India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: భూ భారతి చట్టం దేశంలోనే రోల్ మోడల్ కాబోతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నారాయణపేట(D) మద్దూరులో భూ భారతి పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ‘ధరణిలో డబ్బులు కట్టాల్సి వచ్చేది. భూ భారతిలో రూపాయి కూడా చెల్లించకుండానే దరఖాస్తు చేసుకోవచ్చు. గత ప్రభుత్వం పేదల భూములను కొల్లగొట్టింది. ఆడిట్ చేసి ఆ భూములను అర్హులైన పేదలకు ఇస్తాం’ అని పేర్కొన్నారు.
కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం జాబితాలో చోటు సంపాదించుకున్నారు. దాదాపు 50కి పైగా దేశాలకు చెందిన 116మందికి యంగ్ గ్లోబల్ లీడర్స్గా WEF చోటు కల్పించింది. భారత్ నుంచి మెుత్తంగా ఏడుగురు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన 40 సంవత్సరాలలోపు వ్యక్తులను యంగ్ గ్లోబల్ లీడర్స్గా WEF గుర్తిస్తుంది.
వారం రోజుల్లో వేసవి సెలవులొస్తున్నాయ్. ఇప్పుడంటే సెలవు రోజుల్లో టీవీలు, మొబైల్స్కు అతుక్కుపోతున్నారు. ఎండను చూసి భయపడుతున్నారు. కానీ, 90S కిడ్స్ అలా ఉండేవాళ్లు కాదు. మండుటెండలోనూ రస్నా తాగేసి సూర్యుడికి ఎదురుగా నిలబడేవాళ్లు. పాత టైర్తో ఊరంతా చుట్టేయడం, గోలీల ఆట, తొక్కుడు బిళ్ల, దాగుడు మూత, కోతి కొమ్మచ్చి, అష్టాచెమ్మా, కర్రబిళ్ల వంటి ఆటలు ఆడుతూ రోజంతా ఎంజాయ్ చేసేవాళ్లు. మీరూ ఇలానే చేసేవారా?
AP: జమ్మలమడుగు BJP MLA ఆదినారాయణరెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. కడప జిల్లా ఎర్రగుంట్ల(మ) చిలమకూరు వద్ద ఆల్ట్రాటెక్ సిమెంట్ సంస్థకు చెందిన ఫ్లైయాష్ వాహనాలను అడ్డుకుంటున్నారన్న సంస్థ ఫిర్యాదుతో ఎర్రగుంట్ల పీఎస్లో ఆయనతో పాటు అనుచరులపై కేసు నమోదైంది. పరిశ్రమలో కాంట్రాక్ట్ పనుల అప్పగింత, ఫ్లైయాష్, సున్నపురాయి వెళ్లకుండా MLA అడ్డుకుంటున్నారని సంస్థ ప్రతినిధులు కలెక్టర్, SP దృష్టికి తీసుకెళ్లారు.
AP: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. లిక్కర్ స్కామ్ కేసులో రేపు విచారణకు రావాలని ఆయనకు సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో విచారణ సమయంలో న్యాయవాదిని అనుమతించాలని, వీడియో రికార్డింగ్ చేయాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఇదే కేసులో కాసేపట్లో విజయసాయిరెడ్డి సిట్ ముందు హాజరుకానున్నారు. ఆయన వాంగ్మూలాన్ని అధికారులు రికార్డు చేయనున్నారు.
భారత్లో ముస్లింలను వ్యతిరేకిస్తున్న బీజేపీ అరబ్ దేశాలకు వెళ్లినప్పుడు వారి ఆతిథ్యాన్నే తీసుకుంటుందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. ముస్లింలపై దేశంలో వివక్ష చూపుతూ విదేశాల్లో మరో విధంగా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. ఇండియా కూటమి వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరముందని నొక్కిచెప్పారు. కాగా వక్ఫ్ చట్టంపై నేడు సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు ఇవ్వనుంది.
రామ్ జగదీశ్ తెరకెక్కించిన ‘కోర్ట్’ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఓటీటీలో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. ‘ఛావా’లాంటి పాన్ ఇండియా సెన్సేషన్తో వ్యూవర్షిప్లో పోటీ పడుతోంది. దీంతో నెట్ఫ్లిక్స్లో నాన్-ఇంగ్లిష్ మూవీస్ విభాగంలో ఈ చిత్రం గ్లోబల్గా 5వ స్థానంలో ట్రెండ్ అవుతోంది. ‘కోర్ట్’ మూవీని చూశారా? COMMENT
గుజరాత్లోని కచ్ ప్రాంతంలో ఉండే బుంగా ఇళ్లు ఎంతో ప్రత్యేకమైనవి. ఈ ప్రాంతంలో వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతతో పాటు శీతాకాలంలో విపరీతమైన చలి ఉంటుంది. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో బుంగా ఇళ్లు ప్రజలను వేసవిలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉంచుతాయి. ఈ ఇళ్లు భూకంపాలను సైతం తట్టుకుంటాయని అక్కడి ప్రజలు చెబుతున్నారు. బుంగాను మట్టి ఇటుకలు, మట్టి, పశువుల పేడ, గడ్డి మిశ్రమం, వెదురును ఉపయోగించి నిర్మిస్తారు.
ఆండ్రాయిడ్ డివైజ్లు డేటా చోరీకి గురి కాకుండా ఉండేందుకు IOS ఇనాక్టివిటీ రీబూట్ ఫంక్షన్ తరహాలో కొత్త ఫీచర్ రానుంది. 3 రోజులపాటు ఫోన్ లాక్ అయి ఉండడం లేదా ఉపయోగించకుండా ఉంటే ఫోన్ ఆటోమేటిక్గా రీస్టార్ట్ అయి హై సెక్యూరిటీ మోడ్లోకి వెళ్తుంది. ఫింగర్ ప్రింట్, ఫేస్ అన్లాక్ ఫీచర్లు డిసేబుల్ అవుతాయి. ఫోన్ మళ్లీ వాడాలంటే పాస్ కోడ్ ఎంటర్ చేయాలి. గూగుల్ ప్లే సర్వీసెస్ వెర్షన్ 25.14తో ఈ ఫీచర్ రానుంది.
బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,050 పెరిగి రూ.89,200కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,140 పెరిగి రూ.97,310 వద్ద కొనసాగుతోంది. అటు కేజీ వెండిపై రూ.100 పెరిగి రూ.1,10,100గా ఉంది. అతి త్వరలోనే తులం బంగారం రూ.లక్షకు చేరే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
Sorry, no posts matched your criteria.