద్ద కుమార్తె ఐశ్వర్య నటుడు ఉమాపతి రామయ్యను గతేడాది వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో యువ ఆటగాళ్లు చోటు దక్కించుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జాతీయ జట్టులో సత్తా చాటిన అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణాకు కాంట్రాక్ట్ దక్కవచ్చని క్రిక్ బజ్ కథనం పేర్కొంది. అభిషేక్కు సీ-గ్రేడ్లో చోటు దక్కవచ్చని అభిప్రాయపడింది. కాగా BCCI పాలసీ ప్రకారం కాంట్రాక్ట్లో చోటు దక్కాలంటే ప్లేయర్ కనీసం 3 టెస్టులు లేదా 8 వన్డేలు లేదా 10 టీ20Iలు ఆడి ఉండాలి.
చిన్నారుల భవిష్యత్తుకు అండగా నిలిచేందుకు సచిన్ ఫౌండేషన్, గేట్స్ ఫౌండేషన్ చేతులు కలిపాయి. మేఘాలయ ప్రభుత్వ భాగస్వామ్యంతో రెండు సంస్థలు పనిచేయనున్నాయి. ఈ మేరకు క్రికెట్ దిగ్గజం సచిన్ ట్వీట్ చేశారు. మూలాలపై దృష్టి పెట్టినప్పుడే నిజమైన మార్పు వస్తుందన్న విషయం మేఘాలయా పర్యటనతో అర్థమైందన్నారు. పిల్లల ఆత్మస్థైర్యం, లోకల్ టీమ్స్ నిబద్ధత ఈ ప్రయాణంలో తమకు స్ఫూర్తినిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
AP: రేపు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA అంచనా వేసింది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ఏలూరు, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. మరోవైపు అల్లూరి జిల్లా కూనవరం, చింతూరు మండలాల్లో రేపు తీవ్రమైన వడగాలులు వీచే ప్రభావం ఉందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయిన బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహర్ ఫొటో ఇటీవల సోషల్ మీడియాలో వైరలైన విషయం తెలిసిందే. డ్రగ్స్ వాడకం వల్లే అలా అయ్యారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై కరణ్ ఇన్స్టాగ్రామ్లో స్పందించారు. ‘నాకేం కాలేదు. చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నా బ్లడ్ లెవెల్స్ సరిగ్గా మెయింటేన్ చేయాలని డాక్టర్స్ సూచించారు. రోజుకు ఒక పూటే తింటున్నాను. కఠిన డైట్ వల్ల సన్నగా మారాను’ అని వివరించారు.
TG: ఫ్యూచర్ సిటీలో వెయ్యి ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు మారుబెనీ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. CM రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన సందర్భంగా ఈ డీల్ కుదిరింది. రూ.వెయ్యి కోట్లతో పార్క్ను అభివృద్ధి చేయనుండగా, రూ.5వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. సుమారు 30వేల మందికి ఉపాధి లభించే అవకాశముంది. మరోవైపు సోనీ ప్రధాన కార్యాలయాన్ని సీఎం రేవంత్ సందర్శించారు.
అత్తపై కోడలు గృహ హింస కేసు పెట్టొచ్చు. మరి కోడలి చేతిలో వేధింపులకు గురవుతున్న అత్త అలాంటి కేసు పెట్టొచ్చా? ఓ UP మహిళ పెట్టిన కేసులో ఇదే ప్రశ్న అలహాబాద్ హైకోర్టులో ఉత్పన్నమవగా జడ్జి కీలక తీర్పునిచ్చారు. ‘కోడలు లేదా కుటుంబసభ్యులెవరైనా అత్తని శారీరకంగా, మానసికంగా హింసిస్తే ఆమె బాధితురాలిగా మారుతుంది. డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ 2005 సెక్షన్ 12 ప్రకారం అత్త కోడలిపై కేసు పెట్టొచ్చు’ అని స్పష్టం చేశారు.
భారత్, వియత్నాం మధ్య బ్రహ్మోస్ క్షిపణుల డీల్ తుదిదశకు చేరుకున్నట్లు సమాచారం. 700 మిలియన్ డాలర్ల విలువైన బ్రహ్మోస్ క్షిపణులను ఆ దేశానికి సరఫరా చేసేలా భారత్ ఒప్పందం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. చైనాతో ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో వియత్నాం ఈ క్షిపణులను కొనుగోలు చేసుకుంటుంది. కాగా 2022లో తొలిసారిగా 375 మిలియన్ డాలర్ల విలువైన బ్రహ్మోస్ క్షిపణులను ఫిలిప్పీన్స్కు భారత్ అందించింది.
జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలను ఇవాళ విడుదల చేస్తామని NTA ప్రకటించిన విషయం తెలిసిందే. రాత్రిలోపు ఏ క్షణమైనా ఫలితాలు వెలువడే అవకాశం ఉండటంతో పరీక్షకు హాజరైన విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మెయిన్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అడ్వాన్స్డ్కు అర్హత సాధిస్తారు. మీరూ రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారా?
TG: కంచ గచ్చిబౌలి భూములను ప్రైవేటు పరం చేసే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు విషయంలో KTR ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. BRS హయాంలో HYD చుట్టూ వేల ఎకరాల భూములను విక్రయించిందని విమర్శించారు. గతంలో చాలా సార్లు BRSకు కోర్టుల చేతిలో మొట్టికాయలు పడ్డాయని గుర్తు చేశారు. కోర్టులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి గౌరవం ఉందని చెప్పారు.
Sorry, no posts matched your criteria.