news

News November 3, 2025

శివయ్య భక్తులకు TGRTC శుభవార్త

image

కార్తీక పౌర్ణమి వేళ అరుణాచలం వెళ్లాలనుకునే భక్తులకు TGRTC శుభవార్త చెప్పింది. నేరుగా హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్లేందుకు ప్రత్యేక సర్వీసులను ప్రవేశపెట్టింది. HYD దిల్‌షుక్‌నగర్ నుంచి అరుణాచలం గిరి ప్రదక్షిణ మార్గం వరకు ఈ బస్సులను నడుపుతోంది. హైదరాబాద్ నుంచి అరుణాచలంకు నేరుగా చేరుకోవడానికి సరైన రవాణా వ్యవస్థ లేకపోవడంతో భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

News November 3, 2025

కర్నూలు పవర్ ప్రాజెక్టుకు ₹7500 కోట్ల REC ఫండింగ్

image

AP: బ్రూక్‌ఫీల్డ్ క్లీన్ ఎనర్జీ సంస్థ ‘ఎవ్రెన్’ కర్నూలు జిల్లాలో ఏర్పాటుచేసే పవర్ ప్రాజెక్టుకు కేంద్ర సంస్థ REC ₹7500 కోట్లు అందించనుంది. ప్రైవేటు ప్రాజెక్టులో ఆర్ఈసీ అందించే అతిపెద్ద ఫండింగ్ ఇదే. 1.4 GW హైబ్రిడ్ ప్రాజెక్టుకు బ్రూక్‌ఫీల్డ్ ₹9910 కోట్లు వ్యయం చేయనుంది. ఎవ్రెన్ సంస్థలో 51.49% వాటా ఉన్న ఆ సంస్థ ఏపీలో మొత్తంగా 3 WG పవర్ ప్రాజెక్టుకు వీలుగా ప్రణాళికలు సిద్ధం చేసింది.

News November 3, 2025

PHOTO OF THE DAY

image

భారత మహిళా జట్టు తొలిసారి ప్రపంచ కప్ గెలవడంతో 140కోట్ల మంది భారతీయుల కళ్లు చెమ్మగిల్లాయి. ఈ భావోద్వేగ సమయంలో స్టేడియంలోనూ అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. కెప్టెన్ కౌర్, తమ <<18182384>>కోచ్<<>> అమోల్ మజుందార్ పాదాలను తాకి కృతజ్ఞతాభావాన్ని చాటుకున్నారు. ఇది గురు-శిష్యుల బంధాన్ని, భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తోంది. డొమెస్టిక్‌‌ క్రికెట్లో పరుగుల వరద పారించినా అమోల్‌కు అప్పట్లో INDకి ఆడే ఛాన్స్ రాకపోవడం గమనార్హం.

News November 3, 2025

పిల్లల్లో RSV ఇన్ఫెక్షన్

image

రెస్పిరేటరీ సిన్సిషియల్‌ వైరస్‌ వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్‌ని బ్రాంకియోలైటిస్‌ అంటారు. ఇది ఏడాదిలోపు పిల్లల్లో ఎక్కువగా వస్తుంది. పెద్దలకూ రావొచ్చు. 3,4 రోజుల తర్వాత లక్షణాల తీవ్రత పెరుగుతుంది. దగ్గు, జలుబు, జ్వరంతో ఖంగుమని ఏకధాటిగా దగ్గుతుంటారు. కొంతమంది పిల్లల్లో ఆయాసం వచ్చి, ఆక్సిజన్‌ లెవెల్‌ తగ్గుతుంది. విపరీతమైన ఆయాసం ఉన్నా, ఫీడింగ్‌ సరిగా లేకపోయినా పిల్లల్ని హాస్పిటల్‌లో ఉంచే వైద్యం చేయాలి.

News November 3, 2025

KTR .. నిరూపించకపోతే ముక్కు నేలకు రాస్తావా: పొంగులేటి

image

TG: తన <<18177278>>ఇల్లు<<>> FTL పరిధిలో ఉందని నిరూపిస్తే తానే పడగొడతానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. లేకపోతే అప్పా జంక్షన్‌లో ముక్కు నేలకు రాస్తారా? అంటూ KTRకు ప్రతి సవాల్ చేశారు. లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఎవరికిచ్చారని ప్రశ్నించారు. 500 రోజుల్లో అధికారంలోకి వస్తామన్న మాటల వెనుక BRS ఆలోచన ఏంటో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. గులాబీ నేతల కుట్రలు, కుతంత్రాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.

News November 3, 2025

RSV ఇన్ఫెక్షన్‌ను ఎలా నివారించాలంటే?

image

వర్షాకాలం, చలికాలంలో ఇన్‌ఫెక్షన్లు ప్రబలినప్పుడు గుంపులోకి వెళ్లకుండా జాగ్రత్తపడాలి. బిడ్డను తీసుకొని ఫంక్షన్లకు వెళ్లకూడదు. దగ్గు, జలుబు ఉన్నవాళ్లకు తల్లిదండ్రులు, పిల్లలు దూరంగా ఉండాలి. సరైన ఇమ్యూనిటీ లేని పిల్లలకు RSV ఇమ్యూనోగ్లోబ్యులిన్‌ వ్యాక్సిన్‌ ఇస్తారు. పిల్లల్లో లక్షణాలు ఎక్కువగా ఉంటే వెంటనే నిర్లక్ష్యం చేయకుండా హాస్పిటల్‌కు తీసుకెళ్లాలి. పిల్లలకు పోషకాలున్న ఆహారం ఎక్కువగా ఇవ్వాలి.

News November 3, 2025

ESICలో 94 పోస్టులు

image

ESIC ఫరీదాబాద్‌లో 94 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. సంబంధిత విభాగంలో ఎండీ, డీఎన్‌బీ, ఎంఎస్ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 7న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గల వారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.500, SC, STలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://esic.gov.in/

News November 3, 2025

ఇలా చేస్తే తిరుమలలో వేగంగా దర్శనం!

image

శ్రీవారి దర్శనానికి ఎన్నో దారులున్నాయి. వీటిలో రక్తదానం చేసినవారికి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉంటుంది. రక్తదానాన్ని ప్రోత్సహించేందుకు దీనిని 1985లో ప్రారంభించినా చాలామందికి ఇది తెలియదు. రక్తదాతలకు రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్‌తో పాటు ఒక లడ్డూ & ప్రశంసాపత్రాన్ని అందిస్తారు. ఇందుకోసం కొండపై ఉన్న అశ్విని ఆస్పత్రిలో రోజూ పరిమిత వ్యక్తులు రక్తదానం చేసేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. Share it

News November 3, 2025

వరల్డ్ కప్ విన్.. BJP&కాంగ్రెస్ శ్రేణుల ఫైట్

image

ప్రధాని మోదీ హాజరైతే అందులో భారత్‌కు ఓటమి తప్పదని కాంగ్రెస్ శ్రేణులు ట్వీట్లు చేస్తున్నాయి. ‘మోదీ హాజరైన చంద్రయాన్-2 & 2023 క్రికెట్ ప్రపంచకప్‌లో భారత్ విఫలమైంది. అదే మోదీ గైర్హాజరైన చంద్రయాన్-3, 2024 T20 WC, 2025 WWC వంటి వాటిలో భారత్ గెలిచింది. అంటే మోదీ హాజరుకు, వైఫల్యానికి సంబంధం ఉంది’ అని సెటైర్ వేస్తున్నాయి. రాహుల్ గాంధీ ఉండటం వల్లే కాంగ్రెస్ ఓడిపోతోందని బీజేపీ నేతలు కౌంటరిస్తున్నారు.

News November 3, 2025

విషాదం.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి

image

TG: రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర <<18183462>>బస్సు ప్రమాదంలో<<>> ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు మరణించారు. తాండూరుకు చెందిన ఎల్లయ్య గౌడ్‌‌కు నలుగురు కూతుళ్లు, ఒక కుమారుడు. పెద్ద కూతురి పెళ్లి కోసం ముగ్గురు కూతుళ్లు నందిని (డిగ్రీ ఫస్టియర్), సాయిప్రియ (డిగ్రీ థర్డ్ ఇయర్), తనూష (ఎంబీఏ) హైదరాబాద్‌ నుంచి సొంతూరుకు వచ్చారు. ఈ తెల్లవారుజామున తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా బస్సు ప్రమాదం జరిగి చనిపోయారు.