news

News April 16, 2025

ప్రైవేటులా ప్రభుత్వ వైద్యం.. నెటిజన్ ట్వీట్ వైరల్

image

TG వైద్య సేవల తీరుపై ఓ నెటిజన్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. ఉగాది రోజున AP నుంచి HYDకి వచ్చిన ఓ వ్యక్తి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో అంబులెన్సులో ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. వెంటనే ఎక్స్‌రే, USG చేసి పేగుకు రంధ్రం ఉందని ఆపరేషన్ చేసి అతణ్ని కాపాడారు. ఇతర రాష్ట్రం అని తెలిసినా కూడా ప్రైవేటు స్థాయిలో వైద్యం అందించిన వైద్యులు, TG ప్రభుత్వం, 108 సిబ్బందికి ధన్యవాదాలు అని అతను ట్వీట్ చేశాడు.

News April 16, 2025

AI ఫొటో షేర్ చేసిన IAS స్మితకు పోలీసుల నోటీసులు

image

TG: కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని చదును చేయడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు AIని ఉపయోగించి జింకలు, నెమళ్లు దీనస్థితిలో చూస్తున్నట్లు ఫొటోలు ఎడిట్ చేశారు. అందులో MAR 31న ఓ నెటిజన్ పోస్ట్ చేసిన ఫొటోను ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు. తప్పుడు ఫొటోను షేర్ చేసినందుకు తెలంగాణ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. అయితే, నోటీసులోని విషయాలను ఇప్పుడు బయటకు చెప్పలేమని పోలీసులు తెలిపారు.

News April 16, 2025

IPL జట్లకు BCCI అలర్ట్!

image

HYDకు చెందిన ఓ వ్యాపారవేత్త IPL జట్ల ఓనర్లు, ప్లేయర్లు, కోచ్‌లను ట్రాప్ చేసేందుకు యత్నిస్తున్నట్లు BCCI గుర్తించిందని Cricbuzz పేర్కొంది. వారిని ఫిక్సింగ్ వంటి కార్యకలాపాల్లో భాగం చేయాలని అతడు చూస్తున్నాడని, జట్లన్నీ అప్రమత్తంగా ఉండాలని BCCI జట్లకు సూచించినట్లు తెలిపింది. సదరు వ్యక్తికి బుకీలతో సంబంధాలున్నాయని, అతడు ఎవరినైనా సంప్రదిస్తే తమకు రిపోర్ట్ చేయాలని జట్లను బోర్డు ఆదేశించినట్లు సమాచారం.

News April 16, 2025

సుప్రీంకోర్టు తదుపరి CJIగా గవాయ్

image

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌గా బీఆర్ గవాయ్ నియమితులయ్యారు. ప్రస్తుత సీజేఐ సంజీవ్ ఖన్నా మే 13న రిటైర్ కానుండటంతో కొలీజియం గవాయ్ పేరును సిఫార్సు చేసింది. దీంతో దేశ అత్యున్నత న్యాయస్థానం 52వ సీజేఐగా గవాయ్ మరో నెలలో బాధ్యతలు చేపట్టనున్నారు.

News April 16, 2025

ట్రంప్‌కు యాక్టింగ్ ఛాన్స్ ఇచ్చి తప్పు చేశా: డైరెక్టర్

image

ట్రంప్ నిర్ణయాలపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నవేళ హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్ కొలంబస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన చిత్రం హోమ్ ఎలోన్-2లో ట్రంప్‌కు కెమియో రోల్ ఇచ్చి తప్పుచేశానని అన్నారు. ట్రంప్ సీన్ కట్ చేయాలని ఉన్నా చేయలేనని, చేస్తే తనను దేశ బహిష్కరణ చేస్తారని అప్పుడు వేరే దేశంలో ఉండాలని అన్నారు. కాగా గతంలో తనను హోమ్ ఎలోన్-2లో నటించమని డైరెక్టర్ బతిమాలాడని ట్రంప్ అన్నారు.

News April 16, 2025

ఆ నటుడు నాతో అనుచితంగా ప్రవర్తించాడు: నటి

image

డ్రగ్స్ మత్తులో ఓ హీరో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని మలయాళ నటి విన్సీ అలోషియస్ ఆరోపించారు. ఓ లీడ్ యాక్టర్ తన ముందే డ్రెస్ మార్చుకోమని ఇబ్బంది పెట్టారని, అందరిముందే తప్పుగా మాట్లాడారని తెలిపారు. అప్పుడు ఆయన డ్రగ్స్ మత్తులో ఉన్నారని, అప్పటి నుంచి డ్రగ్స్ తీసుకునేవారితో నటించకూడదని నిర్ణయించుకున్నానని చెప్పారు. అయితే ఆ నటుడు ఎవరనేది మాత్రం విన్సీ రివీల్ చేయలేదు.

News April 16, 2025

ఫైబర్‌నెట్‌లో ఉద్యోగుల తొలగింపు

image

AP ఫైబర్‌నెట్‌లో ఉద్యోగులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సూర్య ఎంటర్‌ప్రైజెస్ ద్వారా నియమించిన వారంతా ఈ నెలాఖరులోగా రిలీవ్ కావాలని ఆదేశించింది. ఇకపై ఎలాంటి పొడిగింపు ఉండదని స్పష్టం చేసింది. తొలగించిన వారిలో 500 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఫైబర్‌నెట్ నియామకాలు ఇష్టారీతిన జరిగాయని, కొందరు ఆఫీసులకు రాకుండానే జీతాలు తీసుకున్నట్లు ప్రభుత్వం గుర్తించి చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

News April 16, 2025

బెంగాల్‌ను అప్రతిష్ఠపాలు చేసే కుట్ర: మమత

image

బెంగాల్‌ను భ్రష్టు పట్టించేందుకు కేంద్రం మీడియాను వాడుతోందని CM మమతా బెనర్జీ ఆరోపించారు. కొన్ని మీడియా సంస్థలను మోదీ పోషిస్తున్నారని విమర్శించారు. UP, కర్ణాటక, బిహార్‌, రాజస్థాన్‌కు చెందిన వీడియోలతో బెంగాల్‌ను అప్రతిష్ఠపాలు చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. యువతకు ఎన్ని ఉద్యోగాలొచ్చాయి?, పెరిగిన పెట్రోల్, డీజిల్, మెడిసిన్స్ ధరల గురించి మాట్లాడాలంటూ సవాల్ చేశారు.

News April 16, 2025

ఇన్‌స్టా ఫాలోయింగ్‌పై పూజా హేగ్డే ఇంట్రెస్టింగ్ కామెంట్స్

image

సోషల్ మీడియాలో ఉన్న ఫాలోవర్ల సంఖ్య బాక్సాఫీసును డిసైడ్ చేయలేదని హీరోయిన్ పూజా హెగ్డే అన్నారు. ‘నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 30 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండొచ్చు. కానీ వారందరూ థియేటర్లకు వస్తారని కాదు. చాలా మంది సూపర్ స్టార్లకు 5 మిలియన్ల కంటే తక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. సోషల్ మీడియాకు, వాస్తవానికి చాలా తేడా ఉందని అర్థం చేసుకోండి’ అని ఆమె తెలిపారు.

News April 16, 2025

ప్రభుత్వానికి ఇప్పుడైనా జ్ఞానం వస్తుందని ఆశిస్తున్నాం: కేటీఆర్

image

TG: కంచ గచ్చిబౌలి అడవిని పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని కేటీఆర్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడైనా జ్ఞానం వస్తుందని ఆశిస్తున్నామన్నారు. నగరంలోని 400 ఎకరాల అడవిని రక్షించడానికి విద్యార్థులు, అధ్యాపకులు అవిశ్రాంతంగా కృషి చేశారని అభినందించారు. ఆ భూముల తనఖా వ్యవహారంపై సుప్రీంకోర్టు కమిటీని రికమెండ్ చేయడం శుభపరిణామమని పేర్కొన్నారు.