India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
<<17606832>>GST<<>>లో 350 cc కంటే ఎక్కువ ఇంజిన్ కెపాసిటీ కల్గిన బైకులపై 40% పన్ను పడనుంది. అయితే ఈ మోడళ్ల సేల్స్ తక్కువని, పెద్దగా ప్రభావం ఉండదని అంచనా వేస్తున్నారు.
*రాయల్ ఎన్ఫీల్డ్: himalayan 450, Interceptor 650, continental gt 650
*బజాజ్ డామినార్ 400
*KTM డ్యూక్ 390, RC 390, అడ్వెంచర్ 390
*Kawasaki: నింజా 400, Z650 *Honda: CB500X
GST సంస్కరణలతో దాదాపు 400 రకాల గూడ్స్&సర్వీసెస్ రేట్లు ఈనెల 22 నుంచి తగ్గనున్నాయి. మరి ఇప్పటికే మార్కెట్లో ఉన్న వాటి రేట్లు తగ్గిస్తారా లేదా అన్న సందేహం నెలకొంది. అయితే ఈ సమస్యను కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లే ఎదుర్కొంటారని తెలుస్తోంది. GST తగ్గింపు ప్రయోజనాలు వినియోగదారులకు చేరాలన్న కేంద్రం ఆదేశాలతో ధరల సర్దుబాటు ప్రక్రియ స్టార్ట్ చేసినట్లు సమాచారం. కొత్త రేట్ స్టిక్కర్తో విక్రయించే అవకాశముంది.
చెన్నైకి చెందిన వైద్య దంపతుల కేసులో మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. భార్యకు ఆదాయం అధికంగా ఉంటే భర్త భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పింది. భార్యకు నెలకు రూ.30 వేలు ఇవ్వాలని విడాకుల సమయంలో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది. ఆమెకు అధికంగా ఆదాయం, ఆస్తులు ఉన్నాయని, భరణం ఇవ్వక్కర్లేదని స్పష్టం చేసింది. కుమారుడి చదువుకు డబ్బు ఇచ్చే విషయంలో కోర్టు జోక్యం చేసుకోదని పేర్కొంది.
అనుష్క ప్రధానపాత్రలో క్రిష్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఘాటీ’ ఇవాళ థియేటర్లలో రిలీజైంది. US, UK ప్రీమియర్స్ చూసిన వారు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అనుష్క పర్ఫార్మెన్స్ అదిరిపోయిందని పోస్టులు చేస్తున్నారు. ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయని చెబుతున్నారు. ఊహించే కథ, బోర్ కొట్టే సీన్స్ ఇబ్బంది పెడతాయని అంటున్నారు.
*మరికొన్ని గంటల్లో Way2News రివ్యూ.
TG: BRS ముఖ్య నేత హరీశ్ రావు రేపు లండన్ నుంచి హైదరాబాద్ రానున్నారు. అక్కడి నుంచి నేరుగా ఎర్రవల్లి ఫామ్హౌస్కు వెళ్లి అధినేత KCRతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఆయనతో చర్చించాక కవిత ఆరోపణలపై స్పందించే ఛాన్స్ ఉంది. మరోవైపు కవిత రేపు మేధావులతో మీటింగ్కు సిద్ధమయ్యారు. కాగా కాళేశ్వరంలో హరీశ్ రావు అవినీతికి పాల్పడ్డారని, పార్టీని హస్తగతం చేసుకునేందుకు కుట్రలు చేశారని కవిత ఆరోపించిన సంగతి తెలిసిందే.
పహల్గామ్ టెర్రర్ అటాక్ మాస్టర్మైండ్, లష్కరే తోయిబా కమాండర్ సైఫుల్లా కసూరి తాజా ఫొటోలు SMలో హాట్ టాపిక్గా మారాయి. పలువురు పాక్ మిలిటరీ అధికారులతో అతడు కలిసి ఉన్న ఫొటోలు బయటికొచ్చాయి. US డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్ అయిన సైఫుల్లా కశ్మీర్, అఫ్గానిస్థాన్లో ఎన్నో ఉగ్రదాడులకు పాల్పడ్డాడు. అలాంటి వ్యక్తిని మిలిటరీ అధికారులు బహిరంగంగా కలవడంతో పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నట్లు మరోసారి స్పష్టమైంది.
AP: మంత్రి నారా లోకేశ్ ఇవాళ ఢిల్లీలో PM మోదీతో భేటీ కానున్నారు. యోగాంధ్ర కార్యక్రమంపై రూపొందించిన పుస్తకాన్ని ఆయనకు అందజేస్తారు. రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలు, పెండింగ్ ప్రాజెక్టులు, రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశముంది. పలువురు కేంద్రమంత్రులతోనూ భేటీ కానున్నారు. సాయంత్రం విజయవాడ చేరుకుని గురుపూజోత్సవంలో పాల్గొంటారు. కాగా 4 నెలల వ్యవధిలో మోదీని లోకేశ్ రెండోసారి కలవనుండటం గమనార్హం.
మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో పబ్లిక్ హాలిడే ఉంది. స్కూళ్లు, కాలేజీలతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులకు సెలవు ఉండనుంది. అటు గణేశ్ నిమజ్జనాల సందర్భంగా రేపు హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్లో విద్యాసంస్థలకు ప్రభుత్వం హాలిడే ప్రకటించింది. కాగా ముస్లిం మత స్థాపకుడైన మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మిలాద్ ఉన్ నబీ జరుపుకుంటారు.
TG: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల రీసర్వే చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ వాటా కింద PM ఆవాస్ యోజన నిధులు విడుదల అయ్యేందుకు క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియ మొదలుపెట్టింది. గ్రామాల్లో ఇప్పటికే ఇళ్ల నిర్మాణం చేపట్టిన వారి వివరాలను పంచాయతీ కార్యదర్శులు మళ్లీ సేకరిస్తున్నారు. దాదాపు 60 ప్రశ్నలకు సమాధానాలను యాప్లో ఎంటర్ చేస్తున్నారు. ఇందుకు ఈనెల 9 వరకు డెడ్లైన్ విధించినట్లు తెలుస్తోంది.
AP: సీఎం చంద్రబాబు ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. ఉదయం విశాఖ నగరానికి చేరుకుని అక్కడ ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్కు హాజరుకానున్నారు. పర్యటన అనంతరం మధ్యాహ్నం విశాఖ నుంచి బయలుదేరి ఉండవల్లిలోని నివాసానికి సీఎం చేరుకుంటారు. ఆ తర్వాత సాయంత్రం విజయవాడలో జరిగే ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొంటారు.
Sorry, no posts matched your criteria.