India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: టీడీపీ <<16119914>>ఛాలెంజ్కు<<>> భూమన కరుణాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కనీసం జ్ఞానం లేకుండా టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు తిరుమలకు రావాలని సవాల్ విసురుతున్నారని మండిపడ్డారు. గోవులు తిరుమలలో కాదు తిరుపతిలో చనిపోయాయని అజ్ఞానంతో మాట్లాడుతూ రాజకీయాలు చేయటం సరికాదన్నారు. గోవులు చనిపోయాయని ఈవోనే చెప్పారని పేర్కొన్నారు. రేపు ఉ.10 గంటలకు తిరుపతి గోశాలలో కలుద్దామని ఛాలెంజ్ను స్వీకరించారు.
APలోని 30 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో టీడీపీ నుంచి 25, జనసేన నుంచి నలుగురు, బీజేపీ నుంచి ఒకరికి పదవులు దక్కాయి. అభ్యర్థుల ఎంపికలో ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. త్వరలోనే మిగతా మార్కెట్ కమిటీల ఛైర్మన్లను ప్రకటించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
TG: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. IAS అధికారిణి <<16116901>>స్మితా సబర్వాల్ చేసిన పోస్టుపై<<>> చట్ట ప్రకారం ముందుకెళ్తామని చెప్పారు. BJP నేతలు ఇచ్చిన తప్పుడు సమాచారంతోనే కంచ భూములపై మోదీ మాట్లాడారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేయాలని బీజేపీ, BRS కుట్ర పన్నుతున్నాయని విమర్శించారు. తమ ప్రభుత్వం కూలగొడితే కూలిపోయేది కాదని పేర్కొన్నారు.
రాజస్థాన్పై ఢిల్లీ ఓపెనర్ అభిషేక్ పోరెల్ విధ్వంసం సృష్టిస్తున్నారు. దేశ్పాండే వేసిన రెండో ఓవర్లో వరుసగా 4, 4, 6, 4, 4 బౌండరీలు బాదారు. చివరి బంతికి సింగిల్ తీయడంతో ఆ ఓవర్లో మొత్తం 23 రన్స్ వచ్చాయి.
ఢిల్లీకి చెందిన ఓ యువకుడి నిజాయితీ అతడికి US వీసా రాకుండా చేసింది. ఇంటర్వ్యూ కోసం అతడు ఎంబసీకి వెళ్లగా ‘మీకు USలో ఫ్యామిలీ/ఫ్రెండ్స్ ఉన్నారా’ అని ఆఫీసర్ ప్రశ్నించారు. ‘అవును, ఫ్లోరిడాలో నా గర్ల్ఫ్రెండ్ ఉంది. తనను కలవాలని ప్లాన్ చేసుకున్నా’ అని అతడు సమాధానమిచ్చాడు. అంతే మరో ప్రశ్న లేకుండా వీసా రిజెక్షన్ స్లిప్ చేతిలో పెట్టారు. ఈ విషయాన్ని బాధితుడు రెడ్డిట్లో పోస్ట్ చేయగా చర్చనీయాంశమైంది.
మనలో చాలామంది తడి టవల్స్ బెడ్ మీదే వేస్తుంటాం. వాటి గురించి పెద్దగా పట్టించుకోం. కానీ వాటిలోని తడి కారణంగా పరుపు, దుప్పట్లలో క్రిములు పెరిగే ప్రమాదం ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తడివే కాక విడిచిన దుస్తులు సైతం మన శరీరం నుంచి సూక్ష్మక్రిముల్ని బెడ్పైకి మోసుకెళ్తాయంటున్నారు. బయట తిరిగొచ్చి కాళ్లు కడగకుండా మంచంపైకి చేరడమూ అనారోగ్యాలకు కారణమవుతాయని వివరిస్తున్నారు.
యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత పర్యటన ఖరారైంది. ఈ నెల 18 నుంచి 24 వరకు ఇటలీ, ఇండియాలో కుటుంబ సమేతంగా పర్యటిస్తారని వైట్ హౌజ్ ప్రకటనలో పేర్కొంది. ఈ పర్యటనలో ఇరు దేశాధినేతలతో ఆర్థిక, భౌగోళిక రాజకీయ అంశాలపై ఆయన చర్చించనున్నారు. భారత్లో న్యూఢిల్లీ, జైపుర్, ఆగ్రా సందర్శిస్తారని పేర్కొంది. ఆయా నగరాల్లో పలు కార్యక్రమాల్లో కుటుంబ సమేతంగా పాల్గొననున్నారు. ఆయన భార్య ఉషా వాన్స్ భారత సంతతి మహిళ.
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ పేర్లను ఈడీ చేర్చిన అంశంలో కాంగ్రెస్ నేతలు ఆందోళనలు చేయడంపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. ‘కాంగ్రెస్ నేతలు ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం మానుకోవాలి. ధర్నాలు చేసినంత మాత్రాన వారి అవినీతి, అక్రమాలు సమసిపోవు. ప్రజలింకా బోఫోర్స్, బొగ్గు, 2జీ స్పెక్ట్రమ్, హెలికాప్టర్ల కుంభకోణాల్ని మర్చిపోలేదు. ఈ కేసు విచారణ జరగాలని కోర్టులు తేల్చి చెప్పాయి’ అని పేర్కొన్నారు.
గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్ జ్యూరీకి నటి జయసుధ ఛైర్పర్సన్గా వ్యవహరించనున్నారు. 15 మంది సభ్యులతో కూడిన ఈ జ్యూరీ తాజాగా FDCలో సమావేశమైంది. అవార్డుల ఎంపికలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని జ్యూరీ సభ్యులను TFDC ఛైర్మన్ దిల్ రాజు కోరారు. అన్ని విభాగాల్లో కలిపి 1,248 నామినేషన్స్ రాగా ఈ నెల 21 నుంచి జ్యూరీ సభ్యులు స్క్రీనింగ్ చేయనున్నారు. నిష్పక్షపాతంగా ప్రక్రియను హ్యాండిల్ చేస్తామని జయసుధ పేర్కొన్నారు.
AP: టీటీడీ గోశాలలో గోవులు పెద్దఎత్తున మరణించాయనే ప్రచారంపై TDP ఘాటుగా స్పందించింది. వైసీపీ చీఫ్ జగన్, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి రేపు తిరుమలకు రావాలని Xలో ఛాలెంజ్ చేసింది. గోశాలలో గోమాతలు ఎలా ఉన్నాయో కళ్లారా చూడాలంది. రేపు ఉ.10 గంటలకు లైవ్ ఇస్తామని పేర్కొంది.
Sorry, no posts matched your criteria.