news

News April 17, 2025

IPL: రాజస్థాన్ కెప్టెన్‌ రిటైర్డ్ హర్ట్

image

ఢిల్లీతో మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగారు. అతడు 19 బంతుల్లో 3 సిక్సర్లు, 2 ఫోర్లతో 31 రన్స్ చేసి మంచి ఊపు మీద కనిపించారు. అంతలోనే పక్కటెముల గాయం వేధించడంతో మైదానాన్ని వీడారు. తర్వాతి మ్యాచుకు సంజూ అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. సంజూ దూరమైతే మాత్రం రాజస్థాన్‌కు పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు.

News April 16, 2025

రేపు సిట్ విచారణకు విజయసాయిరెడ్డి

image

ఏపీ లిక్కర్ స్కాం కేసులో రేపు సిట్ విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు వస్తానని అధికారులకు ఆయన సమాచారం ఇచ్చారు. కాగా ఈనెల 18న విచారణకు రావాలని సిట్ నోటీసులు పంపింది. ఒకరోజు ముందే హాజరవుతానని ఆయన కోరగా అధికారులు సమ్మతించారు. మరోవైపు ఇదే కేసులో ఈనెల 19న విచారణకు హాజరు కావాలని రాజ్ కసిరెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది.

News April 16, 2025

జపాన్ చేరుకున్న సీఎం రేవంత్ బృందం

image

TG: సీఎం రేవంత్ రెడ్డి బృందం జపాన్ చేరుకుంది. ఇప్పటికే తమిళనాడుకు చెందిన పలువురు ఎంపీలు అక్కడ ఉన్నారు. వీరందరికీ జపాన్‌లోని భారత రాయబారి శింబు జార్జ్ ఆతిథ్యం ఇచ్చారు. రేపు టోక్యోలోని సోనీ, జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ వంటి పలు సంస్థలతో CM భేటీ అవనున్నారు. ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఇవాళ రాత్రి జపాన్‌కు బయలుదేరనున్నారు.

News April 16, 2025

ప్రభాస్‌తో సినిమా తీయట్లేదు: ఇంద్రగంటి

image

రెబల్ స్టార్ ప్రభాస్‌తో తాను సినిమా చేస్తున్నానన్న వార్తల్లో నిజం లేదని ఇంద్రగంటి మోహన్ మోహనకృష్ణ తెలిపారు. ప్రియదర్శి హీరోగా తెరకెక్కిన ఆయన తాజా సినిమా ‘సారంగపాణి జాతకం’ ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తనకో డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందని, త్వరలోనే దాని వివరాల్ని వెల్లడిస్తానని పేర్కొన్నారు.

News April 16, 2025

తిన్న వెంటనే నిద్రపోతే..

image

మనలో చాలామంది భోజనం చేసిన వెంటనే నిద్రపోతారు. దీనివల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడంతో పాటు జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. గుండెల్లో మంట, అజీర్ణానికి కారణమవుతుంది. బరువు పెరగడం, ఊబకాయం వంటి సమస్యలు వస్తాయి. పడుకున్నప్పుడు కడుపు జీర్ణ రసాలు అన్నవాహికలోకి తిరిగి ప్రవహిస్తాయి. ఇది అసౌకర్యాన్ని కలిగిస్తుంది. భోజనం చేశాక కనీసం 15 నిమిషాలు నడవాలని, ఆ తర్వాతే నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

News April 16, 2025

నేనూ ఏఐ ఫొటోలు పోస్ట్ చేశా: కిషన్ రెడ్డి

image

TG: కంచ గచ్చిబౌలి వ్యవహారంలో ఏఐ ఫొటోలను పోస్ట్ చేసిన వారికి నోటీసులు ఇస్తుండటాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పుబట్టారు. తానూ ఆ ఫొటోలు పోస్ట్ చేశానని, కేసులు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. సీఎస్‌కు తెలియకుండా సీఎం రేవంత్ భూముల నిర్ణయం తీసుకున్నారని, ఆయనపైనా సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి కోరారు. ప్రభుత్వం 100 ఎకరాల్లో మళ్లీ చెట్లు నాటాలని డిమాండ్ చేశారు.

News April 16, 2025

ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన స్పాటిఫై

image

పాటల యాప్ స్పాటిఫై ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయింది. పాటలు వెతకడం నుంచి ఆర్టిస్ట్ ప్రొఫైల్ చూడటం వరకు వినియోగదారులు పలు సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. యాప్ హ్యాక్ అయిందన్న వార్తలు రాగా వాటిని సంస్థ కొట్టిపారేసింది. యాప్‌ను పునరుద్ధరించడంపై కృ‌షి చేస్తున్నామని, వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. పలు సమస్యలు వస్తున్నా యాప్‌లో యాడ్స్ మాత్రం కొనసాగుతుండటం గమనార్హం.

News April 16, 2025

పెళ్లి చేసుకున్న స్టార్ నటి

image

SVSC, దమ్ము, ఢమరుకం వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అభినయ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన చిన్ననాటి స్నేహితుడు కార్తీక్‌తో ఏడడుగులు వేశారు. పదిహేనేళ్ల నుంచి అభినయ, కార్తీక్ ప్రేమించుకుంటున్నారు. ఈక్రమంలోనే ఇవాళ పెళ్లితో ఒక్కటయ్యారు. కాగా పుట్టుకతోనే చెవిటి, మూగ అయిన అభినయ తన అద్భుతమైన నటనతో లక్షలాది అభిమానులను సొంతం చేసుకున్నారు.

News April 16, 2025

IPL: ఒకే ఓవర్‌లో 11 బంతులేశాడు

image

ఢిల్లీతో జరుగుతున్న మ్యాచులో రాజస్థాన్ బౌలర్ సందీప్ శర్మ ఆఖరి ఓవర్లో చెత్త ప్రదర్శన చేశారు. ఏకంగా 11 బంతులు వేయగా ఇందులో నాలుగు వైడ్లు, ఒక నోబాల్ ఉన్నాయి. సిక్సు, ఫోర్, నాలుగు సింగిల్స్ కలుపుకొని 19 పరుగులు సమర్పించుకున్నారు. దీంతో IPLలో ఒకే ఓవర్లో 11 బంతులు వేసిన నాలుగో బౌలర్‌గా నిలిచారు. అంతకుముందు తుషార్ దేశ్ పాండే, సిరాజ్, శార్దూల్ కూడా ఓవర్లో 11 బంతులు వేసి చెత్త రికార్డు మూటగట్టుకున్నారు.

News April 16, 2025

అమరావతి భూసమీకరణ వెనుక కుట్ర: నాని

image

AP: అమరావతిలో మరో 44 వేల ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంపై వైసీపీ నేత పేర్ని నాని మండిపడ్డారు. దీని వెనుక కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రజా ప్రయోజనం కోసం చంద్రబాబు ఎప్పుడూ ఆలోచించరని, త్వరలోనే అమరావతి మెగాసిటీ కుట్ర బయటకొస్తుందని పేర్ని నాని వెల్లడించారు.