India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహిళలు పీరియడ్స్లో న్యాప్కిన్స్, మెన్స్ట్రువల్ కప్స్, ట్యాంపన్స్ వాడతారు. కానీ వీటి ఎక్స్పైరీడేట్ గురించి పట్టించుకోరు. ఎక్స్పైర్ అయిన ప్రొడక్ట్స్పై బ్యాక్టీరియా, వైరస్ పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వాటిని వాడితే జననేంద్రియాల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ముప్పు పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి వీటిని వినియోగించేముందు లేబుల్ని తప్పకుండా పరిశీలించాలని సూచిస్తున్నారు.
ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో 455 సెక్యూరిటీ అసిస్టెంట్(మోటార్ ట్రాన్స్పోర్ట్) ఉద్యోగాలకు ఈ నెల 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్ ఉత్తీర్ణతతోపాటు డ్రైవింగ్ లైసెన్స్, ఒక ఏడాది అనుభవం, మోటార్ మెకానిజం పరిజ్ఞానం ఉన్నవారు అర్హులు. 18-27ఏళ్ల వయసుండాలి. ఆన్లైన్ ఎగ్జామ్, డ్రైవింగ్ టెస్టు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 ఉంటుంది.
వెబ్సైట్: https://www.ncs.gov.in/
AP: మంత్రులందరిపై క్రిమినల్ కేసులున్నాయని YCP చేసిన <<17621813>>ట్వీట్పై<<>> TDP స్పందించింది. ప్రజాపోరాటాలు చేసే సమయంలో అధికారంలో ఉన్న ప్రత్యర్థులు ఈ కేసులు పెట్టారని పేర్కొంది. తన మీడియాలో జగన్ అసంబద్ధమైన వార్తలు ప్రచారం చేయిస్తున్నారని మండిపడింది. వీటి విషయం పక్కన పెడితే అసలు నేరాలు ఏంటో చూద్దామని.. సొంత బాబాయిని గొడ్డలితో నరికారని, దళితుడిని చంపి డోర్ డెలివరీ చేయడం వంటివి ప్రస్తావించింది.
TG: హైదరాబాద్లోని 42 టీ పౌడర్ యూనిట్లు & టీ షాపుల్లో GHMC ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. 19 చోట్ల నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపారు. రిపోర్ట్స్ వచ్చాక వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే శుభ్రత పాటించే దుకాణాల్లోనే టీ తాగాలని సూచించారు. ‘స్వచ్ఛమైన టీ ఆకులు తడి క్లాత్పై రుద్దితే అవి రంగుని వదలవు. కల్తీ టీ పొడిని నీటిలో కలపగానే ముదురు ఎరుపు రంగులోకి మారుతుంది’ అని అవగాహన కల్పించారు.
సచిన్ కూతురు సారా ఎంగేజ్మెంట్ వార్తలు బీటౌన్లో వైరల్ అవుతున్నాయి. గోవా రెస్టారెంట్ ఓనర్ సిద్ధార్థ్ కేర్కర్తో సారా చనువుగా ఉన్న ఫొటోలు బయటికి వచ్చాయి. దీంతో వీరిద్దరి నిశ్చితార్థం అయ్యిందా? అని సందేహిస్తూ పలు న్యూస్ సైట్లు వార్తలు ప్రచురించాయి. గతంలో వీరు గోవాలో దిగిన ఫొటోలనూ షేర్ చేశాయి. దీనిపై సచిన్ ఫ్యామిలీ స్పందించాల్సి ఉంది. సచిన్ కొడుకు అర్జున్కు ఇటీవల ఎంగేజ్మెంట్ అయిన విషయం తెలిసిందే.
మన దేశంలో ఒకే పన్ను విధానాన్ని తీసుకురావడం అసాధ్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. హవాయి చెప్పులకు, మెర్సిడెస్ బెంజ్ కారుకు ఒకే పన్ను వేయగలమా అని ఆమె ప్రశ్నించారు. ‘ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ వైవిధ్యభరితంగా ఉంది. అలాంటప్పుడు ఒకే పన్ను వేయడం కుదరదు. భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి అయినప్పుడే ‘వన్ నేషన్-వన్ ట్యాక్స్’ విధానం సాధ్యమయ్యే అవకాశం ఉంది’ అంటూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆన్లైన్లో పరిచయమైన ఓ స్కామర్ జపాన్కు చెందిన 80 ఏళ్ల వృద్ధురాలిని మోసం చేశాడు. తనని తాను ఓ ఆస్ట్రోనాట్గా పరిచయం చేసుకున్నాడు. కొన్నిరోజులు మాట్లాడాక ఆ ఒంటరి వృద్ధురాలికి అతనిపై ఇష్టం మొదలైంది. అదే అదునుగా ‘నేను స్పేస్లో ఇరుక్కుపోయాను. నా స్పేస్ షిప్పై దాడి జరిగింది. ఆక్సిజన్ కోసం డబ్బు కావాలి’ అని రూ.6 లక్షలు(5 వేల పౌండ్లు) ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. తర్వాత ఆమెతో మాట్లాడటం మానేశాడు.
తమ దేశానికి భారత్ దూరం కావడం బాధాకరమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియాతోపాటు రష్యాను కూడా కోల్పోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. SCO సమావేశం అనంతరం మోదీ, జిన్పింగ్, పుతిన్ ఉన్న ఫొటోను ఆయన ట్రూత్లో పోస్ట్ చేశారు. ‘ఈ రెండు దేశాలు కుట్ర బుద్ధి ఉన్న చైనాకు దగ్గరయ్యాయి. మూడు దేశాల స్నేహం చాలాకాలం కొనసాగవచ్చు’ అని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 18వ తేదీ ఉదయం 9 గంటలకు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మండలి సమావేశాలు అదే రోజు ఉదయం 10గంటలకు ప్రారంభమవుతాయి. ఈ మేరకు గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ అసెంబ్లీ సెషన్లో కూటమి ప్రభుత్వం పలు కీలక బిల్లులను ఆమోదించే అవకాశం ఉంది.
AP: కూటమి ప్రభుత్వంలోని మంత్రులందరిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని వైసీపీ ట్వీట్ చేసింది. దేశంలోనే అత్యంత చెత్త క్యాబినెట్గా చంద్రబాబు మంత్రివర్గం నిలిచిందని ఎద్దేవా చేసింది. ఇంత వరస్ట్ క్యాబినెట్ దేశంలో ఎక్కడైనా ఉంటుందా చంద్రబాబూ అని ప్రశ్నించింది. ఈ సందర్భంగా చంద్రబాబుపై 19, డిప్యూటీ సీఎం పవన్పై 08, మంత్రి లోకేశ్పై 17 కేసులతో పాటు ఇతర మంత్రులపై ఉన్న కేసుల లిస్టును పోస్ట్ చేసింది.
Sorry, no posts matched your criteria.