news

News September 5, 2025

టాప్-100లో ఏపీ& TG నుంచి ఏడు కాలేజీలు

image

నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) ఈ ఏడాది విడుదల చేసిన అత్యున్నత విద్యాసంస్థల ర్యాంకుల్లో తమిళనాడు టాప్‌లో ఉంది. టాప్-100లో తమిళనాడులోనే 17 ఉండటం విశేషం. ఆ తర్వాత మహారాష్ట్రలో 11, UPలో 9, ఢిల్లీలో 8, కర్ణాటకలో & పంజాబ్‌లో 6, TGలో 5 కాలేజీలున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో రెండు మాత్రమే ఉన్నట్లు వెల్లడించింది. APలో AU & KLU, TGలో IIT-HYD, NIT WGL, OU, IIIT-HYD,JNTUH ఉన్నాయి.

News September 5, 2025

శిల్పాశెట్టి దంపతులకు లుకౌట్ నోటీసులు

image

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాకు ముంబై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వ్యాపారాన్ని విస్తరిస్తామని చెప్పి ముంబైకి చెందిన వ్యాపారవేత్త దీపక్ కోఠారి నుంచి రూ.60కోట్లు తీసుకొని మోసం చేశారన్న అభియోగాలపై వీరిపై కేసు నమోదైంది. ప్రస్తుతం పోలీసులు వీరి ట్రావెల్ లాగ్‌లను పరిశీలిస్తున్నట్లు ఆర్థిక నేరాల విభాగం తెలిపింది. ఈ నేపథ్యంలో దంపతులు దేశం వదిలి వెళ్లకుండా నోటీసులిచ్చారు.

News September 5, 2025

పులివెందులకు ఉపఎన్నిక ఖాయం: రఘురామ

image

AP: ఈసారి వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే డిస్‌క్వాలిఫై అవుతారని, పులివెందులకు ఉపఎన్నిక ఖాయమని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. ఓ MLA 60 రోజులపాటు అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు పడుతుందని ఆయన తెలిపారు. ‘మాజీ CM అసెంబ్లీ సమావేశాలకు రావాలని కోరుతున్నా. ప్రతిపక్ష హోదా కోసం ఆయన చిన్నపిల్లాడిలా మారాం చేస్తున్నారు’ అని ఆయన ఎద్దేవా చేశారు.

News September 5, 2025

థాయ్‌లాండ్ కొత్త ప్రధానిగా అనుతిన్ చర్న్‌విరకుల్

image

థాయ్ కొత్త ప్రధానిగా Bhumjaithai party నేత అనుతిన్ చర్న్‌విరుకుల్‌ ఎన్నికయ్యారు. తాజాగా పార్ల‌మెంట్‌లో జరిగిన ఓటింగ్‌లో ఆయన అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. గతనెల షినవత్రాను ప్రధాని పదవి నుంచి రాజ్యాంగ న్యాయస్థానం <<17554052>>తొలగించింది<<>>. దీంతో కొత్త ప్రధాని ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో అపోజిషన్ పార్టీకి అధికారం దక్కింది.

News September 5, 2025

పాండ్య బ్రదర్స్ మంచి మనసు

image

టీమ్ ఇండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య మంచి మనసు చాటుకున్నారు. తమ చిన్ననాటి కోచ్ జితేంద్ర సింగ్‌కు రూ.80 లక్షల ఆర్థిక సాయం చేశారు. ఈ విషయాన్ని స్వయంగా జితేంద్రనే ఓ మీడియాకు తెలిపారు. తన చిన్న చెల్లెలు పెళ్లి కోసం రూ.20 లక్షలు, కారు కోసం రూ.20 లక్షలు, తల్లి చికిత్స కోసం కొంత నగదు, ఇతర అవసరాల కోసం రూ.18 లక్షలు ఇలా ఇప్పటివరకు రూ.70-రూ.80 లక్షల వరకు ఇచ్చారని వెల్లడించారు.

News September 5, 2025

డేంజర్.. మీ పిల్లలు ఇలా నడుస్తున్నారా?

image

ఏడాది దాటాక పిల్లలు బుడిబుడి అడుగులు వేయడం మొదలు పెడతారు. ఈ క్రమంలో కాలివేళ్లపై నడుస్తారు. కానీ మూడేళ్లు దాటిన తర్వాత కూడా పిల్లలు అలాగే నడుస్తుంటే అది ఆటిజం వ్యాధికి సంకేతం కావొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఆటిజం ఒక న్యూరో డెవలప్‌మెంటల్ కండిషన్. దీనివల్ల ఇంద్రియాల మధ్య సమన్వయం ఉండదు, భావ వ్యక్తీకరణలోపం ఉంటుంది. కాబట్టి చిన్నారుల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.

News September 5, 2025

థైరాయిడ్ వల్ల జుట్టు ఊడుతోందా?

image

కొంతమందిలో థైరాయిడ్ కంట్రోల్​లో ఉన్నప్పటికీ హెయిర్‌ఫాల్ అవుతుంటుంది. దీనికి విటమిన్ డి, కాల్షియం లోపం కారణం కావొచ్చంటున్నారు నిపుణులు. కాబట్టి చేపలు, గుడ్లు, పాల సంబంధిత ఉత్పత్తులు, నువ్వులు, డేట్స్, నట్స్ వంటి కాల్షియం రిచ్ ఫుడ్స్ డైలీ డైట్​లో చేర్చుకోవాలి. విటమిన్ డి లోపం కారణంగా జుట్టు రాలుతుంటే డి విటమిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు, సప్లిమెంట్లు తీసుకోవాలని ఎండోక్రినాలజిస్టులు సూచిస్తున్నారు.

News September 5, 2025

సెకండ్ ఇన్నింగ్స్ ఇలా హిట్

image

చాలామంది మహిళలు వివిధ కారణాలతో ఉద్యోగంలో విరామం తీసుకుంటారు. తిరిగి ఉద్యోగంలో చేరదామంటే ఎన్నో సవాళ్లు. వీటిని ఎదుర్కొని కెరీర్‌లో రాణించాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. విరామానికి గల కారణాలు, కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటే అవీ రెజ్యూమేలో చేర్చాలి. ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూకు హాజరవ్వాలి. అలాగే కొన్ని సంస్థలు విరామం తీసుకున్న మహిళల కోసం ప్రత్యేకంగా రిక్రూట్‌మెంట్స్ జరుపుతున్నాయి. వాటికి హాజరవ్వాలి.

News September 5, 2025

తురకపాలెం మరణాలకు వైరస్ కారణం కావొచ్చు: సత్యకుమార్

image

AP: తురకపాలెం <<17599008>>మరణాలపై<<>> కారణాలు ఇప్పటికీ తెలియలేదని మంత్రి సత్యకుమార్ అన్నారు. వైద్యపరీక్షల్లో మెలియాయిడోసిస్ ఆనవాళ్లు లేవని తేలిందని, రక్తనమూనాలను చెన్నై ల్యాబ్‌కు పంపించినట్లు చెప్పారు. ఫలితాలు ఇంకా రాలేదని, వైరస్ కారణమని భావిస్తున్నట్లు తెలిపారు. మరణాల విషయంలో అలసత్వం వహించిన DMHOపై విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే గ్రామంలో సాధారణ పరిస్థితి తీసుకొస్తామన్నారు.

News September 5, 2025

గణేశ్ నిమజ్జనానికి బాంబు బెదిరింపులు

image

ముంబై పోలీసులు హై అలర్ట్‌లో ఉన్నారు. రేపు గణేశ్ నిమజ్జనంలో విధ్వంసం సృష్టిస్తామని వారికి బాంబు బెదిరింపులు అందాయి. లష్కర్ ఏ జిహాదీ పేరిట.. ’14మంది పాక్ టెర్రరిస్టులు భారత్‌లోకి చొరబడ్డారు. 34 వాహనాల్లో మానవ బాంబులను సిద్ధం చేశాం. 400 కిలోల ఆర్డీఎక్స్‌తో పేలుళ్లు ప్లాన్ చేశాం. కోటిమంది చనిపోగలరు’ అని వాట్సాప్ మెసేజ్ పంపారు. ఈ నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసి తనిఖీలు చేపట్టారు.