news

News April 17, 2025

మత్స్యకారులకు డబుల్ ధమాకా

image

AP: రాష్ట్రంలోని మత్స్యకారులకు వేట నిషేధ భృతి రెట్టింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వం ఇచ్చిన రూ.10 వేలకు మరో రూ.10 వేలు కలిపి రూ.20 వేలు ఇవ్వాలని భావించింది. దీంతో 1,22,968 మంది జాలర్లకు లబ్ధి చేకూరనుంది. ఈ నెల 26న లబ్ధిదారుల అకౌంట్లలో నిధులు జమ చేయనుంది. కాగా ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు వేట నిషేధం అమల్లో ఉంటుంది. ఆ సమయంలో జీవన భృతితోపాటు బియ్యం అందించనుంది.

News April 17, 2025

అల్లు అర్జున్‌కు మరో ఇన్‌స్టా అకౌంట్!

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రైవేట్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను మెయింటేన్ చేస్తున్నట్లు సమాచారం. ‘బన్నీ బాయ్ ప్రైవేట్’ పేరుతో ఉన్న అకౌంట్‌ అల్లు అర్జున్‌దే అని అభిమానులు గుర్తించారు. ఈ అకౌంట్‌ను ఆయన భార్య స్నేహ, సమంత, త్రిష, రానా, ఉపాసన, నిహారిక వంటి స్టార్లు ఫాలో అవుతున్నారు. ఈ అకౌంట్‌లో 1380 పోస్టులు చేయగా, బన్నీ 494 మందిని ఫాలో అవుతున్నారు. ఇందులో తన క్లోజ్ ఫ్రెండ్స్‌తో బన్నీ మీమ్స్ షేర్ చేస్తారట.

News April 17, 2025

మోదీ అమరావతి షెడ్యూల్ ఖరారు

image

ఏపీ రాజధాని అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. మే 2న సాయంత్రం 4 గంటలకు రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించనున్నారు. వెలగపూడిలోని సచివాలయం వెనుక బహిరంగ సభ వేదికను ఖరారు చేసి, చదును పనులను ప్రభుత్వం ఇప్పటికే చేపట్టింది. 100 ఎకరాల్లో వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 2-3 లక్షల మందిని సభకు తీసుకొచ్చేలా ప్రణాళిక చేస్తున్నారు.

News April 17, 2025

SRH vs MI: ఈరోజేనా 300 లోడింగ్!

image

IPLలో ఇవాళ SRH, MI మధ్య మ్యాచ్ జరగనుంది. దీంతో SRH ఫ్యాన్స్ 300 లోడింగ్ అంటూ మళ్లీ నెట్టింట సందడి చేస్తున్నారు. వాంఖడే స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలం కావడం, అభిషేక్, హెడ్ ఫామ్‌లో ఉండడంతో ఈ ఫీట్ అందుకోవడం సాధ్యమేనని కామెంట్లు చేస్తున్నారు. ఓపెనర్లు తుఫాన్ ఇన్నింగ్స్ ఆడితే రికార్డు క్రియేట్ చేయడం ఖాయమంటున్నారు. కాగా ఈ మ్యాచులో 300 స్కోర్ పక్కా అని <<16106276>>డేల్ స్టెయిన్<<>> గతంలోనే ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

News April 17, 2025

ప్రపంచంలో మొట్టమొదటి స్పెర్మ్ రేస్.. ఎక్కడంటే?

image

లాస్ ఏంజెలిస్‌లో ప్రపంచంలోనే తొలిసారిగా స్పెర్మ్ రేస్ ఈ నెల 25న జరగబోతోంది. తగ్గుతున్న పురుషుల సంతానోత్పత్తి రేటుపై అవగాహన కల్పించేందుకు స్పెర్మ్ రేస్ అనే స్టార్టప్ కంపెనీ ఈ వినూత్న కార్యక్రమం చేపడుతోంది. ఈ రేస్‌లో 1,000 మంది పాల్గొంటారు. వీర్యం నమూనాలను 20 సెం.మీ పొడవైన మైక్రోస్కోపిక్ రేస్ ట్రాక్‌పై ఉంచుతారు. ఏ నమూనా స్పెర్మ్ ముందుగా ఫినిష్ లైన్ చేరుకుంటుందో దానిని విజేతగా ప్రకటిస్తారు.

News April 17, 2025

వెబ్‌సైటులో ఇంటర్ షార్ట్ మెమోలు

image

AP: 2024-25 విద్యాసంవత్సరం మార్కుల మెమోలను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. విద్యార్థులు వెబ్‌సైటులో రోల్ నంబర్, పాస్ ఇయర్, కోర్సు, పుట్టినతేదీ ఎంటర్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇటీవల విడుదల చేసిన ఫలితాల్లో ఫస్టియర్‌లో 70శాతం, సెకండ్ ఇయర్‌లో 83శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మెమో డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News April 17, 2025

మొన్న ఓడించిన రనౌట్లే.. నిన్న గెలిపించాయి!

image

IPL: APR 13న ముంబై నిర్దేశించిన 205 పరుగులను ఛేదిస్తూ హ్యాట్రిక్ రనౌట్ల వల్ల ఢిల్లీ మ్యాచ్ ఓడిపోయిన విషయం తెలిసిందే. నిన్న RR మ్యాచ్‌లో అవే రనౌట్లు గెలిపించాయి. స్టార్క్ వేసిన 20వ ఓవర్లో చివరి బంతికి జురెల్ రనౌట్ కావడంతో మ్యాచ్ టై అయింది. ఆ తర్వాత సూపర్ ఓవర్లో 5 బంతుల్లోనే పరాగ్, జైస్వాల్ రనౌట్లు కావడంతో RR 11 పరుగులకే పరిమితమైంది. 12 రన్స్ లక్ష్యాన్ని ఈజీగా ఛేదించి DC మ్యాచ్ గెలిచింది.

News April 17, 2025

అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌కు ఉద్వాసన!

image

టీమ్ ఇండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌కు BCCI ఉద్వాసన పలకనున్నట్లు తెలుస్తోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత పేలవ ప్రదర్శనకు బాధ్యుడిని చేస్తూ అతడిని తప్పిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ఫీల్డింగ్ కోచ్ దిలీప్, ట్రైనర్ సోహమ్‌ దేశాయ్‌ను కూడా వదిలేస్తున్నట్లు సమాచారం. కాగా అభిషేక్‌ను 7 నెలల క్రితమే బీసీసీఐ అసిస్టెంట్ కోచ్‌గా నియమించింది. స్వల్పకాలంలోనే అతడిని పక్కనబెట్టబోతోంది.

News April 17, 2025

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌ పోస్టులకు నోటిఫికేషన్

image

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 309 పోస్టులకు గానూ ఏప్రిల్ 25న అప్లికేషన్ ప్రక్రియ మొదలవుతుంది. మే 24వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధింత విభాగంలో బీఎస్సీ, బీటెక్ లేదా బీఈలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News April 17, 2025

ఆరు రోజుల పాటు వర్షాలు

image

TG: ఆవర్తన ద్రోణి వల్ల రాష్ట్రంలో రానున్న 6 రోజులు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వానలు లేని ప్రాంతాల్లో రాబోయే 3రోజులు 2-3°C ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. నేడు జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లోని పలుచోట్ల వర్షాలు పడతాయంది.