news

News April 16, 2025

NEET-PG నోటిఫికేషన్ విడుదల

image

వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే జాతీయ స్థాయి అర్హత పరీక్ష NEET-PG <>దరఖాస్తులు<<>> రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి స్వీకరించనున్నట్లు NBEMS ప్రకటించింది. అప్లికేషన్లకు చివరి తేదీ మే 7 రాత్రి 11.55 గంటలుగా పేర్కొంది. నీట్-పీజీ ఎగ్జామ్ జూన్ 15న CBT విధానంలో రెండు షిఫ్టుల్లో నిర్వహించనుంది. జులై 15న ఫలితాలు విడుదల చేయనుంది.

News April 16, 2025

పీఎం ఇంటర్న్‌షిప్ దరఖాస్తుల గడువు పొడిగింపు

image

పీఎం ఇంటర్న్‌షిప్ స్కీం దరఖాస్తుల గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. ఈనెల 22 వరకు అప్లై చేసుకోవచ్చని తెలిపింది. ఈ స్కీంలో భాగంగా నిరుద్యోగ యువతకు దేశంలోని 500 కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పిస్తుంది. ఏడాది పాటు నెలకు రూ.5 వేల చొప్పున డైరెక్ట్‌గా అభ్యర్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. https://pminternship.mca.gov.in/login/ సైట్‌లో అప్లై చేసుకోవచ్చు. 21-24 ఏళ్లవారు అర్హులు.

News April 16, 2025

IPL: టాస్ గెలిచిన రాజస్థాన్

image

IPLలో భాగంగా ఈరోజు ఢిల్లీలో DCతో RR తలపడుతోంది. రాజస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 5 మ్యాచులాడి ఒకటే ఓడిన DC రెండో స్థానంలో ఉండగా 6 మ్యాచుల్లో 2 గెలిచిన RR 8వ స్థానంలో ఉంది.
DC: జేక్, పోరెల్, కరుణ్, రాహుల్, స్టబ్స్, అశుతోశ్, అక్షర్, విప్రాజ్, స్టార్క్, కుల్‌దీప్, మోహిత్
RR: సంజూ, యశస్వీ, రాణా, పరాగ్, జురెల్, హెట్మెయిర్, హసరంగ, ఆర్చర్, తీక్షణ, తుషార్, సందీప్

News April 16, 2025

మైనారిటీలంటే ముస్లింలే కాదు: కిరణ్ రిజిజు

image

భారత్‌లో మైనారిటీలంటే కేవలం ముస్లింలే కాదని, 6మతాలకు చెందినవారిని అల్పసంఖ్యాక వర్గాలుగానే పరిగణిస్తారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. మైనారిటీ శాఖ మంత్రి అయినందునే జాతీయ వక్ఫ్ కౌన్సిల్‌ ఛైర్మన్‌గా నియమించారన్నారు. కాగా ముస్లిమేతరులను వక్ఫ్ బోర్డులో నియమించడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హిందూ బోర్డుల్లో ముస్లింలను నియమిస్తారా? అని ప్రశ్నించింది.

News April 16, 2025

ALL TIME RECORD: రూ.లక్షకు చేరువలో గోల్డ్ రేట్

image

ఢిల్లీలో బంగారం ధర రూ.లక్షకు చేరువైంది. ఇవాళ సాయంత్రం రూ.1650 పెరగడంతో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ ఆల్‌టైం హైకి చేరి రూ.98,100గా నమోదైంది. US, చైనా మధ్య వాణిజ్య యుద్ధం కారణంగా ఇన్వెస్టర్లు బంగారంపైకి భారీగా పెట్టుబడులు మళ్లిస్తున్నారు. దీంతో అంతర్జాతీయ ధరకు అనుగుణంగా దేశీయంగా గోల్డ్ రేట్స్‌కు రెక్కలొచ్చాయి. అతిత్వరలోనే ఇది రూ.లక్షను తాకనున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

News April 16, 2025

15 ఏళ్ల తర్వాత మళ్లీ పాక్, బంగ్లా చర్చలు

image

పాక్, బంగ్లా మధ్య 15 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ చర్చలు ప్రారంభం కానున్నాయి. ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శులు రేపు ఢాకాలో భేటీ కానున్నారు. వాణిజ్య, భద్రతాపరమైన అంశాలపై వారు చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. బంగ్లాకు తమ ఎగుమతుల్ని పెంచే ఆలోచనలో పాక్ ఉంది. అఫ్గాన్, ఇరాన్ నుంచి కూడా ఉత్పత్తుల్ని పాక్ ద్వారా బంగ్లాకు చేరవేయాలని ఆ దేశం భావిస్తున్నట్లు సమాచారం.

News April 16, 2025

100రోజులు కాకముందే పెను విధ్వంసం: జో బైడెన్

image

వృద్ధాప్య అమెరికన్లకు కనీస ఆదాయం అందించే సోషల్ సెక్యూరిటీ ఏజెన్సీ నిధులను US ప్రభుత్వం తగ్గించిందని ఆ దేశ మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఆరోపించారు. DOGE పేరుతో వేల సంఖ్యలో ఉద్యోగాలను తొలగిస్తున్నారని ఫైరయ్యారు. ప్రస్తుత ప్రభుత్వం 100రోజుల పాలన కాకముందే ప్రభుత్వం చరిత్రలో చూడని విధ్వంసం, నష్టం సృష్టించిందని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి ప్రసంగించారు.

News April 16, 2025

‘రాజీవ్ యువ వికాసం’ నిరుద్యోగుల పాలిట గేమ్ ఛేంజర్: భట్టి

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకం నిరుద్యోగుల పాలిట గేమ్ ఛేంజర్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బ్యాంకర్లు ముందుకు వస్తే యువత ఆర్థికంగా ఎదుగుతారని, రూ.6వేల కోట్లతో పథకం అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయమై కలెక్టర్లు, బ్యాంకర్లతో సమావేశాలు ఉంటాయని తెలిపారు. కాగా ఈ పథకం దరఖాస్తు గడువు ఈ నెల 14తో ముగిసింది.

News April 16, 2025

గురూజీకి తమిళ హీరో షాక్?

image

అల్లు అర్జున్-అట్లీ సినిమా ఖరారు కావడంతో ఈ గ్యాప్‌లో ఓ సినిమా చేయడంపై డైరెక్టర్ త్రివిక్రమ్ ఫోకస్ చేశారు. ఈ క్రమంలో తమిళ హీరో శివకార్తీకేయన్‌కు ఆయన కథ చెప్పగా రెమ్యునరేషన్ రూ.70 కోట్లు అడిగినట్లు సమాచారం. ఇంత అమౌంట్ వెచ్చిస్తే వర్కౌట్ కాదని త్రివిక్రమ్ ఆసక్తి కనబరచనట్లు టాక్. దీంతో ప్రస్తుతం ఆ సినిమాను చేయట్లేదని తెలుస్తోంది. మరోవైపు వెంకీకి గురూజీ కథ చెప్పగా ఆయన ఓకే చెప్పాల్సి ఉంది.

News April 16, 2025

అమిత్‌షా కుట్ర వల్లే బెంగాల్‌లో హింస: మమత

image

పశ్చిమ బెంగాల్‌లో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల్లో హింస చెలరేగేలా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కుట్ర పన్నారని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. BSF బలగాలు బంగ్లాదేశ్ ఆగంతకులను దేశంలోకి చొరబడేలా అనుమతించాయన్నారు. అమిత్‌‌షా కేంద్ర బలగాలను తమ రాష్ట్రంపై ప్రయోగించకుండా ప్రధాని నియంత్రించాలని కోరారు. కాగా ఈ నిరసనల్లో ముగ్గురు చనిపోగా అనేకమంది గాయపడ్డారు.