India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
APలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల స్థాపనకు చేయూత అందించాలని మంత్రి లోకేశ్ PM మోదీని కోరారు. APకి సెమీ కండక్టర్ యూనిట్ మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యాప్రమాణాల మెరుగుదలకు సంస్కరణలు అమలు చేస్తున్నామని, మెరుగైన ఫలితాలు సాధించేందుకు సహకరించాలని కోరారు. రాష్ట్రంలో కొంతకాలంగా నెలకొన్న వివిధ పరిణామాలను మోదీకి వివరించారు. రాష్ట్రాభివృద్ధికి అన్నివిధాలా సహకారం అందిస్తామని మోదీ బదులిచ్చారు.
AP: అనంతపురం(D) బుక్కరాయసముద్రంలో నెల క్రితం అమ్మవారి హుండీ డబ్బు ఎత్తుకెళ్లిన దొంగలకు ఊహించని పరిణామం ఎదురైంది. ఉన్నట్టుండి వారి పిల్లలకు ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఎత్తుకెళ్లిన సొమ్ము(₹లక్షకుపైగా)తో పాటు ఓ లేఖ కూడా ఆలయం వద్ద పెట్టి వెళ్లారు. ఆ లేఖలో ‘చోరీ చేసిన తర్వాత మా పిల్లల ఆరోగ్యం క్షీణించింది. అందుకే డబ్బు తిరిగి వదిలేస్తున్నాం’ అని రాశారు. దీంతో గ్రామస్థులు, పోలీసులు ఆశ్చర్యపోయారు.
రేపు HYDలోని ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం నేపథ్యంలో మెట్రో రైలు సమయాన్ని పొడిగించింది. తొలి ట్రైన్ రేపు ఉదయం 6 గంటలకు, చివరి ట్రైన్ అర్ధరాత్రి ఒంటి గంటకు అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి బయలుదేరుతాయని తెలిపింది. ప్రయాణికులు, భక్తులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కోరింది. ఎలాంటి ఇబ్బందులు పడకుండా వేడుకలు చేసుకోవాలని సూచించింది.
రిలయన్స్ కమ్యూనికేషన్స్, దాని మాజీ డైరెక్టర్ అనిల్ అంబానీ రుణఖాతాలు మోసపూరితమని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించినట్టు Stock Exchangesకు ఆ సంస్థ సమాచారం ఇచ్చింది. అయితే BOB ఆరోపణలను ఖండిస్తున్నట్టు అనిల్ అధికార ప్రతినిధి తెలిపారు. సమస్య పరిష్కారం కోసం ఆయన న్యాయ సలహాలు తీసుకుంటారని వెల్లడించారు.
ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఉత్తమ ఉపాధ్యాయులకు జాతీయ అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేశారు. దేశవ్యాప్తంగా 45 మంది టీచర్లు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఏపీ నుంచి తిరుమల శ్రీదేవి(HM-పండిట్ నెహ్రూ GVMC మున్సిపల్ హైస్కూల్), తెలంగాణ నుంచి పవిత్ర(పెన్పహడ్ స్కూల్) అవార్డు అందుకున్నారు. ఇక ప్రొఫెసర్ విభాగంలో ఏపీకి చెందిన ప్రొ.విజయలక్ష్మి, దేవానందకుమార్, TG నుంచి గోయల్, వినీత్ అవార్డులు స్వీకరించారు.
మలవిసర్జనకు వెళ్లినప్పుడు ఫోన్ వాడటం వల్ల హెమోరాయిడ్స్ (పైల్స్) ప్రమాదం పెరగొచ్చని బోస్టన్లోని బెత్ ఇస్రాయెల్ డీకొనెస్ మెడికల్ సెంటర్ పరిశోధనలో వెల్లడైంది. బాత్రూమ్లో ఫోన్ వాడని వారితో పోల్చితే వాడేవారికి హెమోరాయిడ్స్ వచ్చే ప్రమాదం 46% ఎక్కువగా ఉంది. వీరు ఒక్కోసారి 5 నిమిషాల కంటే ఎక్కువ సమయం గడుపుతున్నట్లు తేలింది. ఇది సమయాన్ని వృథా చేయడంతో పాటు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని తెలిపింది.
కార్పొరేట్ రంగంలో పోటీని తట్టుకుని నిలబడాలంటే టెక్నికల్ స్కిల్స్తోపాటు సాఫ్ట్ స్కిల్స్ కూడా అవసరం. నిత్యం అప్గ్రేడ్ అవుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఆఫీస్ వర్క్ కల్చర్లో మార్పులను అర్థం చేసుకుని, నేర్చుకుని ముందుకెళ్లాలి. ఈ రంగంలో రాణించాలంటే క్రిటికల్ థింకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, క్రియేటివిటీ, కొలాబరేషన్ లాంటి నాలుగు ‘C’లు అవసరమని నిపుణులు చెబుతున్నారు.
Critical Thinking: ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచిస్తూ నిత్యనూతనంగా ఉండాలి. సమస్యలను విశ్లేషించి స్మార్ట్ నిర్ణయాలు తీసుకోవాలి.
Communication Skills: ఉద్యోగ జీవితంలో భావవ్యక్తీకరణ కీలకం. అప్పుడే రాణించగలం.
Creativity: క్రియేటివిటీగా ఆలోచించి, సమస్యలకు పరిష్కారాలు చూపగలగాలి. టెక్నాలజీలపై అప్డేట్గా ఉండాలి.
Collaboration: వ్యక్తిగతంగా కంటే టీమ్తో కలిసి పనిచేసే స్కిల్ ఉంటేనే గుర్తింపు పొందుతారు.
*నీటి ప్రవాహానికి ఎదురీదడం సులభం కాదు. కానీ సాల్మన్ చేపలు ఎదురీదుతాయి. పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమేనని ఇవి మనకు తెలియజేస్తాయి.
* వెదురు చెట్టు తుఫానుకు వంగిపోతుంది. కానీ విరగదు. తగ్గగానే నిటారుగా నిల్చుంటుంది. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు తలవంచినా, తర్వాత సర్దుకొని నిలబడాలి.
* సాలీడు ఓపికగా, శ్రద్ధగా గూడును అల్లుకుంటుంది. గెలుపు కోసం ఇంతకంటే గొప్ప సూత్రమేముంటుంది. SHARE IT
TG: మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్హౌస్లో గణపతి హోమం చేయిస్తున్నారు. తన సతీమణి శోభతో కలిసి పూజలో పాల్గొన్నారు. ప్రతి ఏటా వినాయక చవితి నవరాత్రుల్లో కేసీఆర్ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మరోవైపు కేటీఆర్ 5 రోజులుగా ఫామ్హౌస్లోనే ఉన్నారు. అటు హరీశ్ రావు రేపు లండన్ నుంచి హైదరాబాద్ రానున్నారు. నేరుగా ఫామ్హౌస్కు వెళ్లి కవిత ఆరోపణలపై చర్చించే అవకాశం ఉంది.
*File photo
Sorry, no posts matched your criteria.