news

News September 5, 2025

రేపు నిమజ్జనం.. మెట్రో టైమింగ్స్ పొడిగింపు

image

రేపు HYDలోని ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం నేపథ్యంలో మెట్రో రైలు సమయాన్ని పొడిగించింది. తొలి ట్రైన్ రేపు ఉదయం 6 గంటలకు, చివరి ట్రైన్ అర్ధరాత్రి ఒంటి గంటకు అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి బయలుదేరుతాయని తెలిపింది. ప్రయాణికులు, భక్తులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కోరింది. ఎలాంటి ఇబ్బందులు పడకుండా వేడుకలు చేసుకోవాలని సూచించింది.

News September 5, 2025

అనిల్ అంబానీ రుణ ఖాతాలు మోసపూరితం: బ్యాంక్ ఆఫ్ బరోడా

image

రిలయన్స్ కమ్యూనికేషన్స్, దాని మాజీ డైరెక్టర్ అనిల్ అంబానీ రుణఖాతాలు మోసపూరితమని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించినట్టు Stock Exchangesకు ఆ సంస్థ సమాచారం ఇచ్చింది. అయితే BOB ఆరోపణలను ఖండిస్తున్నట్టు అనిల్ అధికార ప్రతినిధి తెలిపారు. సమస్య పరిష్కారం కోసం ఆయన న్యాయ సలహాలు తీసుకుంటారని వెల్లడించారు.

News September 5, 2025

జాతీయ అవార్డులు అందుకున్న ఉత్తమ తెలుగు టీచర్లు

image

ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఉత్తమ ఉపాధ్యాయులకు జాతీయ అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేశారు. దేశవ్యాప్తంగా 45 మంది టీచర్లు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఏపీ నుంచి తిరుమల శ్రీదేవి(HM-పండిట్ నెహ్రూ GVMC మున్సిపల్ హైస్కూల్), తెలంగాణ నుంచి పవిత్ర(పెన్‌పహడ్ స్కూల్) అవార్డు అందుకున్నారు. ఇక ప్రొఫెసర్ విభాగంలో ఏపీకి చెందిన ప్రొ.విజయలక్ష్మి, దేవానందకుమార్‌, TG నుంచి గోయల్, వినీత్‌ అవార్డులు స్వీకరించారు.

News September 5, 2025

బాత్రూమ్‌లో ఫోన్ వాడకం.. పైల్స్‌కు ఆహ్వానం!

image

మలవిసర్జనకు వెళ్లినప్పుడు ఫోన్ వాడటం వల్ల హెమోరాయిడ్స్ (పైల్స్) ప్రమాదం పెరగొచ్చని బోస్టన్‌లోని బెత్ ఇస్రాయెల్ డీకొనెస్ మెడికల్ సెంటర్ పరిశోధనలో వెల్లడైంది. బాత్రూమ్‌లో ఫోన్ వాడని వారితో పోల్చితే వాడేవారికి హెమోరాయిడ్స్ వచ్చే ప్రమాదం 46% ఎక్కువగా ఉంది. వీరు ఒక్కోసారి 5 నిమిషాల కంటే ఎక్కువ సమయం గడుపుతున్నట్లు తేలింది. ఇది సమయాన్ని వృథా చేయడంతో పాటు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని తెలిపింది.

News September 5, 2025

ఈ స్కిల్స్ ఉంటేనే కార్పొరేట్ జాబ్స్(1/2)

image

కార్పొరేట్ రంగంలో పోటీని తట్టుకుని నిలబడాలంటే టెక్నికల్ స్కిల్స్‌‌తోపాటు సాఫ్ట్ స్కిల్స్ కూడా అవసరం. నిత్యం అప్​గ్రేడ్ అవుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఆఫీస్​ వర్క్​ కల్చర్‌లో మార్పులను అర్థం చేసుకుని, నేర్చుకుని ముందుకెళ్లాలి. ఈ రంగంలో రాణించాలంటే క్రిటికల్‌ థింకింగ్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, క్రియేటివిటీ, కొలాబరేషన్ లాంటి నాలుగు ‘C’లు అవసరమని నిపుణులు చెబుతున్నారు.

News September 5, 2025

ఈ స్కిల్స్ ఉంటేనే కార్పొరేట్ జాబ్స్(2/2)

image

Critical Thinking: ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచిస్తూ నిత్యనూతనంగా ఉండాలి. సమస్యలను విశ్లేషించి స్మార్ట్‌ నిర్ణయాలు తీసుకోవాలి.
Communication Skills: ఉద్యోగ జీవితంలో భావవ్యక్తీకరణ కీలకం. అప్పుడే రాణించగలం.
Creativity: క్రియేటివిటీగా ఆలోచించి, సమస్యలకు పరిష్కారాలు చూపగలగాలి. టెక్నాలజీలపై అప్డేట్‌గా ఉండాలి.
Collaboration: వ్యక్తిగతంగా కంటే టీమ్‌తో కలిసి పనిచేసే స్కిల్ ఉంటేనే గుర్తింపు పొందుతారు.

News September 5, 2025

NATURE- TEACHER: ప్రకృతి నేర్పే జీవిత పాఠాలు

image

*నీటి ప్రవాహానికి ఎదురీదడం సులభం కాదు. కానీ సాల్మన్ చేపలు ఎదురీదుతాయి. పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమేనని ఇవి మనకు తెలియజేస్తాయి.
* వెదురు చెట్టు తుఫానుకు వంగిపోతుంది. కానీ విరగదు. తగ్గగానే నిటారుగా నిల్చుంటుంది. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు తలవంచినా, తర్వాత సర్దుకొని నిలబడాలి.
* సాలీడు ఓపికగా, శ్రద్ధగా గూడును అల్లుకుంటుంది. గెలుపు కోసం ఇంతకంటే గొప్ప సూత్రమేముంటుంది. SHARE IT

News September 5, 2025

ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ గణపతి హోమం

image

TG: మాజీ సీఎం కేసీఆర్‌ ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో గణపతి హోమం చేయిస్తున్నారు. తన సతీమణి శోభతో కలిసి పూజలో పాల్గొన్నారు. ప్రతి ఏటా వినాయక చవితి నవరాత్రుల్లో కేసీఆర్ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మరోవైపు కేటీఆర్ 5 రోజులుగా ఫామ్‌హౌస్‌లోనే ఉన్నారు. అటు హరీశ్ రావు రేపు లండన్ నుంచి హైదరాబాద్ రానున్నారు. నేరుగా ఫామ్‌హౌస్‌కు వెళ్లి కవిత ఆరోపణలపై చర్చించే అవకాశం ఉంది.
*File photo

News September 5, 2025

అమరావతిలో ఐకానిక్ బ్రిడ్జి.. ఓటు వేయండి!

image

AP: అమరావతిలోని రాయపూడి నుంచి ఎన్టీఆర్ జిల్లా మూలపాడు వరకు ప్రభుత్వం 5 కి.మీ. పొడవైన ఐకానిక్ బ్రిడ్జిని నిర్మించనుంది. ఇప్పటికే 4 ప్రత్యేక డిజైన్లు ఎంపిక చేసింది. వాటిలో ఒకదాన్ని ఫైనల్ చేసే అవకాశాన్ని ప్రజలకు ఇచ్చింది. <>crda.ap.gov.in<<>>లోకి వెళ్లి 4 ఆప్షన్లలో మీకు నచ్చిన దానికి ఓటు వేయొచ్చు. ఈ వంతెన అమరావతి-హైదరాబాద్ హైవేను కలపనుంది. ఇప్పటికే వెస్ట్ బైపాస్‌లో భాగంగా ఒక వంతెన పూర్తయింది.

News September 5, 2025

RCB ఎఫెక్ట్.. చిన్నస్వామి స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే..

image

RCB విజయోత్సవ ర్యాలీలో తొక్కిసలాట ఘటన ఎఫెక్ట్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంపై ఇంకా పోలేదు. కర్ణాటక స్టేట్ క్రికెట్ లీగ్‌లో ఇది కూడా ఒక వేదిక. సేఫ్టీ దృష్ట్యా ఇక్కడ ప్రేక్షకులు లేకుండానే మ్యాచులు నిర్వహించనున్నట్లు క్రిక్‌ఇన్ఫో పేర్కొంది. సెమీ ఫైనల్, ఫైనల్ కూడా అభిమానులు లేకుండానే నిర్వహిస్తారని తెలిపింది. జూన్ 4న RCB విక్టరీ పరేడ్‌లో తొక్కిసలాట జరిగి 11మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.