India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: Hyd చుట్టూ 162KM మేర నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి సంబంధించిన DPR సిద్ధమైందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. LSలో MP ఈటల రాజేందర్ ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు తెలిపారు. భూసేకరణ వ్యయంలో 50% భారం పంచుకునేందుకు TG అంగీకరించిందన్నారు. రాయల్టీ మినహాయింపు, GSTలోని రాష్ట్ర వాటా చెల్లింపునకూ ఓకే చెప్పిందన్నారు. ఈ ఏడాది CRIF నుంచి రూ.367.17 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

ఇందుకు చాలా కారణాలున్నాయి. జాతకంలో శుక్రుడు నీచ స్థితిలో ఉండకూడదు. దీనివల్ల దోషం ఏర్పడి శుభ ఫలితాలు తగ్గుతాయి. సౌఖ్యాలు దూరమవుతాయి. శుక్రుడు రాహువు, కేతువు, శని గ్రహాలతో కలిసినా దోషం ఏర్పడుతుంది. ఇది వ్యక్తి నైతికతను, బంధాలను ప్రభావితం చేస్తుంది. జాతక చక్రంలో 6, 8, 12వ ఇళ్లలో శుక్రుడు ఉండటం మంచిది కాదు. ఉంటే అనారోగ్యం, అప్పులు కలుగుతాయి. పూర్వజన్మ కర్మల వల్ల కూడా శుక్ర దోషం ఏర్పడవచ్చు.

AP: ఈఏపీసెట్కు మార్చి 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి వెల్లడించింది. మే 12 నుంచి 20 వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపింది. 23న ప్రాథమిక కీ, జూన్ 1న ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉందని పేర్కొంది. ‘ఈసెట్కు మార్చి 2 వరకు అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్ 23న పరీక్ష, మే 7న రిజల్ట్స్ రిలీజ్ చేస్తాం. ఐసెట్కు మార్చి 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 2న పరీక్ష, 16 ఫలితాలు ప్రకటిస్తాం’ అని పేర్కొంది.

వేరుశనగను విత్తే ముందు నేల తడిచేలా నీరు పెట్టి తగినంత పదును ఉన్నప్పుడు విత్తనం వేసుకోవాలి. మొదటి తడిని మొలక వచ్చిన 20-25 రోజులకు ఇవ్వాలి. దీని వల్ల పైరు ఒకేసారి పూతకు వచ్చి, ఊడలు కూడా సరిగా ఏర్పడి దిగుబడి బాగుంటుంది. తర్వాత నేల లక్షణం, బంక మట్టి శాతాన్ని బట్టి 7-10 రోజులకు ఒక నీటి తడినివ్వాలి. చివరి తడిని పంట కోతకు 4-7 రోజుల మధ్య అందించాలి. దీని వల్ల మొక్కలు పీకడం సులభం. గింజలు నేలలో ఉండిపోవు.

<

జాతకంలో శుక్ర గ్రహం బలహీనంగా ఉండి ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు ఎదుర్కొంటుంటే శివలింగానికి యాలకులను సమర్పించాలి. ఇది అద్భుత పరిహారమని పండితుల సూచన. సోమవారం ఐదు పచ్చి యాలకులు శివలింగంపై ఉంచి పూజిస్తే శుక్ర దోషం తొలగి రాజయోగం పడుతుందని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఇలా రోజూ కూడా చేయవచ్చట. ఈ సువాసన భరిత పూజతో సమాజంలో గౌరవం, వ్యాపారంలో విజయం, వైవాహిక సుఖం మనశ్శాంతి లభిస్తాయని నమ్మకం.

AP: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయనున్న క్వాంటం వ్యాలీ నిర్మాణానికి రేపు శంకుస్థాపన జరగనుంది. అమరావతిలోని ఉద్దండరాయునిపాలెంలో 2.30PMకు సీఎం చంద్రబాబు భూమి పూజ చేస్తారు. తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రైతులు, విద్యార్థులతో ముచ్చటిస్తారు. కాగా ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 50 ఎకరాల భూమిని కేటాయించింది. ఇప్పటికే క్వాంటం శిక్షణ కోసం 50వేల మంది రిజిస్టర్ చేసుకున్నారు.

శుక్ర దోష నివారణ కోసం ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించాలి. లలితా సహస్రనామ పఠనం చేయాలి. తెల్లని వస్తువులు దానం చేస్తే శుభం కలుగుతుంది. పాలు, పెరుగు, బియ్యం, పంచదార, తెలుపు వస్త్రాలు పేదలకు దానం చేయాలి. ‘ఓం శుం శుక్రాయ నమః’ అనే మంత్రాన్ని జపిస్తే శుక్రుని అనుగ్రహం లభిస్తుంది. శుక్రవారం రోజున ఉపవాసం ఉండటం, తెలుపు దుస్తులు ధరించడం మంచిది. సుగంధ ద్రవ్యాలు వాడితే శుక్రుడు ప్రసన్నమవుతాడని నమ్మకం.

పశువుల పేడను సరైన విధానంలో వాడితే పంటకు మేలు చేస్తుంది. అయితే చాలా మంది రైతులు పచ్చి పశువుల పేడను నేరుగా పొలంలో చల్లుతుంటారు. దీని వల్ల పంటకు మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందంటున్నారు నిపుణులు. పచ్చి పేడలో ఉండే నులిపురుగులు మొక్క వేర్లను ఆశించి పంటను దెబ్బతీస్తాయి. అందుకే పేడను మగ్గబెట్టి వాడటం మంచిదని చెబుతున్నారు. దీని వల్ల భూసారం పెరగడంతో పాటు పంట దిగుబడి కూడా బాగుంటుందని చెబుతున్నారు.

ముందుగా పశువుల నుంచి వచ్చే పేడను ఒక దగ్గర వేయాలి. అందులో కాస్త తేమ ఉండేందుకు కొద్దిగా నీళ్లను చల్లుతూ ఉండాలి. పేడ బాగా మగ్గాలంటే కుప్పపై గాలి చొరబడకుండా ప్లాస్టిక్ కవరును గట్టిగా కప్పి ఉంచాలి. ఇలా 2 నుంచి 3 నెలల పాటు ఉంచి మధ్యలో అప్పుడప్పుడు కుప్పను పైకి కిందకు తిరగేయాలి. దీని వల్ల ఎరువు సమానంగా కుళ్లి మగ్గుతుంది. ఇలా బాగా మగ్గిన పశువుల ఎరువును వాడితే నేలసారం పెరిగి అధిక దిగుబడులు వస్తాయి.
Sorry, no posts matched your criteria.