news

News April 17, 2025

పలాయనం చిత్తగించిన కూటమి నేతలు: రోజా

image

AP: దమ్ముంటే ఛాలెంజ్ స్వీకరించాలని ట్వీట్లు చేసిన కూటమి నేతలు ఫోన్ ఎత్తకుండా పలాయనం చిత్తగించారని వైసీపీ నేత రోజా ఎద్దేవా చేశారు. తమ పార్టీ నేతలు ప్రూఫ్‌లతో సహా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఛాలెంజ్‌లు విసరకూడదని ఆమె మండిపడ్డారు. తిరుపతిలో టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తమ నేతల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని ఆమె హెచ్చరించారు.

News April 17, 2025

చికిత్సకు డబ్బులు వేస్ట్ అని రియల్టర్ సూసైడ్?

image

UPలో క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ రియల్టర్ తుపాకీతో భార్యను కాల్చి చంపి, తనను తాను కాల్చుకున్నాడు. చికిత్సకు అనవసరంగా డబ్బు ఖర్చు చేసేందుకు ఇష్టం లేక చనిపోతున్నట్లు సూసైడ్ లెటర్‌లో రాశారు. ఘజియాబాద్‌కు చెందిన కుల్దీప్ త్యాగి (46), అన్షు త్యాగి భార్యాభర్తలు. ఇటీవల కుల్దీప్‌కు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో చికిత్సకు డబ్బులు వెచ్చించే బదులు మిగిలించడం మేలని భావించి ప్రాణాలు తీసుకున్నారు.

News April 17, 2025

బయట జ్యూస్ తాగుతున్నారా? ఇది చూడండి

image

TG: హైదరాబాద్‌ అమీర్‌పేట్‌లోని జ్యూస్ సెంటర్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్స్ చేశారు. అక్కడ తుప్పు పట్టి అపరిశుభ్రంగా ఉన్న ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసిన కుళ్లిపోయిన పండ్లను గుర్తించారు. పండ్లపై ఈగలు, బొద్దింకలు వాలడంతో పాటు ఎక్స్‌పైరీ అయిపోయిన సిరప్స్ వాడటంపై సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను అధికారులు Xలో షేర్ చేశారు. ఇవి చూశాక బయట జ్యూస్ తాగే పరిస్థితి లేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News April 17, 2025

హజ్ యాత్రపై ప్రధానికి.. స్టాలిన్ లేఖ

image

సౌదీ ప్రభుత్వం హజ్ యాత్ర ప్రైవేట్ కోటా తగ్గించిన నేపథ్యంలో ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీకి తమిళనాడు CM స్టాలిన్ లేఖ రాశారు. సౌదీ నిర్ణయంతో వేలమంది ముస్లింలలో యాత్రకు వెళ్తామా.. లేదా .? అనే సందిగ్ధత నెలకొందన్నారు. ఇస్లాంలో ఎంతో పవిత్రంగా భావించే హజ్ యాత్రకు ముస్లింలు జీవితంలో ఒక్కసారైనా వెళ్లాలనుకుంటారని లేఖలో తెలిపారు. సౌదీతో చర్చించి ఈ సమస్యకు పరిష్కారం వెతకాలని ప్రధానిని కోరారు.

News April 17, 2025

నష్టాలతో మొదలై.. భారీ లాభాల్లో మార్కెట్లు

image

ఇండియన్ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ కాసేపటి క్రితం 1074 పాయింట్ల లాభంతో 78,126 వద్ద ట్రేడ్ అవుతోంది. Nifty 300 పాయింట్ల లాభంతో 23,737 వద్ద ట్రేడ్ అవుతోంది. భారతీ ఎయిర్‌టెల్, ఐసీసీఐ బ్యాంక్, గ్రాసిం ఇండస్ట్రీస్, సన్ ఫార్మా లాభాల్లో ట్రేడ్ అవుతుండగా.. విప్రో, హీరో మోటోకార్ప్, టెక్ మహీంద్రా, L&T, HCL టెక్నాలజీస్ నష్టాల్లో ఉన్నాయి.

News April 17, 2025

సరిలేరు నీకెవ్వరు.. చిన్నారుల ఆపరేషన్‌కు మహేశ్‌ సాయం

image

గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు హీరో మహేశ్‌బాబు ఉచితంగా ఆపరేషన్స్ చేయిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా మరో ముగ్గురు పిల్లలకు శస్త్రచికిత్స చేయించినట్లు ‘MB ఫౌండేషన్’ ట్వీట్ చేసింది. వరలక్ష్మి (2 నెలలు), పండూరి ఇముగ్ధ శ్రీ (5 నెలలు), పూజ్యశ్రీ ఫనీక్ష (8 నెలలు)లకు హార్ట్ ఆపరేషన్లు చేసి కాపాడినట్లు పేర్కొన్నారు. కాగా, ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు 4500+ సర్జరీలు జరగడం విశేషం.

News April 17, 2025

సిట్ విచారణకు విజయసాయి గైర్హాజరు

image

AP: మద్యం కుంభకోణం కేసులో ఇవాళ విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గైర్హాజరయ్యారు. వివిధ కారణాల వల్ల విచారణకు రాలేకపోతున్నానని సిట్‌కు సమాచారం ఇచ్చారు. ఎప్పుడు విచారణకు హాజరయ్యేది త్వరలోనే వెల్లడిస్తానని పేర్కొన్నారు.

News April 17, 2025

వరుసగా మూడ్రోజులు సెలవులు

image

తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు రేపు సెలవు ఉండనుంది. గుడ్‌ఫ్రైడేని పురస్కరించుకుని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు రేపు జనరల్ హాలిడేగా ప్రకటించాయి. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులూ పనిచేయవు. పలు కేంద్ర సంస్థలు, కార్పొరేట్ కంపెనీలకు శనివారమూ సెలవు ఉండటంతో ఆదివారంతో కలిపి మొత్తం 3 రోజులు సెలవులు రానున్నాయి. మీకూ వరుస సెలవులు వచ్చాయా? కామెంట్ చేయండి.

News April 17, 2025

రోజూ ఆకుకూరలు తింటే ఇన్ని లాభాలా?

image

రోజూ ఆకుకూరలు తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు. ‘పాలకూరతో గుండెపోటు రిస్కు తగ్గుతుంది. కొత్తిమీర కొలస్ట్రాల్ లెవెల్స్‌ను 10-15% తగ్గిస్తుంది. మెంతిలో ఉండే ఫైబర్ షుగర్ లెవెల్స్‌ను తగ్గించి బ్రెస్ట్ & ప్రొస్టేట్ క్యాన్సర్‌ రిస్కును తప్పిస్తుంది. గోంగూర గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. తోటకూర బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని నిరోధిస్తుంది’ అని తెలిపారు.

News April 17, 2025

అందంగా ఉంటేనే అవకాశాలు రావు: తమన్నా

image

అందంగా ఉంటేనే అవకాశాలు వస్తాయనడం తనకు నచ్చదని హీరోయిన్ తమన్నా అన్నారు. అందంపై శ్రద్ధ ఉండాలి కానీ, అదే సినిమా ఛాన్సులు తీసుకువస్తుందంటే తాను నమ్మనని చెప్పారు. ‘‘మిల్కీ బ్యూటీ’ ట్యాగ్ నాకు ఫ్యాన్స్ ఇచ్చారు. దీనిని మీడియా మరింత ప్రచారం చేసింది. ఈ ట్యాగ్ వల్ల నా సినిమాల ఛాయిస్‌పై ఎలాంటి ప్రభావం చూపలేదు’ అని ఆమె చెప్పుకొచ్చారు. కాగా తమన్నా నటించిన ‘ఓదెల 2’ ఇవాళ థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే.