India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బంధించిన ఆత్మ బయటకొచ్చి ఓదెల గ్రామాన్ని ఏం చేసిందన్నదే పార్ట్-2 కథ. దేవుడు, ఆత్మ చుట్టూ సినిమా తిరుగుతుంటుంది. తిరుపతి పాత్ర, ప్రేతాత్మను ఎదుర్కొనే నాగసాధువుగా తమన్నా, ఇంటర్వెల్, మ్యూజిక్ ఆకట్టుకుంటాయి. క్రైమ్ సన్నివేశాలు, డైలాగ్స్, క్లైమాక్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఊహించే సీన్లు, స్టోరీ లైన్, ఎమోషన్ లేకపోవడం, ఆకట్టుకోని సెకండాఫ్, కొన్ని పాత్రలపై ఫోకస్ లేకపోవడం మైనస్.
RATING: 2.50/5.
హిందూ-ముస్లింల మధ్య ఉన్న సంప్రదాయాలు పరస్పర వ్యతిరేకమని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసీమ్ మునీర్ అన్నారు. ఆ కారణంగానే తమ పూర్వీకులు ఎంతో పోరాటం చేసి ప్రత్యేక దేశాన్ని సాధించారన్నారు. విదేశాల్లో ఉన్న పాక్ పౌరులనుద్దేశించి ఆర్మీ చీఫ్ ప్రసంగించారు. జమ్మూకశ్మీర్లో పోరాటం చేస్తున్న తమ సోదరులను ఒంటరిగా వదిలేయమని, ఈ విషయంలో చాలా స్పష్టతతో ఉన్నామని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
వక్ఫ్ ఆస్తుల్లో ఎలాంటి మార్పులు చేయొద్దని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. కొత్త నియామకాలు చేపట్టొద్దని, యథాతథ స్థితి కొనసాగించాలని పేర్కొంది. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా దాఖలైన 73 పిటిషన్లపై విచారణ సందర్భంగా SC ఈ వ్యాఖ్యలు చేసింది. కౌంటర్ దాఖలుకు కేంద్రానికి వారం గడువు విధించింది. వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమేతరుల సభ్యులను నియమించొద్దని స్పష్టం చేసింది. తదుపరి విచారణను మే 5కు వాయిదా వేసింది.
సౌతాఫ్రికాలో జరిగిన ఇన్విటేషనల్ ఈవెంట్లో ఒలింపిక్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా సత్తా చాటారు. 84.52 మీటర్ల జావిలింగ్ త్రో విసిరి గోల్డ్ మెడల్ సాధించారు. మెుత్తంగా ఆరుగురు పోటీపడ్డ ఈ ఇన్విటేషనల్ ఈవెంట్లో విజేతగా నిలిచారు. వచ్చే నెలలో దోహా డైమండ్ లీగ్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో నీరజ్ చోప్రా తన సీజన్ను విజయంతో ప్రారంభించారు.
పశ్చిమ బెంగాల్లో ఉద్యోగాలు కోల్పోయిన 25వేల మంది టీచర్లకు సుప్రీంకోర్టు కాస్త ఉపశమనం కలిగించింది. నూతన నియామకాలు చేపట్టేవరకు వారు విధులు నిర్వహించవచ్చని తెలిపింది. విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా రిక్రూట్మెంట్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో 25వేల టీచర్ నియామకాలు చెల్లవని ఇటీవల అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.
UPలో 2 రోజుల క్రితం అదృశ్యమైన ఓ 11 ఏళ్ల మూగ-చెవిటి బాలిక అర్ధనగ్నంగా, అపస్మారకస్థితిలో కనిపించింది. ఆమె ముఖంపై గాయాలు, పంటిగాట్లు, మర్మాంగాలపై సిగరెట్తో కాల్చిన గుర్తులున్నట్లు వైద్యులు తెలిపారు. సామూహిక అత్యాచారం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పోలీసులు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 3 బృందాలతో నిందితుల కోసం గాలిస్తున్నట్లు SP అతుల్ కుమార్ శ్రీవాస్తవ వెల్లడించారు.
AP: ఎస్వీ గోశాలలో ఆవులు చనిపోయాయంటూ వైసీపీ నేతలు ఆరోపించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని కూటమి నేతలు విమర్శించారు. తాము గోశాల వద్దకు వచ్చామని, భూమనతో సహా ఇతర వైసీపీ నేతలెవరూ ఇక్కడికి రాలేదని దుయ్యబట్టారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో ఎన్నో అక్రమాలు జరిగాయని ఆరోపించారు.
టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని బాలీవుడ్లో తన తొలి సినిమా ‘జాట్’తో ప్రేక్షకులను మెప్పించారు. సన్నీ డియోల్ నటించిన ఈ మూవీ APR 10న విడుదలై ఇప్పటివరకు రూ.70 కోట్ల వసూళ్లు రాబట్టింది. దీంతో నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ దీనికి సీక్వెల్ ‘జాట్-2’ను ప్రకటించింది. ఈ మూవీనీ గోపీచందే తెరకెక్కించనున్నారు. అటు సన్నీడియోల్ దీనితో పాటు బోర్డర్-2, గదర్-3 లోనూ నటిస్తున్నారు.
AP: ఎస్సీ వర్గీకరణ-2025కు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు. దీంతో ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ మేరకు గెజిట్ విడుదల చేస్తూ న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభాదేవి ఉత్తర్వులు ఇచ్చారు. కాగా ఇటీవల ఆర్డినెన్స్కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
TG: ఇటీవల బీర్ల ధరలను 15% పెంచిన ప్రభుత్వం ఇప్పుడు లిక్కర్ ధరలు పెంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. చీప్ లిక్కర్ మినహా రూ.500కు పైగా ధర ఉండే లిక్కర్ బాటిళ్లపై కనీసం 10% పెంచనున్నట్లు సమాచారం. దీని ప్రకారం బాటిల్పై మినిమమ్ రూ.50 పెరిగే అవకాశముంది. ఆయా బాటిళ్ల ఎమ్మార్పీ ఆధారంగా రేట్లు పెరగనున్నాయి. అధికారులతో సమీక్షించిన అనంతరం ధరల పెంపుపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.