India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పలు పోటీ పరీక్షల షెడ్యూల్ను APPSC విడుదల చేసింది. గిరిజన సంక్షేమ శాఖలో అసిస్టెంట్ ట్రైబల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 28న(9.30 నుంచి 12 వరకు) పేపర్-1, 30న పేపర్-2(ఉ.9.30 నుంచి 12 వరకు), మ.2.30 నుంచి 5 వరకు పేపర్-3 పరీక్షలు నిర్వహించనుంది. ఈ నెల 18న హాల్టికెట్లు రిలీజ్ అవుతాయి. అలాగే గ్రౌండ్ వాటర్ సర్వీసులో అసిస్టెంట్ కెమిస్ట్ ఉద్యోగాలకు APR 28, 29 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది.
సంగీత కార్యక్రమాల్లో తాను టెక్నాలజీ అధికంగా వాడుతాను అనేది సింగర్ అభిజిత్ అభిప్రాయమని దాన్ని గౌరవిస్తానని మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్ అన్నారు. అలా అన్నందుకు అతనిపై ద్వేషం లేదని, ఆయనకు కేక్స్ పంపిస్తానని తెలిపారు. ఛావా, పొన్నియన్ సెల్వన్ చిత్రాలకు వందల మంది టెక్నీషియన్లతో కార్యక్రమాలు నిర్వహించానన్నారు. కాగా రెహమాన్ టెక్నాలజీ వాడడంతో కళాకారులకు ఉపాధి లేకుండా పోతుందని అభిజిత్ ఆరోపించారు.
రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచులో ఢిల్లీ 20 ఓవర్లలో 188/5 రన్స్ చేసింది. ఓపెనర్ అభిషేక్ పొరెల్ 49 రన్స్ చేసి ఒక్క పరుగు తేడాతో హాఫ్ సెంచరీ మిస్ అయ్యారు. గత మ్యాచులో అదరగొట్టిన కరుణ్ నాయర్ను ఈసారి దురదృష్టం వెంటాడింది. ఖాతా తెరవకుండానే రనౌట్ అయ్యారు. అక్షర్ కెప్టెన్ ఇన్నింగ్స్(34) ఆడగా, రాహుల్ 38, స్టబ్స్ 34* రన్స్తో రాణించారు. RR బౌలర్లలో ఆర్చర్ 2, తీక్షణ, హసరంగా తలో వికెట్ తీశారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఈ నెల 20న ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ అగ్రనేతలు ప్రధాని మోదీ నివాసంలో సమావేశమయ్యారు. అధ్యక్ష పదవి రేసులో మోహన్ లాల్ ఖట్టర్, శివరాజ్ సింగ్ చౌహన్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు 18, 19 తేదీల్లో పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించనున్నట్లు సమాచారం.
జేఈఈ మెయిన్స్ ఫలితాలను NTA రేపు విడుదల చేయనుంది. B.E, B.Techలో ప్రవేశాల కోసం పరీక్ష రాసిన విద్యార్థులు అన్సర్ కీతో పాటు ఫలితాలను రేపు తెలుసుకోవచ్చు. ఇందుకోసం విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాగా ఏప్రిల్ 2,3,4,7,8 తేదీల్లో B.E, B.Tech ప్రవేశాల కోసం, ఏప్రిల్ 9న బీఆర్కే, బీప్లాన్ ఎంట్రన్స్ కోసం పరీక్షలు నిర్వహించారు.
వెబ్సైట్: <
మహారాష్ట్ర Dy.CM శిండేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కమెడియన్ కునాల్ కమ్రాను పోలీసులు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. దీంతో తనను అరెస్టు చేయొద్దని కోరుతూ బాంబే హైకోర్టును కమ్రా ఆశ్రయించగా కోర్టు తాత్కాలికంగా ఊరటనిచ్చింది. తీర్పును రిజర్వ్ చేశామని, అప్పటి వరకు కునాల్ను అరెస్ట్ చేయొద్దని పోలీసుల్ని ఆదేశించింది.
ఢిల్లీ బ్యాటర్ మెక్గర్క్ మరోసారి నిరాశపరిచారు. రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచులో రెండు ఫోర్లు కొట్టి ఊపు మీదున్నట్లు కనిపించినా 9 పరుగులకే ఔటయ్యారు. ఈ సీజన్లో 6 ఇన్నింగ్సుల్లో 55 పరుగులే చేశారు. ఇందులో అత్యధికం 38 రన్స్. గత ఏడాది 9 ఇన్నింగ్సుల్లో 330 పరుగులు చేసిన ఈ హిట్టర్ ఈ సారి తేలిపోతున్నారు. మరి తర్వాతి మ్యాచుల్లోనైనా ఫామ్ అందుకొని ఢిల్లీకి శుభారంభం అందిస్తారో లేదో వేచిచూడాలి.
తెలుగు రాష్ట్రాలకు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టును NDSA(నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ) ఛైర్మన్ అనిల్ జైన్ ఈ నెల 29న పరిశీలించనున్నారు. ప్రాజెక్టు సమస్యలు, భద్రతను తనిఖీ చేసిన అనంతరం ఇరు రాష్ట్రాల అధికారులతో భేటీ అవుతారు. అంతకంటే ముందు 28న ఏపీ అధికారులతో, 30న HYDలో తెలంగాణ అధికారులతో విడివిడిగా సమావేశమై చర్చలు జరపనున్నారు.
జాన్వీ కపూర్ చెల్లి ఖుషీ కపూర్ ప్రేమ వ్యవహారం మరోసారి చర్చకు దారితీసింది. నటుడు వేదాంగ్ రైనాతో ఆమె రిలేషన్లో ఉన్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఖుషీ V, K లెటర్స్ గల చైన్ను ధరించి దిగిన ఫొటోలను ఇన్స్టాలో పోస్ట్ చేశారు. క్యాప్షన్గా లవ్ ఎమోజీని పెట్టారు. తన ప్రేమను వ్యక్తపరచడానికే ఆమె ఇలా చేసినట్లు తెలుస్తోంది. గతేడాది మాల్దీవుల వెకేషన్లోనూ ఖుషీ V అక్షరం గల బ్రేస్లెట్ ధరించారు.
AUSలో గతేడాది జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 5వ టెస్టుకు దూరం కావడంపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ ‘ఆ సమయంలో సరిగా హిట్టింగ్ చేయలేకపోయా. అంతకుముందు టెస్టులో పక్కన పెట్టిన గిల్కు మరో అవకాశం ఇవ్వాలనుకున్నా. ఇదే విషయాన్ని కోచ్, సెలక్టర్కు చెప్పా. ఎవరైనా సరే జట్టుకు అవసరమైందే చేయాలి’ అని వ్యాఖ్యానించారు. కాగా ఆ సిరీస్లో భారత్ 1-3 తేడాతో ఓడిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.