India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సూపర్ స్టార్ మహేశ్బాబుతో తీస్తోన్న ‘SSMB29’ సినిమా టైటిల్ ప్రకటనకు దర్శకధీరుడు రాజమౌళి HYDలో భారీ ఈవెంట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. మూవీ టైటిల్ను ‘వారణాసి’గా ఫిక్స్ చేశారని సినీవర్గాలు చెబుతున్నాయి. ఈవెంట్ను నవంబర్ 16న నిర్వహించనున్నట్లు పేర్కొన్నాయి. ఇందులో 3 నిమిషాల కంటెంట్తో టైటిల్ గ్లింప్స్ వీడియోను సైతం రిలీజ్ చేస్తారని సమాచారం. ఈవెంట్పై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

➤ ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా.. జనవరి 2వ వారంలో పూర్తిస్థాయి వాదనలు విని తీర్పు వెల్లడిస్తామన్న SC
➤ నాగర్ కర్నూల్(D) మన్నెవారిపల్లి SLBC టన్నెల్ ప్రాంతంలో CM రేవంత్ పర్యటన
➤ చేవెళ్ల రోడ్డు ప్రమాదం: బస్సు, టిప్పర్ డ్రైవర్ల మృతితో తప్పు ఎవరిదనేది ఇప్పుడే చెప్పలేం: సైబరాబాద్ సీపీ
➤ జోగి రమేశ్కు వైద్య పరీక్షల సమయంలో ఆస్పత్రిలో అద్దాలు పగులగొట్టారని ఆయన భార్య, కుమారుడిపై కేసు నమోదు

TG: రంగారెడ్డి జిల్లాలో <<18184089>>బస్సు ప్రమాదానికి<<>> కారణమైన టిప్పర్ డ్రైవర్ను పోలీసులు గుర్తించారు. అతడు మహారాష్ట్రకు చెందిన ఆకాశ్ అని వెల్లడించారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన లచ్చానాయక్ దగ్గర డ్రైవర్గా పని చేస్తున్నాడని తెలిపారు. హైదరాబాద్ శివారు పటాన్చెరులోని క్రషర్ మిల్లు నుంచి వికారాబాద్కు కంకర తీసుకెళ్తుండగా మీర్జాగూడ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆకాశ్ కూడా చనిపోయాడు.

రష్యా ఆయిల్ కంపెనీలపై US ఆంక్షల నేపథ్యంలో చైనా తమ చమురు నిల్వలను భారీగా పెంచుకుంటోంది. 2025లో తొలి 9 నెలల్లో చైనా రోజుకు 11M బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకున్నట్లు వాల్స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఇందులో 1-1.2M బ్యారెళ్లను నిల్వల కోసం దారి మళ్లించినట్లు వివరించింది. చమురు అవసరాల కోసం ఆ దేశం 70% విదేశాలపైనే ఆధారపడుతోంది. చైనా చమురు నిల్వల సామర్థ్యం 2 బిలియన్ బ్యారెళ్లకు పైగా ఉందని అంచనా.

కర్ణాటకలో సీఎం మార్పు గురించి ఇటీవల జోరుగా చర్చ జరుగుతోంది. ఇదే విషయాన్ని మీడియా ప్రశ్నించగా CM సిద్దరామయ్య సీరియస్ అయ్యారు. ‘అడగడానికి ఇంకేం ప్రశ్నలు లేవా? ప్రజలు తమకు నచ్చిన దాని గురించి మాట్లాడుకోనీయండి. హైకమాండ్ ఎవరు? సోనియాగాంధీ, రాహుల్, మల్లికార్జున ఖర్గే చెప్పారా దీని గురించి’ అని ప్రశ్నించారు. బిహార్ ఎన్నికల తర్వాత క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణపై అధిష్ఠానంతో మాట్లాడతానని తెలిపారు.

జనాభా పెరుగుదలకు సరిపడే ఆహారం ఉత్పత్తి చేయవచ్చు. కోళ్లు, మేకలు, పందులు, గొర్రెలు, పశువుల పెంపకం వల్ల వచ్చే వ్యర్థాలను సమర్థంగా వినియోగించి భూసారాన్ని పెంచవచ్చు. సేంద్రియ ఎరువుల వాడకంతో సాగుకు పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుతుంది. సమగ్ర వ్యవసాయం నుంచి వచ్చే గుడ్లు, పాలు, పుట్టగొడుగులు, కూరగాయలు, తేనే వల్ల రైతులకు నికర ఆదాయం లభిస్తుంది. సమగ్ర వ్యవసాయంతో ఏడాది పొడవునా ఉపాధి, రైతులకు ఆదాయం లభిస్తుంది.

21మంది చనిపోయిన మీర్జాగూడ రోడ్డు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. కాలేజీకి వెళ్తున్న స్టూడెంట్స్, ఉపాధి కోసం బయల్దేరిన కూలీలు, ఆస్పత్రిలో చికిత్స కోసం బస్సెక్కిన ఫ్యామిలీ, రైలు మిస్ కావడంతో బస్ అందుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. ఇలా ప్రతి ఒక్కరిదీ ఒక్కో కథ, కల. కానీ అవన్నీ ఒక్క ప్రమాదంతో కల్లలయ్యాయి. కంకర టిప్పర్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు అందరి జీవితాలకు రాళ్ల సమాధి కట్టింది.

వీధికుక్కల వ్యవహారంలో AP సహా పలు రాష్ట్రాల CSలు సుప్రీంకోర్టు ముందు హాజరయ్యారు. అఫిడవిట్ల దాఖలు ఆలస్యానికి వారు క్షమాపణలు చెప్పారని సొలిసిటర్ జనరల్ కోర్టుకు నివేదించారు. తాము Oct 29నే అఫిడవిట్ ఇచ్చామని AP CS తెలిపారు. రాష్ట్రాల అఫిడవిట్ల ఆధారంగా స్ట్రే డాగ్స్ కోసం ఛార్ట్ రూపొందించాలని అమికస్ క్యూరీకి SC సూచించింది. కాగా కేసులో కుక్కకాటు బాధితులను ప్రతివాదులుగా చేర్చేందుకు కోర్టు అంగీకరించింది.

యస్య ద్విరద వక్త్రాద్యాః పారిషద్యా పరశ్శతమ్|
విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే||
‘విష్ణు సేనాధిపతి విష్వక్సేనుడికి గణపతి సహా 100+ పరివార దేవతలున్నారు. ఆ పరివారంతో కలిసి ఆయన భక్తుల ఆటంకాలను, విఘ్నాలను నిత్యం తొలగిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ విఘ్న నివారకుడైన విష్వక్సేనుడిని నేను ఆశ్రయిస్తున్నాను’ అని దీనర్థం. శుభకార్యాలు నిర్విఘ్నంగా జరగడానికి విష్వక్సేనుడిని పూజించాలని శాస్త్రవచనం. <<-se>>#NAMAMSARAM<<>>

చర్మసమస్యలను నివారించడంలో కుంకుమాది తైలం ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని మాయిశ్చరైజర్, మసాజ్ క్రీమ్లతో కలిపి వాడుకోవచ్చు. ముడతలు, నల్ల మచ్చలు, ఫైన్ లైన్స్, పిగ్మెంటేషన్, వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో ఇది ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. మొటిమలు ఉన్నవారు దీన్ని వాడకూడదని నిపుణులు చెబుతున్నారు. బాదం, నువ్వులనూనెతో కలిపి అప్లై చేస్తే సీరంలాగా ఉపయోగపడుతుంది.
Sorry, no posts matched your criteria.